
రాయబంధంలో మావోయిస్టు సభ్యురాలికి చికిత్స
● రెండు రోజుల్లో ఎస్పీ ఎదుట హాజరు
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రాయబంధంలో మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలు మడకం చిట్టి అలియాస్ కీడో రహస్యంగా చికిత్స పొందుతోంది. ఇటీవల కర్రెగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె ఎడమ కాలుకు బుల్లెట్ తగలడంతో ములుగు జిల్లా చిన్నబోయినపల్లి పంచాయతీ పరిధిలోని రాయబంధం గొత్తికోయగూడెనికి చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు లొంగిపోయేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా, ఆమె కాలుకు గాయం కావడంతో చికిత్స కూడా చేయిస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దామోదర్ రక్షణ స్థాయిలో పనిచేసే సెంట్రీగా ఆమెను పోలీసులు భావిస్తున్నారు. చిట్టి అరెస్టును పోలీసులు మరో రెండు రోజుల్లో చూపెట్టి ఎస్పీ ఎదుట హాజరుపర్చిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.
అనామక ఫిర్యాదులపై
విచారణ
హన్మకొండ: అనామక ఫిర్యాదులపై సీవీసీ నిబంధనల ప్రకారం ప్రాథమిక విచారణ చేపట్టిన తర్వాత, అందులో వాస్తవాలు నిర్ధారణ అయితేనే శాఖా పరమైన చర్యలు చేపడుతామని టీజీ ఎన్పీడీసీఎల్ హెచ్ఆర్డీ చీఫ్ ఇంజనీర్ టి.మధుసూదన్ స్పష్టం చేశారు. యా జమాన్యానికి వచ్చే అనామక ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, ఆరోపణల్లో ప్రాధాన్యం ఉంటే సీవీసీ నిబంధనల ప్రకారం విచారణ చేపట్టడానికి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్కు పంపిస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజిలెన్స్ విచారణలో వెలుగు చూసే అంశాల ఆధారంగా చర్యలుంటాయని తెలిపారు. విచా రణలో ఆరోపణలు అవాస్తవాలు అని నిరూపితమైతే ఎలాంటి శాఖాపరమైన చర్యలుండవని తెలిపారు. ఆరోపణలు వాస్తవమని నిరూపితమైతేనే చర్యలు తీసుకుంటామని వివరించారు.