
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
బీబీపేట : రోజురోజుకీ పెరుగుతున్న మాంసం వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని పశువుల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మాంసం ఉత్పత్తిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. పశువులతోపాటు మేత, దాణా లభ్యతను పెంచేందుకు సైతం జాతీయ పశు సంపద మిషన్ (ఎన్ఎల్ఎం) ద్వారా రుణ అవకాశం కల్పిస్తోంది.
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీం ద్వారా రుణాలు
పశువుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీం(ఎన్ఎల్ఎం) ద్వారా రుణాలను మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా గొర్రె లు, మేకలు, పొట్టేళ్లు, పందులు, నాటుకోళ్లు, పుంజులతోపాటు పశుగ్రాసం, దాణా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం కల్పించనుంది. 2021–22 ఆర్ధిక సంవత్సరంలో ప్రారంభమైన ఈ పథకాన్ని పశుసంవర్ధక శాఖ అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. పశువుల పెంపకానికి ఆసక్తి ఉన్న వారికి సబ్సిడీ రుణాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తోంది.
రూ.10లక్షల నుంచి 50 లక్షల వరకు సబ్సిడీ
ఎన్ఎల్ఎం పథకం ద్వారా రూ.10లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సబ్సిడీని మంజూరు చేస్తుంది. లబ్ధిదారుడికి విడతల వారీగా సబ్సిడీ అందించనున్నారు. యూనిట్ నెలకొల్పి న తర్వాత సబ్సిడీ వచ్చే వరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పర్యవేక్షిస్తుంది.
ఎన్ఎల్ఎం అందించే పథకం, రాయితీ వివరాలు..(రూ.లలో)
మాంసం ఉత్పత్తి పెంచే దిశగా చర్యలు
రూ. 50లక్షల వరకు రుణాలపై రాయితీ
ఆన్లైన్ విధానంలో
దరఖాస్తులకు ఆహ్వానం
అవగాహన లేకపోవడంతో
అందని పథకం
ఎన్ఎల్ఎం పథకానికి ఆసక్తిగల వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తరువాత విచారణ చేపట్టి రుణం మంజూరు చేస్తారు. అలాగే పశువుల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేస్తుంది. దీని ద్వారా రైతులు లబ్ధి పొందడంతోపాటు వారి జీవనాభివృద్ధికి ఉపయోగపడుతుంది.
– సంజయ్, జిల్లా పశువైద్యాధికారి, కామారెడ్డి