breaking news
Yacht Club of Hyderabad
-
వాటర్ స్పోర్ట్.. కయాకింగ్..
తక్కువ వెడల్పు కాస్త ఎక్కువ పొడవు ఉండే కయాక్ లేదా పడవను రెండు వైపుల ప్యాడ్స్ ఉన్న ఒక తెడ్డును ఉపయోగించి నీటిపై కదిలించడమే కయాకింగ్. సాధారణంగా ఈ పడవపై ఒకేసారి ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు కలిసి పడవను నడిపించడమే ఈ క్రీడలోని ప్రత్యేకత. ముఖ్యంగా ఇది పర్యాటక క్రీడగా దేశంలో గుర్తింపు పొందింది. సాహస ప్రేమికులు, అడ్వెంచర్ టూరిజాన్ని ఇష్టపడేవారు ఈ కయాకింగ్కు ఆకర్షితులవుతుంటారు. సరస్సులు లేదా పెద్ద చెరువుల్లో వినోదించడానికి ఇదో చక్కని మార్గంగా చెప్పొచ్చు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ కయాకింగ్ అందుబాటులో ఉంది. దీంతో ఈ జలక్రీడను నగర వాసులు ఆస్వాదిస్తున్నారు. ఇది చాలా కాలంగా నీటి క్రీడగా ఉంటూ వస్తున్నప్పటికీ గత దశాబ్ద కాలంగా ప్రధాన పర్యాటక క్రీడగా కూడా దేశంలో ప్రసిద్ధి చెందింది. సాహస ప్రేమికులైన పర్యాటకుల్లో చాలా మంది ఈ కయాకింగ్ను అనేక సార్లు ఎంజాయ్ చేసి ఉంటారు. అయితే నిన్నా మొన్నటి వరకూ దేశంలోనే ప్రధాన పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాత్రమే వారికి ఈ అవకాశం దక్కేది. ఇటీవల నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా కొన్ని çచోట్ల కయాకింగ్ అందుబాటులోకి వచి్చంది. ఆయా చోట్ల ఇప్పటికే నగరవాసులు ఈ జలక్రీడను ఆస్వాదిస్తున్నారు.కోట్పల్లి అటవీ ప్రాంతంలో..తెడ్డు చేతపట్టి జలాశయంలో నీటిని వెనక్కి నెట్టుకుంటూ ముందుకు సాగిపోతుంటే.. కయాకింగ్స్ ఈ అనుభూతి పొందాలంటే మాత్రం వికారాబాద్ జిల్లా కోట్పల్లి ప్రాజెక్టుకు పోవాల్సిందే. అటవీ ప్రాంతం మధ్యలో కనుచూపు మేరలో నీటి అలలపై తేలియాడే పడవలు కనువిందు చేస్తాయి. నిత్యం 300 నుంచి 400 మంది పర్యాటకులు ఇక్కడ బోటింగ్ చేస్తుంటారు. వారాంతాలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. గత పదేళ్లుగా ఇక్కడ బోటింగ్ కార్యకలాపాలు నడిపిస్తున్నారు. సుమారు 20 మంది లైఫ్ గార్డ్స్ అందుబాటులో ఉంటారు. లైఫ్ జాకెట్స్, ఇతర ప్రమాణాలు పాటిస్తుంటారు. ఒక్కరు ప్రయాణించే బోటుకు గంటకు రూ.250 ఫీజు వసూలు చేస్తారు. ఇద్దరు ప్రయాణించే బోటుకు రూ.400 వరకూ వసూలు చేస్తారు. ఈ రిజర్వాయర్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తెరిచి ఉంటుంది. ఆన్లైన్లోనూ బుకింగ్ చేసుకోవడానికి వివరాలు అందుబాటులో ఉంటాయి. వికారాబాద్ పర్యాటక రంగంలో కోట్పల్లి బోటింగ్ పాత్ర కీలకమనే చెప్పాలి. ప్రయాణం ఇలా..నగరం నుంచి సుమారు 80 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంటుంది. హైదరాబాద్ నుంచి వికారాబాద్, తాండూరుకు ఆర్టీసీ బస్సు సరీ్వసులు ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి నుంచి రైలు సదుపాయం కూడా ఉంది. సొంత వాహనాల్లో వచ్చేవారు హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి చేవెళ్ల మీదుగా రావచ్చు. దీంతోపాటు శంకర్పల్లి మీదుగానూ రావచ్చు. ఇక్కడకు వచ్చే వారు అనంతగిరి కొండల్లో కొలువైన శ్రీ అనంత పధ్మనాభస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతగిరుల అందాలను ఆస్వాదిస్తారు.