
ఎమ్మెల్సీలకు సన్మానం
కామారెడ్డి టౌన్: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డిలతోపాటు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ, నిరుద్యోగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కానికి కృషి చేస్తామన్నారు. అనంతరం అహిల్యా బాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి వేడుకలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తపస్ రాష్ట అధ్యక్ష, కార్యదర్శులు హన్మంత్రావు, సురేష్, జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి, నాయకులు పాలేటి వెంకట్రావు, రవీంద్రనాథ్, రమేష్ కుమార్, భాస్కరాచారి, రాంచంద్రం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.