
కొత్త డీజీపీ ఎవరు?
బనశంకరి: రాష్ట్ర పోలీసు దళాలకు నూతన బాస్ ఎవరనేది తేలాల్సి ఉంది. ప్రస్తుత డీజీపీ అలోక్మోహన్ నేడు బుధవారం రిటైరవుతారు. సిద్దు ప్రభుత్వం నూతన డీజీపీ ఎంపికపై కసరత్తు చేస్తోంది. రేసులో సీఐడీ డీజీపీ డాక్టర్ ఎంఏ.సలీం, ఫైర్ చీఫ్ ప్రశాంత్కుమార్ ఠాకూర్ ముందంజలో ఉన్నారు. సలీం కన్నడిగ కాగా, ఠాకూర్ బిహారీ. సలీంకు చాన్స్ ఎక్కువగా ఉంది.
బెంగళూరువాసి సలీం
డీజీపీగా అలోక్మోహన్ 2023లో నియమితులయ్యారు. తనను మరో మూడునెలల పాటు డీజీపీగా పొడిగించాలని కోరుతూ అలోక్మోహన్ పంపిన లేఖకు సానుకూల స్పందన రాలేదు. సలీం 1993 బ్యాచ్ ఐపీఎస్ కాగా, ఠాకూర్ 1992 బ్యాచ్. వీరిద్దరి పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. సలీం బెంగళూరు చిక్కబాణావర కు చెందిన కర్ణాటక కేడర్ అధికారి. గతంలో ఉడుపి, హాసన్, మైసూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. బెంగళూరులో ట్రాఫిక్, శాంతిభద్రతలలోనూ నిర్వర్తించారు. ఠాకూర్కు సీనియారిటీ ఉండడంతో ఎవరికైనా పీఠం దక్కవచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. దీంతో సిద్దరామయ్య సర్కారు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఠాకూర్, సలీం మధ్య రేసు
నేడు అలోక్మోహన్ రిటైర్మెంటు

కొత్త డీజీపీ ఎవరు?