నగరంలోనూ పలు చోట్ల.. ఈ వాటర్ స్పోర్ట్స్కు సంబంధించి నగరంలోని దుర్గం చెరువు కేంద్ర బింధువుగా మారింది. ఇక్కడ సూర్యాస్తమయ సమయాల్లో హుషారుగా సాగే కయాకింగ్ ఈవెంట్లో ఔత్సాహికులు పాల్గొనవచ్చు. పడవలను తిప్పుతూ సరదాగా కాసేపు గడపాలనుకునే వారికి రూ.700 రుసుముతో ఆ అవకాశం అందుబాటులో ఉంది. అలా కాకుండా ప్రొఫెషన్గా తీసుకుని సీరియస్గా కయాకింగ్ నేర్చుకోవాలనుకుంటే కూడా ఇక్కడి వాటర్ స్కూల్లో ప్రత్యేక కోర్సు అందుబాటులో ఉంది. ఒక్క సోమవారం మినహా వారంలోని అన్ని రోజుల్లో ఈ క్రీడ అందుబాటులో ఉంటుంది.మరిన్ని ప్రాంతాల్లో... అదే విధంగా నగరంలోని హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న యాచ్ క్లబ్ కూడా కయాకింగ్ ప్రియుల కోసం పడవలను అందుబాటులో ఉంచుతోంది. లక్నవరం సరస్సులో కాయక్ని అద్దెకు తీసుకుని, చుట్టూ నిర్మలమైన కొండలు ఉన్న సరస్సులో విహరించే అవకాశం ఉంది. అక్కడ కొన్ని క్యాంపింగ్ గ్రూపులు, స్థానికులు గంటల ప్రాతిపదికన కయాక్లను అద్దెకు ఇస్తారు. సాధారణంగా ఉదయం వేళలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.కయాకింగ్కు ఆదరణ పెరిగింది.. నాకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. గత 30 ఏళ్లుగా ట్రెక్కింగ్, బోటింగ్ చేస్తున్నాను. మన దగ్గర ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్కువగా సినిమాల వరకే ఉంటాయి. అయితే ఎంతో మంచి వినోదాన్ని అందించే పర్యావరణ వింతలు, ట్రెక్కింగ్, బోటింగ్ వంటివి చాలా ఉన్నాయి. వీటిని ప్రోత్సహించేందుకు ప్రొగ్రసివ్ తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో కోట్పల్లిలో బోటింగ్ ఏర్పాటు చేశాం. దీని కోసం నా సొంత ఖర్చుతో బోట్లను కొనుగోలు చేసి ఇచ్చాను. దీని ద్వారా ఇప్పుడు కొంత మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయి. అంతే కాకుండా పరోక్షంగా వందలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఇప్పుడు ఇక్కడకు నిత్యం వేలాది మంది బోటింగ్కు వస్తున్నారు. – విశ్వేశ్వరరెడ్డి, చేవెళ్ల బీజేపీ ఎంపీఆరోగ్యలాభాలెన్నో.. కయాకింగ్ వల్ల అనేక రకాల ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రీడ మజిల్ స్ట్రెంగ్త్ పెంచుతుంది. ముఖ్యంగా అప్పర్ బ్యాక్, చేతులు, భుజాలు, ఛాతీ భాగంలో కండరాలు బలోపేతం అవుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుస్తుంది. -
అలలపై విన్యాసం
జలకళ ఉట్టి పడే సరస్సును చూస్తే ఎవరికైనా ఎంతో ఉత్సాహం. అందులో బోటింగ్ చేస్తే మరెంతో ఉల్లాసం. పిల్లలైతే కేరింతలు కొట్టకుండా ఉండలేరు. అలాంటివారి కోసమే హైదరాబాద్లో ఓ సెయిలింగ్ క్లబ్ ఉంది. హుస్సేన్సాగర్ సెయిలింగ్కు అనువైన సరస్సు. మూడు బోట్స్తో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు శిక్షణ ఇవ్వటం మొదలుపెట్టింది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్. నగరం నడిబొడ్డులో సెయిలింగ్, కయాకింగ్ లాంటిచక్కటి క్రీడలు నేర్చుకునే అవకాశముంది. ఆసక్తి ఉన్న పిల్లలను ప్రోత్సహించడమే లక్ష్యంగా 2009లో సుహీం షేక్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ క్లబ్లో ఇప్పటికే 300 మందికిపైగా పిల్లలు సెయిలింగ్లో శిక్షణ పొందారు. అందులో 20 మంది క్లబ్ సెలెక్ట్ జాబితాలో ఉన్నారు. జాతీయస్థాయి టాప్టెన్లో ఈ క్లబ్వారు ఇద్దరున్నారు. హైదరాబాద్ యాచ్ క్లబ్ దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాచ్ క్లబ్. - ఓ మధు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, పేద పిల్లలతో పాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సిల్వర్ ఓక్స్, శ్రీనిధిలాంటి ప్రముఖ పాఠశాలల పిల్లలు కూడా ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. కొన్ని కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ క్లబ్ ఎన్నో చారిటీ పనులు చేస్తోంది. ఎల్ఎస్ఎన్, నాందీ ఫౌండేషన్ల పిల్లలు శిక్షణ తీసుకుంటున్నారు. పేద విద్యార్థుల చదువు, అవసరాలకు కూడా సహాయం అందిస్తుంటారు. పోషకాహారం పంపిణీ చేస్తుంటారు. స్కూలుకు వెళ్లడానికి సైకిళ్లను సమకూరుస్తుంటారు. రేసింగ్, రేసింగ్ టెక్నిక్స్ కూడా శిక్షణలో భాగమే. ఈవెంట్స్... * కయాకింగ్, మాన్సూన్ రిగెటా నిర్వహిస్తుంటాం.ముంబైలో వింటర్ రిగెటా చేస్తున్నాం. * జాతీయ పోటీల్లో ఇక్కడ శిక్షణ తీసుకున్న పిల్లలు పాల్గొన్నారు. * పతి ఏడాది మాన్సూన్ రెగెటా నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా 50 మందికిపైగా క్రీడాకారులు ఈ ఈవెంట్లో పాల్గొంటారు. * తెలంగాణ టూరిజంతో కలసి కయాకింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఇది ప్రతి ఏడాది నిర్వహించనున్నారు. సిటీ కోసం ఏదైనా చేయాలని.. ‘జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. 35 ఏళ్లుగా సెయిలింగ్ చేస్తున్నాను. రజత పతకం పొందాను. నేను సాఫ్టేవేర్ రంగంలో వున్నాను. నా సిటీ కోసం ఏదైనా చేయాలని అనుకున్నాను. గవర్నమెంటు స్కూల్ పిల్లలకు సెయిలింగ్లో ట్రెయినింగ్ మొదలు పెడదామనుకున్నాను. నగరంలో కొన్నిచోట్ల సెయిలింగ్ చేయటానికి అవకాశమున్నా, అందరికీ అనుమతి లేదు. అందుకే ఈ క్లబ్ని మూడు బోట్స్తో మొదలుపెట్టాం. ఈ రోజు 35 బోట్స్ ఉన్నాయి. హుస్సేన్సాగర్ క్లీన్ లేక్గా మారితేసెయిలింగ్కి బెస్ట్ ప్లేస్ అవుతుందనటంలో డౌట్ లేదు. దుర్గం చెరువులో కూడా సెయిలింగ్ శిక్షణకు ఏర్పాట్లు చేయాలనుకున్నా ప్రస్తుతం ఆ చెరువు అనుకూలంగా లేదు. క్లబ్లో 100 మంది పిల్లలు సెయిలింగ్ చేస్తుంటే చూడాలన్నది నా కోరిక’ అంటారు సుహీం షేక్. క్లబ్ వివరాలకు -Yacht Club of Hyderabadఫేస్ బుక్ పేజ్ని చూడండి. మా అబ్బాయి సిల్వర్ మెడలిస్ట్ మా బాబు రిషభ్ చెన్నై వెళ్లినప్పుడు ఈ సెయిలింగ్ గేమ్ చూశాడు. హైదరాబాద్ వచ్చాక ఇంటర్నెట్లో చూసి ఈ క్లబ్ గురించి తెలుసుకున్నాడు. నేల మీద ఆడే స్పోర్ట్స్కి, నీళ్ల మీద ఆడే ఆటలకి చాలా తేడా ఉంటుంది. అందరూ వీటిని చేయలేరు. ఈ విషయం ఇక్కడి సీనియర్ ట్రెయినర్ మనకు అర్థం అయ్యేలా చెప్తారు. మా అబ్బాయి ట్రెయినింగ్ తీసుకొని చాలా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఈ మధ్య జరిగిన మాన్సూన్ జాతీయ పోటీల్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. - షిరాణి నాయర్ సెయిలింగ్తో ఉల్లాసం మా పిల్లలు జూహీ, తనిష్క్ అన్ని రకాల క్రీడలు నేర్చుకోవడానికి ప్రయత్నించారు. కానీ వాళ్లకు అన్నిటికంటే ఎక్కువ ఉల్లాసాన్ని, ఆసక్తిని కలిగించిన క్రీడ సెయిలింగ్. ట్రైనింగ్లో ప్రమాదాలకు తావు లేకుండా యాచ్ క్లబ్ హైదరాబాద్ వారు చాలా జాగ్రత్తలు తీసుకుని శిక్షణ ఇస్తున్నారు. అందుకే పిల్లలను ధైర్యంగా పంపగలుగుతున్నాం. ఇక ఇక్కడ అండర్ ప్రివిలేజ్డ్ పిల్లల కోసం ఈ క్లబ్ చేసే చారిటీ ఈవెంట్స్ మా లైఫ్లో కూడా భాగమయ్యాయి. - జీనా దేశాయ్, పేరెంట్