లక్ష్మీనాయుడు హత్య కేసు నీరుగార్చే కుట్రలు | JAC of Kapu and Balija associations on Tirumalasetti Lakshminaidu case | Sakshi
Sakshi News home page

లక్ష్మీనాయుడు హత్య కేసు నీరుగార్చే కుట్రలు

Oct 25 2025 5:14 AM | Updated on Oct 25 2025 5:14 AM

JAC of Kapu and Balija associations on Tirumalasetti Lakshminaidu case

విచారణ లోపభూయిష్టంగా సాగుతోంది

కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలి

కాపు, బలిజ సంఘాల జేఏసీ డిమాండ్‌

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): కాపు సామాజిక వర్గానికి చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హ­త్య కేసును నీరు గార్చే యత్నాలు జరుగుతున్నా­యని కాపు, బలిజ సంఘాల జేఏసీ ఆందోళన వ్య­క్తం చేసింది. విచారణ లోపభూయిష్టంగా సా­గు­తోందని, సా­క్ష్యా­లు సక్రమంగా సేకరించడం లే­దని ఆరోపించింది. లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రకటించిన ఆర్థిక సా­యాన్ని పెంచడంతోపాటు జు­్యడీషియల్‌ లేదా సీ­బీ­ఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేసింది. శు­క్ర­వారం విజయవాడలో­ని ఐలాపురం కన్వెన్షన్‌ హా­లులో నిర్వహించిన కాపు, బలిజ సంఘాల ఆత్మీయ సమావేశంలో రా­ష్ట్రంలో కాపులపై జరుగుతున్న దాడులు, కార్యాచర­ణపై జేఏసీ నేతలు చర్చించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకుడు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన హరిచంద్రప్రసాద్‌ వల్ల తనకు ప్రాణ హాని ఉందని లక్ష్మీనాయు­డు గుడ్లూరు పోలీసులకు మొర పెట్టుకున్నా ప­ట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో హరిచంద్ర ప్రసాద్‌ తన కారుతో తొక్కించి అతి దారుణంగా హ­త్య చేశాడన్నారు. అక్టోబర్‌ 2న ఘటన జరిగితే పది రోజుల వరకు ప్రభుత్వం స్పందించలేదన్నా­రు. కాపు, బలిజ సంఘాల నేతలు అక్కడికి వెళ్లి నిల­దీస్తే నామమాత్రంగా కేసు నమోదు చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే రూ.50 లక్షలు తీసుకుని ఓ మంత్రి ద్వారా కేసును నీరు గార్చే యత్నం చేస్తున్నారని జేఏసీ నేత ఆమంచి స్వాములు ఆరోపించారు. 

హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చి­త్రీ­­కరించే యత్నాలు చేశారన్నారు. కాపు, బలిజ సంఘాల ఆందోళన వల్లే లక్ష్మీనాయుడు హత్య వె­లు­గులోకి వచ్చిందన్నారు. ఎవరి తాత సొమ్ము అ­ని ఆర్థిక సాయం చేస్తున్నారంటూ రిటైర్డ్‌ ఐపీఎ­స్‌ ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య జరి­గితే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, బ్రాహ్మణి ఆయన ఇంటికి వెళ్లి రూ.కోటి ఆర్థిక సహాయం చేసిన విషయం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. కుల రాజ­కీయాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చే­య­డం సరి­కాదని జేఏసీ నేత దాసరి రాము పేర్కొన్నారు. 

హత్య జరిగిన పది రోజులకు కూడా ప్రభుత్వం పట్టించుకోనందు వల్లే తాము వెళ్లాల్సి వచ్చిందన్నారు. బాధితుడి కుటుంబానికి న్యా­యం చేయాలనే తాము డిమాండ్‌ చేస్తున్నామన్నా­రు. మానవీయ కోణంలోనే పరిహారం పెంచాలని కోరు­తున్నట్లు చెప్పారు. వీర­య్య చౌదరి కుటుంబా­నికి రూ.కోటి ఇస్తే ఆ రోజు మీ నో­రు పడిపోయిందా? అని నిలదీశారు. లక్ష్మీనాయు­డు కుటుంబా­నికి న్యాయం చేయాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో కాపు సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement