కాలువలోకి ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కాలువలోకి ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరు దుర్మరణం

Apr 26 2025 12:47 AM | Updated on Apr 26 2025 12:47 AM

కాలువ

కాలువలోకి ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరు దుర్మరణం

రాయచూరు రూరల్‌: కూలి పనులు ముగించుకొని వ్యవసాయ కూలీలు ఇంటికెళుతుండగా ట్రాక్టర్‌ అదుపు తప్పి కాలువలోకి బోల్తా పడ్డ ఘటనలో ఒకరు మరణించగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాయచూరు జిల్లాలో గురువారం సాయంత్రం మస్కి తాలూకా హాలాపూర్‌ వద్ద జరిగింది. ప్రతి రోజు ట్రాక్టర్‌లో 15–20 మంది దాకా వ్యవసాయ కూలీలను తీసుకెళ్లి పనులు ముగిసిన తర్వాత అదే వాహనంలో తిరిగి వచ్చేవారు. డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ట్రాక్టర్‌ అదుపు తప్పి తుంగభద్ర కాలువలోకి పడిపోయింది. ఈ ఘటనలో అంబమ్మ(46) అనే మహిళ అక్కడికక్కడే మరణించింది. గాయపడిన ఆరుగురు కూలీలను చికిత్స కోసం కవితాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేష్‌ నాయక్‌ తెలిపారు.

ఆరుగురికి తీవ్ర గాయాలు

మస్కి తాలూకాలో ఘటన

కాలువలోకి ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరు దుర్మరణం 1
1/1

కాలువలోకి ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరు దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement