
కులాల మధ్య చిచ్చుపై పోరాడదాం
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వానికి వెనుక బడిన వర్గాల జనాభాపై నివేదించిన నివేదికల్లో వీరశైవ లింగాయతుల జనాభా గణాంకాలను తగ్గించి కులాల విభజనకు యత్నించడాన్ని ఎలెబిచ్చాలి, మటమారి మఠాధిపతి వీరభద్ర శివాచార్యులు తప్పుబట్టారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన, జిల్లా వీరశైవ సమాజం చేపట్టిన పాదయాత్ర, విశ్వగర్జన
సభలో ఆయన మాట్లాడారు. గతంలో 27 శాతంగా ఉన్న జనాభాను కేవలం 11 శాతం మాత్రమే వీరశైవ లింగాయతులు ఉన్నట్లు నివేదికలో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో కులగణన పేరుతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య పదవిని కాపాడుకోవడానికి కుట్ర చేశారన్నారు. రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తోడు పదవిని రక్షించుకోవడానికి నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. కులగణనలో సరైన గణాంకాలు లేవన్నారు. తప్పుల తడకగా నివేదిక అందించారన్నారు. ఏనాడూ ఏ అధికారి కూడా కులగణన సమీక్షకు హాజరు కాలేదన్నారు. కాంతరాజ్ నివేదికను ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లాధికారి నితీష్కు వినతిపత్రం సమర్పించారు. ర్యాలీలో కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు, అభినవ రాచోటి శివాచార్యులు, బూది బసవ శివాచార్యులు, పంచాక్షరి, గురుమూర్తి, మహాలింగ, విరుపాక్ష పండితారాధ్య, వీర సంగమేశ్వర, శంభు సోమనాథ, శంభులింగ, పంపాపతి, కేంద్ర మాజీ మంత్రి బసవరాజ పాటిల్ అన్వరి, శాసన సభ్యులు బసనగౌడ, శివరాజ్ పాటిల్, శఽరణేగౌడ, అధ్యక్షుడు శరణు భూపాల్ నాడగౌడ, వెంకట్రావ్ నాడగౌడ, బసన గౌడ, చంద్రశేఖర్, షణ్ముకప్ప, వీరభద్ర, మల్లికార్జున, విజయ్ కుమార్లున్నారు.
కాంతరాజ్ నివేదికను తిరస్కరించాలి
విశ్వగర్జన సభలో వీరశైవుల పిలుపు

కులాల మధ్య చిచ్చుపై పోరాడదాం

కులాల మధ్య చిచ్చుపై పోరాడదాం