-
మహిళలే..చోరీల్లో ఘనులే!
వారు చూపు పడితే– ఏ నగల దుకాణంలోని నగ అయినా వారి హస్తలాఘవానికి అదృశ్యం కావాల్సిందే. దుకాణ యజమానుల్ని మాటల్లో పెట్టి, తెలివిగా నగలు కొట్టేసే ఐదుగురితో కూడిన సభ్యుల ముఠాలో నలుగురు మహిళలైతే, వారికి నాయకురాలు కూడా మహిళే కావడం గమనార్హం! వీరిపై నాలుగు జిల్లాల్లో కేసులు ఉండటం చూస్తే చోరీల్లో వీరెంత మహా ముదుర్లో ఇట్టే బోధపడుతుంది. చిత్తూరు, పులిచెర్ల(కల్లూరు): బంగారు నగల దుకాణాల్లో చోరీలకు పాల్పడే దొంగల ముఠాను కల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం.. కల్లూరులోని రోషన్ నగల దుకాణంలో ఈనెల 6 మంగళవారం ఐదుగురు వ్యక్తులు నగలు కొనేందుకు వచ్చారు. షాపు యజమానిని మాయమాటలతో మభ్య పెట్టి, అతని దృష్టి మరల్చి, షాపులో సుమారు ఒక కేజీ 470 గ్రాముల బరువు కలిగిన 12 జతల కాలి పట్టీలు, కాలి గొలుసులు దొంగలించి ఉడాయించారు. దీనిపై షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలో రికార్డయిన నిందితుల ముఖచిత్రాలు కీలకమయ్యాయి. ఈ చిత్రాలను చిత్తూరులోని దర్యాప్తుకు ఉపకరించే మరో విభాగానికి పంపితే వీరి నేరాల చిట్టా బయటపడింది. దీంతో ప్రత్యేకశ్రద్ధ వహించిన కల్లూరు ఎస్ఐ మల్లికార్జున తన సిబ్బందితో దొంగల ముఠా కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. బుధవారం దొంగల గురించి పక్కా సమాచారం అందడంతో కల్లూరు సమీపంలోని చెరకువారిపల్లె బస్ స్టాప్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఎపి 03 టిజి 2223 నంబరు గల ఆటోలో వస్తున్న ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వీరే కల్లూరులోని నగల దుకాణంలో చోరీకి పాల్పడినట్లు తేలింది. వారు చోరీ చేసిన వెండి కాలిపట్టీలు, గొలుసులను స్వాధీనం చేసుకోవడంతోపాటు నేరానికి ఉపయోగించిన ఆటో సీజ్ చేశారు. దొంగతనానికి పాల్పడిన వారిలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరంతా వాల్మీకిపురం మండలం, చింతలవారిపల్లె పంచాయతీ బోయపల్లెకు చెందిన వారని, వీరంతా బంధువులేనని తేలింది. వీరు ఒక ముఠాగా ఏర్పడి ఐదేళ్ల కాలంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. వీరిపై చిత్తూరు, వైఎస్సార్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోని పలు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. 24 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులకు పాకాల సీఐ ఆశీర్వాదం రివార్డు ప్రకటించి నగదు బహుమతి అందజేశారు. చిత్తూరు డీఎస్పీ కె.ఈశ్వరరెడ్డి అభినందించారు. దొంగల వివరాలు చూస్తే.. ♦ ఏ–1 నిందితురాలైన రేపన అరుణ(45) గ్రూపు లీడరు అని, ఈమె నగల దుకాణాల్లో చోరీ చేయడంతో ఆరితేరిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈమెపై మూడు జిల్లాల్లో 7 కేసులు ఉన్నాయి. ♦ 2వ నిందితురాలై దిగుడు గీత(30)పై చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలో 3 కేసులు ఉన్నాయి. ♦ 3వ నిందితురాలై పల్లపు విజయ కుమారి(30)పై చిత్తూరు జిల్లాలో ఒక కేసు ఉంది. ♦ 4వ నిందితురాలుగా వేముల ప్రభావతి(29), 5వ నిందితుడిగా ఆర్.మణి (27) ఉన్నారు. -
రిమాండ్ కు ఇద్దరు మహిళా దొంగలు
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పోలీసులు గురువారం ఇద్దరు మహిళా దొంగలను పట్టుకుని, రిమాండ్కు తరలించారు. జిల్లాలోని బోధన్కు చెందిన ఎడిబి సంగీత, ఎరుకల రాజమణిలపై గతంలో వివిధ దొంగతనం కేసులున్నాయి. వీరిని గురువారం అదుపులోకి తీసుకుని మూడు తులాల నెక్లెస్, అరతులం కమ్మలను స్వాధీనం చేసుకున్నామని సీఐ రమణారెడ్డి విలేకరులకు తెలిపారు. (భీమ్గల్)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..
బంగారం స్పీడ్కు బ్రేక్.. కొనుగోలుదారులకు ఊరట!
Sunita Williams: రోదసి యాత్రకు మరో ముహూర్తం ఖరారు
ఓటు వేశారు.. డైమంగ్ రింగ్ గెలుచుకున్నారు!
అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!
చంద్రబాబు ఒక శాడిస్ట్: మంత్రి కారుమూరి
Met Gala 2024: హైదరాబాదీ సుధారెడ్డి డైమండ్ నెక్లెస్ విశేషం ఏంటో తెలుసా?
Shivathmika Rajashekar: అదిరే అందాలతో కవ్విస్తోన్న శివాత్మిక (ఫోటోలు)
చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..
కల్కిలో మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ ప్లానింగ్ అదుర్స్!
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement