
సీ్త్రలకూ సమాన హక్కులు అవసరం
రాయచూరు రూరల్: సదృఢ సమాజ నిర్మాణం కోసం పురుషులతో సీ్త్రలకు కూడా సమాన హక్కులు అవసరమని దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్, కిల్లె బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. బుధవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ఏర్పాటు చేసిన అఖిల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. మహిళల హక్కులు, విధులు, సమానత్వం, విద్య, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు వీలుందన్నారు. మహిళల స్వేచ్ఛకు హద్దులు ఉండాలన్నారు. జిల్లాలోని 85 మంది మహిళా ఉద్యోగుల పదాధికారుల పదగ్రహణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు రోశని గౌడ, మహిళా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లాధ్యక్షురాలు విజయలక్ష్మి పాటిల్, సభ్యులు గంగమ్మ, సంగమ్మ, పార్వతి, వాణిశ్రీ తోటమ్మ, ఈరమ్మ, శ్రీదేవిలున్నారు.
ఉగ్రదాడిని ఖండిస్తూ నిరసన
రాయచూరు రూరల్: జమ్మూకశ్మీర్లో బైసారన్, పహల్గాంల మధ్య ఉగ్రవాదులు జరిపిన దాడి ఖండనీయమని హరిహర సేవా ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. గురువారం సిరవారలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రమేష్ మాట్లాడారు. పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం లభించేలా చూడాలన్నారు. ఈ విషయంలో ప్రత్యేక విచారణ చేపట్టి తప్పు చేిసిన వారికి ఉరిశిక్ష వేయాలని ఒత్తిడి చేశారు. బ్రాహ్మణ విద్యార్థులకు జంధ్యం విషయంలో జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ రాష్ట్ర గవర్నర్కు తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు.
ఎస్యూసీఐ సంస్థాపక దినోత్సవం
రాయచూరు రూరల్: నగరంలో ఎస్యూసీఐ సంస్థాపక దినోత్సవం, ప్రజా వ్యతిరేక దినోత్సవాలను ఆచరించారు. బుధవారం నగరంలోని జవహర్ నగర్ కాలనీ కార్యాలయం వద్ద శివదాస్ ఘోష్ జయంతి, ఎస్యూసీఐ 78వ సంస్థాపక దినోత్సవాలను నిర్వహించారు. బీజేపీ, జేడీఎస్ల వల్లే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం, ఏపీఎంసీ, కార్మిక, విద్యుత్, కార్పొరెట్ చట్టాలను జారీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కులగణన పేరుతో కులాల మధ్య చిచ్చుపెట్టడం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంపై నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీరేష్, చెన్నబసవ, అయ్యాళప్ప, వినోద్ కుమార్, బసవరాజ్, సరోజ, పీర్ సాబ్, నందగోపాల్, హేమంత్, అమోఘ, మహేష్లున్నారు.
కశ్మీర్ మృతులకు సంతాపం
రాయచూరు రూరల్: జమ్మూకశ్మీర్లోని బైసారన్, పహల్గాంల మధ్య మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన వారికి బీజేపీ ఆధ్వర్యంలో సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర మాట్లాడారు. కశ్మీర్లోని పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం లభించేలా చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక విచారణ చేపట్టి తప్పు చేిసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
నరసాపుర– బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు సేవలు
హుబ్లీ: వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నరసాపుర– బెంగళూరు సర్ ఎం విశ్వేశ్వరయ్య టర్మినల్ స్టేషన్ల మధ్య సంచరించే వీక్లీ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లను వచ్చే నెల 9 నుంచి ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ రైలు సేవలు మే 9 నుంచి జూన్ 27 వరకు, అలాగే మరో రైలును మే 10 నుంచి జూన్ 28 వరకు రాకపోకలను సాగిస్తాయని తెలిపారు. ఈ రైళ్ల రాకపోకల సమయాల్లో ఎటువంటి మార్పు ఉండదు. రైలు (సంఖ్య..02811) యలహంక జంక్షన్కు రాత్రి 11.18 గంటలకు చేరుకొని 11.20 కు బయలుదేరుతుంది. అలాగే రైలు (సంఖ్య..02812) యలహంక జంక్షన్కు ఉదయం 4.50 గంటలకు చేరుకొని 4.52 గంటలకు బయలుదేరి వెళ్లనుందని రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

సీ్త్రలకూ సమాన హక్కులు అవసరం

సీ్త్రలకూ సమాన హక్కులు అవసరం

సీ్త్రలకూ సమాన హక్కులు అవసరం