సంక్షేమం వైఎస్సార్‌ సీపీతోనే సాధ్యం | Sakshi
Sakshi News home page

సంక్షేమం వైఎస్సార్‌ సీపీతోనే సాధ్యం

Published Thu, May 9 2024 8:35 AM

సంక్షేమం వైఎస్సార్‌ సీపీతోనే సాధ్యం

మంగళగిరి: సంక్షేమం, అభివృద్ధి వైఎస్సార్‌ సీపీతోనే సాధ్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర గ్రంధాలయ పరిషత్‌ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావు పేర్కొన్నారు. నగర పరిధిలోని పెదవడ్లపూడిలో బుధవారం వైఎస్సార్‌ సీపీ అసెంబ్లీ అభ్యర్థి మురుగుడు లావణ్య విజయాన్ని కాంకిస్తూ ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి కేటాయించారని వివరించారు. సమ సమాజం కొరకు కృషి చేస్తున్న వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎంగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ అభ్యర్థి అయిన మురుగుడు లావణ్యకు పెత్తందారుడు లోకేష్‌కు మధ్య పోటీలో లావణ్యకు అండగా నిలవాలని కోరారు. అభ్యర్థి మురుగుడు లావణ్య మాట్లాడుతూ సంక్షేమాన్ని అందించాలంటే వైఎస్సార్‌ సీపీని గెలిపించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు క మల, ఆప్కో మాజీ చైర్మన్‌ గంజి చిరంజీవి, స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు

Advertisement
 
Advertisement
 
Advertisement