
శాంతికి విఘాతం కలిగించే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి
హొసపేటె: పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని అంజుమాన్ ఖిద్దత్ ఇస్లాం సమితి, ముస్లిం సమాజం తీవ్రంగా ఖండించింది. హోస్పేట్కు చెందిన అంజుమాన్ ఖిద్మత్ ఇస్లాం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నగరంలోని జైభీమ్ సర్కిల్లో కొవ్వొత్తులు వెలిగించి పహల్గాం మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. కమిటీ అధ్యక్షులు హెచ్ఎన్ మొహమ్మద్ ఇమామ్ నియాజీ మాట్లాడుతూ భారతదేశం అన్ని మతాలకు, అన్ని జాతులకు వెలుగునిచ్చే ఒక వనం లాంటిదన్నారు. శాంతికి విఘాతం కలిగించే ఉగ్రవాదులను శిక్షించాలన్నారు. భారతదేశంలో హిందువులు, ముస్లింలు సామరస్యంగా జీవిస్తున్నారన్నారు. ఉగ్రవాద వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రం కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నాయకులు నజీమ్, ఫజ్లుల్లా, రెహ్మత్, వాఖ్ బోర్డు జిల్లా అధ్యక్షుడు దాదాఫీర్ బావు, అంజుమాన్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎంఎం, ఫిరోజ్ఖాన్, తదితరులు పాల్గొన్నారు.