దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడుదాం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఏపీ రైతుకూలీ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు అన్నారు. గోదావరి లోయ ప్రతిఘటన పోరాట ఉద్యమ నిర్మాత చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా స్థానిక యూటీఎఫ్ హోమ్లో శనివారం అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత బాలాజీ చెరువు సెంటర్ నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, జెడ్పీ సెంటర్, కలెక్టరేట్ మీదుగా సభాస్థలి వరకు కార్మికులు, కర్షకులు ప్రజా సంఘాల శ్రేణులు ఎర్రజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు మాట్లాడుతూ సమాజంలో ఒక మనిషిని మరో మనిషి, ఒక జాతిని మరో జాతి పీడించే సాంఘిక ధర్మం కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కుంచె అంజిబాబు, అధ్యక్షులు మడకి సత్యం, ఉపాధ్యక్షులు నారాయణమూర్తి, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు రెడ్డి దుర్గాదేవి పాల్గొన్నారు.


