
ఆర్థిక సంక్షోభంలో ప్రపంచ దేశాలు
బళ్లారిటౌన్: ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని ఎస్యూసీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే.సోమశేఖర్ పేర్కొన్నారు. శనివారం ఆ పార్టీ కార్యాలయంలో పార్టీ 78వ సంస్థాపన దినోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. భారతదేశం కూడా పలు సంక్షోభాలను ఎదుర్కొందన్నారు. కమ్యూనిస్ట్లు, మార్కిస్ట్లు ఆర్థిక, రాజకీయ సిద్ధాంతాలను తమ జీవితంలో అలవరుచుకోవాలన్నారు. ఈ సిద్ధాంతాన్ని కామ్రేడ్ శివదాస్ ఘోష్ ప్రతిపాదించేవారని గుర్తు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా మతతత్వ పెట్టుబడిదారుల నియమాలను పాటిస్తోందన్నారు. కార్మికులు, రైతుల హక్కులపై దాడులు చేస్తోందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టుబడిదారుల పరంగా ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నియమాలను పాటిస్తూ ధరల పెంపుతో పేదలు, సామాన్య వర్గాల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, జిల్లా సమితి సభ్యులు మంజుల, ఏ.దేవదాసు, సోమశేఖర్గౌడ, ప్రమోద్, శాంత, గోవింద, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సంక్షోభంలో ప్రపంచ దేశాలు