అభివృద్ధి పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల పరిశీలన

Apr 27 2025 12:56 AM | Updated on Apr 27 2025 12:56 AM

అభివృ

అభివృద్ధి పనుల పరిశీలన

రాయచూరు రూరల్‌: నగరంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నగరసభ సభ్యులతో కలిసి కాంగ్రెస్‌ నేత రవి బోసురాజు పరిశీలించారు. శనివారం కేఈబీ కాలనీలో నగరసభ సభ్యులు జయన్న, రమేష్‌, దరూరు బసవరాజ్‌, శ్రీనివాసరెడ్డి పర్యటించి జరుగుతున్న పనులను తిలకించారు. త్వరితగతిన పనులు ముగించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. అదే విధంగా 9, 10, 11వ వార్డుల్లో పర్యటించి అధ్వానంగా మారిన మురుగు కాలువలు, రహదారులను పరిశీలించారు.

గుండెపోటుతో పురసభ అధికారి మృతి

సాక్షి,బళ్లారి: లంచం తీసుకుంటూ పట్టుబడిన పురసభ ముఖ్యాధికారి గుండెపోటుతో మృతి చెందిన ఘటన చిత్రదుర్గ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా పురసభ ముఖ్యాధికారి తిమ్మరాజు అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. మృతుడు ఈనెల 20న లంచం తీసుకుంటున్న కేసులో అరెస్ట్‌ అయ్యారు. బీ ఖాతా చేసేందుకు రూ.50 వేలు లంచం తీసుకుంటుండటంతో పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైలులో ఉన్న తిమ్మరాజు గుండెపోటుతో మరణించారు.

ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరు మృతి

ఇద్దరి పరిస్థితి విషమం

హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని బణవికల్లు గ్రామ సమీపంలోని 50వ నంబరు జాతీయ రహదారిపై రాళ్లతో నిండిన ట్రాక్టర్‌ బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని ఖాదర్‌ బాషా(32)గా గుర్తించారు. కొప్పళ జిల్లాలోని హర్లాపుర గ్రామం నుంచి దావణగెరె జిల్లాలోని డొణేహళ్లి గ్రామానికి రాతి స్తంభాలను ట్రాక్టర్‌ తీసుకెళ్తోంది. ఈ సమయంలో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి ట్రాక్టర్‌ బోల్తా పడింది. ట్రాక్టర్‌ ట్రాలీలో బండలపై కూర్చున్న ఇద్దరు వ్యక్తులపై రాళ్లు పడటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలంలో హైవే సహాయ బృందం, టోల్‌ సిబ్బంది, కానాహొసహళ్లి పీఎస్‌ఐ సిద్రామ క్షతగాత్రులకు సహాయ చర్యలు చేపట్టి వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కానాహొసహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

కాటికాపరుల నిరసన

రాయచూరు రూరల్‌: శ్మశానంలో విధులు నిర్వహించే కాటికాపరులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని కాటికాపరుల సంఘం డిమాండ్‌ చేసింది. శనివారం రాయచూరు తాలూకా శాఖవాది గ్రామపంచాయతి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు వీరేష్‌ మాట్లాడారు. శ్మశానంలో విధులు నిర్వహించే కాటికాపరులకు పంచాయితీల నుంచి పరికరాలు, దుస్తులు, షూ, సాక్సులు, చేతులకు గ్లౌజ్‌లు, ఇతర పరికరాలను అందించకుండా నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. త్వరితగతిన కాటికాపరులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారికి వినతిపత్రం సమర్పించారు.

ప్రతి కోర్‌ ఇంజినీర్‌కు

ఉద్యోగావకాశాలు

హొసపేటె: ప్రతి కోర్‌ ఇంజినీర్‌ కోసం 30 ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. కానీ విద్యార్థులు తమ ఇంజినీరింగ్‌ విద్య ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవాలని ధార్వాడ గ్లోబల్‌ ఇన్ఫోటెక్‌ టెక్నికల్‌ డైరెక్టర్‌ అనిల్‌ ఘాస్టే అభిప్రాయపడ్డారు. శుక్రవారం హొసపేటె ప్రౌఢదేవరాయ సాంకేతిక విద్యా కళాశాలలో మెకానికల్‌ విభాగం ద్వారా ఐక్యూఏసీ సహకారంతో కళాశాల అబ్దుల్‌ కలాం సెమినార్‌ హాలులో ఏర్పాటు చేసిన ఐదు రోజుల ఆటో డెస్క్‌ ప్యూజన్‌–360పై వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేవలం సాఫ్ట్‌వేర్‌లు మీరు నేర్చుకుంటే వారు నిజమైన ఇంజినీరు కాదు, ఇంజినీరింగ్‌ ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవడం, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలను నేర్చుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పారిశ్రామిక రంగంలో కోర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలకు ఐదు రెట్ల డిమాండ్‌ ఉందన్నారు. బిల్డింగ్‌ ఇన్ఫర్మేషన్‌ మోడలింగ్‌(బీఐఎం) పరిశ్రమలో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌ నిపుణుల కోసం ఒకటిన్నర లక్షల ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ రోహిత్‌, ఉపన్యాసకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల పరిశీలన 1
1/2

అభివృద్ధి పనుల పరిశీలన

అభివృద్ధి పనుల పరిశీలన 2
2/2

అభివృద్ధి పనుల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement