breaking news
wrong predictions
-
కివీస్కు క్షమాపణలు చెప్పిన ఆసీస్ కెప్టెన్
సిడ్నీ: ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ న్యూజిలాండ్ జట్టుకు క్షమాపణలు చెప్పాడు. ఇటీవలే ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మొదలవ్వకముందు టీమిండియానే విజేతగా నిలుస్తుందని పైన్ అంచనా వేశాడు. కానీ అతని అంచనాలకు భిన్నంగా కివీస్ సూపర్ విక్టరీ సాధించి టెస్టు చాంపియన్గా అవతరించింది. ఈ నేపథ్యంలో కివీస్ను అభినందించిన పైన్ తన అంచనా తప్పినందుకు క్షమించాలంటూ న్యూజిలాండ్ను కోరాడు. ''ఒక్కోసారి మనం వేసుకునే అంచనాలు తప్పడం సహజమే. ఏడాదిన్నరగా టీమిండియా అద్భుత ఫామ్లో ఉండడంతో ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ను భారత్ గెలుస్తుందని అంచనా వేసుకున్నా. కానీ నేను అనుకున్నదానికంటే కివీస్ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసింది. నిజానికి కివీస్కు కీలక మ్యాచ్కు ముందు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ద్వారా మంచి ప్రాక్టీస్ లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న విలియమ్సన్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్లో అదరగొట్టింది. ఒక చిన్న ద్వీపంలా కనిపించే కివీస్ ఈ అద్భుత ఫీట్ను సాధించడం ఆనందంగా ఉంది. నా అంచనా తప్పినందుకు మరోసారి క్షమాపణ అడుగుతున్నా'' అంటూ ముగించాడు. ఇదే టిమ్ పైన్ గతంలో టీమిండియా ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ను గెలిచినప్పుడు.. టీమిండియా మమ్మల్ని మోసం చేసి సిరీస్ గెలిచిదంటూ వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు 2 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 217 పరుగులకు ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ 249 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 139 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన కివీస్ జట్టు భారత్పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. చదవండి: కోహ్లి.. ఇంకా ఎన్నాళ్లు ఈ నిరీక్షణ టీమిండియా చీటింగ్ చేసి సిరీస్ గెలిచింది: పైన్ -
చరిత్రలో తలకిందులైన అంచనాలు
ఇప్పటి నుంచి సరిగ్గా వందేళ్ల తర్వాత అంగారక గ్రహంపై మానవులు సుస్థిర నివాసం ఏర్పాటుచేసుకొని జీవిస్తారని 'స్పేస్ఎక్స్' సీఈవో ఎలాన్ మస్క్ అంచనా వేశారు. ఆ దిశగా అప్పుడే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. వందేళ్ల తర్వాత ఆయన అంచనా నిజం అయితే దూరదృష్టి గల జీనియస్ అని, ప్రముఖ కాల్పనికుడని కీర్తిస్తారు. ఆయన అంచనా నిజం కాకపోనూ వచ్చు. ఇలా చరిత్రలో తలకిందులైన అంచనాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని... 1903లో.. ఆటోమొబైల్ రంగానికి పురోగతి లేదని, ఎప్పటికైనా మానవుడికి గుర్రపు బగ్గీలే దిక్కని అప్పుడే కొత్తగా ఏర్పాటైన హెన్రీ ఫోర్డ్ కంపెనీ న్యాయవాదితో మిచిగాన్ సేవింగ్స్ బ్యాంక్ అధ్యక్షుడు వాదించారు. హŸరేస్ రాకమ్ ఆయన మాటలను వినిపించుకోకుండా ఫోర్డ్ కంపెనీలో తన ఐదువేల డాలర్ల పెట్టుబడిని 1.25 కోట్ల డాలర్లకు పెంచారు. ఫోర్డ్ కంపెనీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తెల్సిందే. 1911లో.. త్వరలోనే ఆల్కమీ (ఓ ఖనిజాన్ని బంగారంలోకి మార్చడం) విజ్ఞానం అభివృద్ధి చెందుతుందని, అప్పుడు ట్రక్కు నిండా ఉన్న ఇనుప కడ్డీలను స్వచ్ఛమైన బంగారంగా మార్చడం చాలా సులువని థామస్ ఎడిసన్ అంచనా వేశారు. ఆయన అంచనా ఇప్పటికీ నెరవేరలేదు. 1912లో.. వైర్లెస్ టెలిగ్రామ్ యుగంలోకి మానవుడు అడుగుపెడుతున్నందున ఇక యుద్ధాలనేవే జరగవని, దేశాల మధ్య కమ్యూనికేషన్ సమస్య ఉండదు కనుక యుద్ధాలు వచ్చే ఆస్కారమే లేదని గుగ్లీ ఎల్మో మార్కోని అంచనా వేశారు. ఆయన ఊహించిన దానికన్నా కమ్యూనికేషన్ల వ్యవస్థ మరింత బలపడినా, యుద్ధాలు సమసిపోలేదనే విషయం మనకు తెలిసిందే. 1920లో.. భూ వాతావరణాన్ని దాటుకొని ఏ రాకెట్ కూడా అంతరిక్షంలోకి ప్రయాణించలేదని, ఇది ఎప్పటికీ సాధ్యమయ్యే పని కాదని 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక అభిప్రాయపడింది. 1969లో అపోలో 11 అంతరిక్షనౌక చంద్ర మండలంపైకి ప్రయాణించిన విషయం తెల్సిందే. 1955లో.. అణు విద్యుత్తో పనిచేసే వాక్యూమ్ క్లీనర్లు పదేళ్లలో మార్కెట్లోకి వస్తాయని లెవిట్ వాక్యూమ్ కంపెనీ అధ్యక్షుడు అలెక్స్ లెవిట్ అంచనా వేశారు. రాలేదు కదా! 1966లో.. 1999 నాటికి మనిషి నడుము బెల్టులకు కట్టుకునే రాకెట్లు వస్తాయని, వాటితో విహరించవచ్చని, ఆకాశంలో ప్రయాణించే కార్లు వస్తాయని, వాతావరణాన్ని సానుకూలంగా నియంత్రించే అద్దాల డోమ్ల కింద నగరాలు వెలుస్తాయని రీడర్స్ డైజెస్ట్ మాగజైన్ అంచనా వేసింది. మానవుడు రాకెట్ లేదా విమానాల లాంటి చిన్న పరికరాలపై గాల్లో ఎగరడం, ఆకాశంలో ప్రయాణించే కార్లు ఇంకా ప్రయోగ దశల్లోనే ఉన్నాయి. వాతావరణాన్ని నియంత్రించే డోమ్లు నగరాలపై రాలేదు. భవిష్యత్తులో వాతావరణ కాలుష్యం పెరిగిపోతే ఆలాంటి గ్లాస్ డోమ్లు అవసరం అవుతాయేమో! 1977లో.. ఇంటికో కంప్యూటర్ కోరుకునే ప్రసక్తే రాదని డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ వ్యవస్థాపకులు కెన్ ఓస్లెన్ భావించారు. ఎందుకంటే అప్పట్లో ఆయన కంపెనీ కంప్యూటర్లు చిన్న ఇల్లుకంటే పెద్దగా ఉండేవి. 1995లో.. ఏడాదిలో ఇంటెర్నెట్ విస్తరించి సూపర్నోవాలాగా పేలిపోతుందని ఈథర్నెట్ కేబుల్ వ్యవస్థాపకులు రాబర్ట్ మెట్కాఫ్ అంచనా వేశారు. ఎందుకంటే ఆయన కేబుల్ భవిష్యత్తులో అవసరమైన డేటాను ఇముడ్చుకునే అవకాశం లేదని ఆయన భావించారు. 1997లో.. మార్కెట్లో గ్యాడ్జెట్ మేకర్లను తట్టుకోలేక హార్డ్వేర్ గేమ్ నుంచి త్వరలోనే నిష్క్రమిస్తావని ప్రముఖ ఆపిల్ కంపెనీని 'వైర్డ్ మేగజైన్' హెచ్చరించింది. ఆ తర్వాత నాలుగేళ్లలోనే వెయ్యి పాటల గ్యాడ్జెట్లను ఆపిల్ కంపెనీ మన జేబుల్లో పెట్టింది. ఇప్పుడా కంపెనీ ఏ స్థాయిలో ఉందో మనకు తెల్సిందే.