టీబీ డ్యాం 19వ గేటు నిర్మాణానికి శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

టీబీ డ్యాం 19వ గేటు నిర్మాణానికి శ్రీకారం

Apr 23 2025 8:05 AM | Updated on Apr 23 2025 8:47 AM

టీబీ డ్యాం 19వ గేటు నిర్మాణానికి శ్రీకారం

టీబీ డ్యాం 19వ గేటు నిర్మాణానికి శ్రీకారం

హొసపేటె: తుంగభద్ర జలాశయంలోని 19వ గేటు వద్ద ఏర్పాటు చేసిన స్టాప్‌లాగ్‌ను తొలగించి శాశ్వత క్రస్ట్‌గేట్‌ను నిర్మించడానికి గుజరాత్‌కు చెందిన హార్డ్‌వేర్‌ టూల్స్‌ అండ్‌ మిషనరీ కంపెనీ టెండర్‌ దక్కించుకొందని తుంగభద్ర మండలి ఎస్‌ఈ నారాయణ నాయక్‌ తెలిపారు. సోమవారం మండలి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన హార్డ్‌వేర్‌ టూల్స్‌ అండ్‌ మెషినరీ ప్రాజెక్ట్స్‌ కంపెనీకి చెందిన ఇంజినీరింగ్‌ నిపుణుడు ఈరోజు డ్యాంకు చెందిన 19వ గేట్‌ను వీక్షించారన్నారు. పక్కా పకడ్బందీగా గేట్‌ నిర్మాణంపై కంపెనీ దృష్టి పెట్టనుందని తెలిపారు. త్వరలోనే గేట్‌ నిర్మాణ పనులను కంపెనీ చేపడుతుందన్నారు. ఈ నెల 17వ ఈ– టెండర్‌ బిడ్‌ను తెరవగా ఒక గుజరాతీ కంపెనీ టెండర్‌ను గెలుచుకుందని తెలిపారు. 19వ గేట్‌ నిర్మాణానికి సుమారు రూ.15 కోట్లను ఖర్చు చేపడుతున్నామన్నారు. ఈ కంపెనీ మైసూరులోని కేఆర్‌ఎస్‌ ఆనకట్ట గేట్లను నిర్మించిందని తెలిపారు. అలాగే తుంగభద్ర జలాశయం 19వ క్రస్ట్‌గేట్‌ వద్ద స్టాప్‌లాగ్‌ను ఏర్పాటు చేసిందన్నారు. మిగతా 32 క్రస్ట్‌ గేట్ల నిర్మాణానికి తుంగభద్ర బోర్డు ఈ–టెండర్లను కూడా పిలిచిందన్నారు. ఈ నెల 28తో టెండర్‌ గడువు ముగుస్తుందని తెలిపారు.

శాశ్వత గేటు నిర్మాణం గుజరాత్‌

కంపెనీకి అప్పగింత

మిగతా 32 క్రస్ట్‌గేట్ల నిర్మాణానికి ఈ–టెండర్ల పిలుపు

టీబీ బోర్డు సూపరింటెండింగ్‌

ఇంజినీర్‌ నారాయణ నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement