
అక్రమ కట్టడం తొలగింపు
భద్రాచలంటౌన్: ఐడీటీఏ రోడ్లోని రాజీవ్ నగర్కాలనీలో ఉన్న శ్రీ కుసుమ హరినాథ్బాబా దేవస్థానం భూమిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని పాలకమండలి ఆధ్వర్యంలో సోమవారం తొలగించారు. సర్వే నంబర్ 91/1లో ఆలయానికి చెందిన పట్టా భూమి 3–57 సెంట్ల విస్తీర్ణంలో ఉంది. ఖాళీ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణానికి సెంట్రింగ్ పెట్టగా పాలక మండలి ఆధ్వర్యంలో తొలగించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ శ్రీనివాస్, సభ్యులు తంబళ్ల కృష్ణార్జున రావు, సీత, ఆలయ ఈఓ జి. సుదర్శన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సెక్యూరిటీ గార్డులకు పరుగు పందెం
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని ఖాళీగా ఉన్న 10 ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు పోస్టుల నియామకానికి సోమవారం పరుగు పందెం నిర్వహించారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరిగి న ఈ పరుగు పందెంలో 240 మంది పాల్గొనగా, ఉత్తమ ప్రతిభ చూపిన 10 మందిని ఎంపిక చేశారు. వీరికి మెడికల్ చెకప్ నిర్వహించి, సర్టిఫికెట్లు పరిశీలించాక నియామకాలు చేపట్టనున్నారు.
80 మందికి జరిమానా
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం జిల్లా కోర్టులో 80 మందికి జరిమానా విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమ ల్లు సోమవారం తీర్పుచెప్పారు. కొత్తగూడెం వన్ టౌన్, టూటౌన్, త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో వాహన చోదకులను బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు తేలడంతో కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జరిమానా విధించారు.
కరోనా మృతుడి
కుటుంబానికి ఎక్స్గ్రేషియో
సింగరేణి(కొత్తగూడెం): కోవిడ్–19లో సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా రైటర్బస్తీలో కరోనా బారిన పడి సివి ల్ విభాగం కాంట్రాక్ట్ కార్మికుడు కొదురుపాక శ్రీనివాస్ మృతిచెందా డు. మృతుడి కుటుంబ సభ్యులు కొదురుపాక రాజకుమారి తదితరులకు సోమవారం సివిల్ కార్యాలయం వద్ద సివిల్ డీజీఎం పి.రాజశేఖర్, గుర్తింపు కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి ఎస్వీ రమణమూర్తి, ఉపాధ్యక్షులు క్రిష్టాఫర్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో
పాడి గేదె మృతి
పాల్వంచరూరల్: మేతకు వెళ్లిన పాడి గేదె విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. మండల పరిధిలోని పాండురంగాపురం గ్రామ శివారులో సోమవారం ఈ సంఘటన జరిగింది. రూ.లక్ష నష్టం వాటిలినట్లు బాధిత రైతు జక్కుల వెంకటయ్య తెలిపాడు.
మట్టి లారీ స్వాధీనం
పాల్వంచరూరల్: అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న లారీని, జేసీబీని రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు. తహసీల్దార్ దారా ప్రసాద్ కథనం ప్రకారం... మండల పరిధిలోని భోజ్యాతండా సమీపంలో మొర్రేడు వాగు చెక్కు డ్యామ్ వద్ద నుంచి మట్టిని తరలిస్తున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వారి ఆదేశాలతో ఆదివారం రాత్రి రూరల్ ఆర్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని మట్టి లారీని, జేసీబీని పట్టుకున్నారు.
చికిత్స పొందుతున్న
వ్యక్తి మృతి
కారేపల్లి: మద్యానికి బానిసైన వ్యక్తి పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారేపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన ఉమాకర్(35) భార్య కొన్నేళ్ల అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి మనస్తాపంతో బాధపడుతున్న ఆయన మద్యానికి బానిస కాగా, ఒంటరిగా నివసిస్తున్నాడు. ఆయన తండ్రి, తమ్ముడు ఖమ్మంలో నివసిస్తున్నారు. ఈనెల 8వ తేదీన ఉమాకర్ పురుగుల మందు తాగగా గమనించిన స్థానికులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా, ఆయన తండ్రి వెంకటనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అక్రమ కట్టడం తొలగింపు

అక్రమ కట్టడం తొలగింపు