
వంచన, బెట్టింగ్ కేసుల్లో ఇద్దరి అరెస్ట్
కోలారు : వేర్వేరు కేసుల్లో నాగేంద్ర ప్రసాద్, సయ్యద్ సాధిక్ అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కోలారుకు చెందిన నాగేంద్ర ప్రసాద్ ఇదే నగరంలోని కారంజికట్టకు చెందిన వెంకటాచలపతిని సంప్రదించి తక్కువ ధరకు ఇంటి నివేశసం ఇప్పిస్తానని నమ్మ బలికి రూ. 50 లక్షలు తీసుకున్నాడు. స్థలం ఇప్పించకపోవడంతో నగదు వెనక్కు ఇవ్వాలని వెంకటాచలపతి డిమాండ్ చేశాడు. దీంతో నాగేంద్ర ప్రసాద్ తాళం వేసిన పాత ట్రంకు పెట్టెను ఇచ్చి అందులో డబ్బు, బంగారం ఉందని నమ్మించాడు. దానిని తెరిస్తే ఈడి, లోకాయుక్త దాడులు చేస్తారని భయ పెట్టాడు. అయితే ఇదంతా మోసం అని తెలుసుకున్న వెంకటాచలపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాగేంద్ర ప్రసాద్ను అరెస్టు చేశారు.
క్రికెట్ బెట్టింగ్దారుడి పట్టివేత
ముళబాగిలు పట్టణంలోని నూగల బండ నివాసి సయ్యద్ సాదిక్ అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా ముళబాగిలు సీఈఎన్ పోలీసులు దాడి చేశారు. అతని వద్దనుంచి రెండు మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలో ఉన్న 32 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

వంచన, బెట్టింగ్ కేసుల్లో ఇద్దరి అరెస్ట్