
ముస్తాబు.. స్వాగతం
వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు గురువారం బడిబాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయులు ముస్తాబు చేసి విద్యార్థులకు స్వాగతం పలికారు. మామిడి కొమ్మలు, బెలూన్లు, పూలతో బడుల ప్రాంగణాలను అలంకరించారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పూల అందజేసి స్వాగతం పలికారు. పలు మండలాల్లో పాఠశాలలను డీఈఓ రాజేందర్, ఎంఈఓలు సందర్శించి విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాంలు అందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను పాఠశాలలకు ఆహ్వానించి పండగ వాతావరణంలో పాఠశాలలను పున:ప్రారంభించారు. స్కూళ్ల వద్ద సందడి వాతావరణం కనిపించింది.
–భూపాలపల్లి అర్బన్