ఉద్యోగాలిప్పిస్తానంటూ లక్షల్లో మోసం.. వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలిప్పిస్తానంటూ లక్షల్లో మోసం.. వ్యక్తి అరెస్ట్‌

Apr 23 2025 8:05 AM | Updated on Apr 23 2025 8:47 AM

ఉద్యోగాలిప్పిస్తానంటూ  లక్షల్లో మోసం.. వ్యక్తి అరెస్ట్‌

ఉద్యోగాలిప్పిస్తానంటూ లక్షల్లో మోసం.. వ్యక్తి అరెస్ట్‌

బళ్లారిఅర్బన్‌: సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని ఇప్పిస్తానంటూ నగరానికి చెందిన శివరామ నుంచి రూ.3.75 లక్షలను ఆన్‌లైన్‌ ద్వారా తీసుకొని మోసగించిన నిందితుడిని బళ్లారి సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం నివాసి కోనగుంట్ల సాయికుమార్‌గా గుర్తించారు. వై.భీమేష్‌కుమార్‌, అతడి స్నేహితుడు శివరామలకు ఆన్‌లైన్‌లో పరిచయం అయిన నిందితుడు సాయికుమార్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి రూ.3.75 లక్షలను ఆన్‌లైన్‌లో తీసుకొని తమను మోసగించినట్లుగా నిందితులిచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ డాక్టర్‌ సంతోష్‌ చవాన్‌, సీఐ రమాకాంత్‌, సిబ్బంది సుధాకర్‌, సురేష్‌, తిమ్మరాజులతో కూడిన బృందం నిందితుడు సాయికుమార్‌ను గాలించి పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.2.50 లక్షలను జప్తు చేశారు. కాగా నిందితుడిని పట్టుకున్న పోలీస్‌ బృందాన్ని జిల్లా ఎస్పీ శోభారాణి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement