హోరాహోరీగా బేస్బాల్ పోటీలు
పలమనేరు : పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 69వ స్కూల్ గేమ్స్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో సాగుతున్న బేస్బాల్ అండర్–14 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఈ పోటీలకు 500 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆదివారం జరిగిన బాలుర పోటీల్లో శ్రీకాకుళంపై విజయనగరం, వెస్ట్ గోదావరిపై ఈస్ట్ గోదావరి, ప్రకాశం జట్టుపై చిత్తూరు జట్టు ఘన విజయం సాధించింది. నేడు జరిగే పోటీల్లో బాలికల విభాగంలో చిత్తూరు–అనంతపూర్, శ్రీకాకుళం–ఈస్ట్గోదావరి, గుంటూరు– విజయనగరం, కడప–వైజాగ్ జట్ల మధ్య క్వార్టర్స్ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆపై సెమీస్, ఫైనల్స్ ఉంటాయన్నారు. ఇందులో నిర్వాహకులు బాబు, సాంబశివ, శశి, ప్రకాష్, స్థానిక హెచ్ఎం షంషీర్ తదితరులు పాల్గొన్నారు.


