అశ్రుతర్పణం | - | Sakshi
Sakshi News home page

అశ్రుతర్పణం

Apr 25 2025 8:08 AM | Updated on Apr 25 2025 8:08 AM

అశ్రు

అశ్రుతర్పణం

శుక్రవారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

శివమొగ్గ/ శివాజీనగర: జమ్ముకశ్మీర్‌ విహారయాత్రకు వెళ్లి ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బలైన శివమొగ్గ నగరవాసి మంజునాథరావు, బెంగళూరు మత్తికెరెవాసి భరత్‌ భూషణ్‌లకు బంధుమిత్రులు, ప్రజలు కన్నీటి నివాళులర్పించారు. వారి భౌతికకాయాలు గురువారం ఉదయం బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరాయి. అక్కడ కుటుంబసభ్యులు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. అధికారులు ప్రత్యేక వాహనాల్లో వారి స్వస్థలాలకు పంపించారు.

శివమొగ్గలో మంజునాథరావు భౌతిక కాయానికి గురువారం మధ్యాహ్నం రోటరీ చితాగారంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. బెంగళూరు నుంచి పార్థివ దేహాన్ని అంబులెన్స్‌ ద్వారా నగరానికి తీసుకొచ్చారు. నగరంలోని హొళె బస్టాండ్‌ సమీపం నుంచి బైక్‌ ర్యాలీ, ఊరేగింపు ద్వారా పార్థివ దేహాన్ని విజయనగర బడావణెలోని నివాసానికి తరలించారు. మంజునాథరావు పార్థివదేహం ఆయన నివాసానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. అంతిమ దర్శనానికి జనం పోటెత్తారు. తరువాత ప్రధాన రోడ్ల గుండా ఊరేగింపుగా అంత్యక్రియలకు తరలించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, జిల్లా మంత్రి మధు బంగారప్ప, ఎంపీ బీవై రాఘవేంద్ర తదితర ప్రముఖులు నివాళులర్పించారు. హిందూ సంఘాల కార్యకర్తలు బైక్‌ ర్యాలీ జరిపారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను జేసీబీకి ఉరివేసి ఆక్రోశం వ్యక్తం చేశారు.

కశ్మీర్‌లో బలైన ఇద్దరు కన్నడిగుల

మృతదేహాల తరలింపు

బెంగళూరు, శివమొగ్గలో శోకసంద్రం

గవర్నర్‌, సీఎం సహా ప్రముఖుల నివాళులు

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

పాక్‌ ముష్కరుల అకృత్యంపై జనాగ్రహం

అశ్రుతర్పణం1
1/2

అశ్రుతర్పణం

అశ్రుతర్పణం2
2/2

అశ్రుతర్పణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement