రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

Jun 7 2025 12:16 AM | Updated on Jun 7 2025 12:16 AM

రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

అశ్వారావుపేటరూరల్‌: వేగంగా వస్తున్న రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. స్థానిక ఎస్సై యయాతిరాజు కథ నం ప్రకారం.. శుక్రవారం హై దారాబాద్‌ నుంచి ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి సరుకుల లోడుతో వెళ్తున్న లారీ, ఏపీలోని రాజమండ్రి నుంచి సూర్యాపేట వస్తున్న మరో లారీ.. అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం సమీపంలో పామాయిల్‌ ఫ్యాక్టరీ వద్ద అదుపు తప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తాడేపల్లిగూడేనికి చెందిన లారీ డ్రైవర్‌ నాగమల్లేశ్వరరావుకు తీవ్రగాయాలు కాగా, స్థానికులు అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికు తరలించారు. ఈ ఘటనలో జాతీయ రహదారిపై అడ్డంగా బోల్తా పడిన లారీతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరా యం ఏర్పడింది. జేసీబీల సాయంతో లారీని పక్కకు తొలగించారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో జరిమానా

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): అతిగా మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులలో శుక్రవారం కొత్తగూడెం కోర్టులో 26 మందికి జరిమానా విధిస్తూ స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ మెండు రాజమల్లు తీర్పు చెప్పారు. కొత్తగూడెం వన్‌టౌన్‌ ఎస్‌ఐ తుంగ రాజేష్‌ తెలిపిన వివరాలు.. ట్రాఫిక్‌ ఎస్‌ఐ కె.నరేష్‌ పర్యవేక్షణలో వాహనాల తనఖీలు నిర్వహిస్తుండగా పది మంది, పాల్వంచ టౌన్‌ ఎస్‌హెచ్‌ఓకు సుమన్‌ వాహన తనఖీలు చేస్తుండగా ఒకరు, కొత్తగూడెం టూటౌన్‌ ఎస్‌హెచ్‌ఓ టి.రమేష్‌కుమార్‌, ఎస్‌ఐలు మహ్మద్‌ కేఎం ఆలీ ఖాన్‌, బి.కిషోర్‌ అప్పటి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.సెల్వరాజ్‌ తమ బృందంతో వాహ న తనిఖీలు నిర్వహిస్తుండగా.. 15మంది మొత్తం 26 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. బ్రీత్‌ ఎనలైజర్‌ ద్వారా పరీక్షించగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. ఈ కేసులు కోర్టులో రుజువు కావడంతో జరిమానా విధించారు. వీరంతా జరిమానా చెల్లించారు.

అర్ధరాత్రి అపరిచితుడి సంచారం

అశ్వారావుపేటరూరల్‌: వినాయకపురం కాలనీ గ్రామంలో గురువారం అర్ధరాత్రి సంచరిస్తున్న 60 ఏళ్ల వృద్ధుడిని దొంగ అనే అనుమానంతో గ్రామస్తులు పట్టుకున్నారు. వృద్ధుడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అతడిని విద్యుత్‌ స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన స్థలానికి వచ్చిన స్థానిక అదనపు ఎస్సై రామ్మూర్తి, సిబ్బంది కలిసి అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. కాగా, మతిస్థిమితం లేని వృద్ధుడిగా గుర్తించి వదిలేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement