
ఐశ్వర్యగౌడకు ఈడీ షాక్
బనశంకరి: ఈడీ అధికారులు గురువారం బెంగళూరులో పలుచోట్ల ఆకస్మిక దాడులను జరిపారు. మాజీ ఎంపీ డీకే.సురేశ్ సోదరినంటూ పలు నగల షోరూంల నుంచి భారీగా బంగారు నగలు కొట్టేసిన కేసులో నిందితురాలు ఐశ్వర్యగౌడకు చెందిన బెంగళూరు, మండ్య నివాసాలపై ఈడీ అధికారులు దాడిచేశారు. మండ్య జిల్లా మళవళ్లి తాలూకా కిరుగావలు గ్రామంలోని ఇల్లు, బెంగళూరులోని ఇళ్లలో సోదాలు జరిపి ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారు షాపు యజమాని ఆడియో, వీడియోలతో సహా ఆమైపె ఈడీకి ఫిర్యాదులు చేశాడు. రూ.9.82 కోట్ల విలువచేసే 14 కిలోల 660 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని డబ్బు ఇవ్వలేదని చంద్రాలేఔట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఉంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై
ధార్వాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని ఆయన నివాసంలో తనిఖీలు చేశారు. వినయ్ కులకర్ణి జిల్లాలో ఓ జడ్పీ సభ్యుని హత్య కేసులో నిందితునిగా ఉన్నారు. ఆయనపై పలు ఫిర్యాదులు రావడంతో ఈడీ దాడి చేసినట్లు తెలిసింది.
మండ్య, బెంగళూరు ఇళ్లలో సోదాలు