హత్య కేసులో జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో జైలుశిక్ష

Apr 27 2025 12:56 AM | Updated on Apr 27 2025 12:56 AM

హత్య కేసులో జైలుశిక్ష

హత్య కేసులో జైలుశిక్ష

కెలమంగలం: వివాహేతర సంబంధం గొడవతో వ్యక్తిని హత్య చేసిన ఘటనలో ఆరుమందికి జైలు శిక్ష విధిస్తూ హోసూరు కోర్టులో తీర్పునిచ్చారు. వివరాల మేరకు డెంకణీకోట తాలూకా కెలమంగలం సమీపంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన రాజ (38). ఇతని భార్య పచ్చియమ్మ (30). వీరి బంధువు ధర్మపురి జిల్లా ఎర్రపట్టి గ్రామానికి చెందిన విజి (19). విజితో పచ్చియమ్మకు వివాహేతర సంబంధం ఉండేది. విషయం తెలుసుకొన్న రాజ గత 2016లో బంధువులు ముత్తప్ప (55), మురుగేష్‌ (24), జగధీష్‌ (21), ముత్తు (23), మల్లేష్‌ (21), పొన్నుస్వామి (27)తో కలిసి విజిని హత్య చేశారు. ఈ ఘటనపై కెలమంగలం పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ కేసు విచారణ హోసూరు కోర్టులో జరుగుతూ వచ్చింది. నిందితులు ముత్తప్ప, జగదీష్‌లు గతంలో చనిపోయారు. నేరం రుజువు కావడంతో మిగతా 6 మందికి జీవితఖైదును విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement