breaking news
vasectomy
-
స్త్రీలే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలా?
పిల్లలు పుట్టని ఆపరేషన్ అనగానే మన దేశంలో గుర్తొచ్చేది స్త్రీలే. మొదటి కాన్పులోనో రెండో కాన్పులోనో ఆపరేషన్ ప్లాన్ చేసే భర్తలు ఉంటారు భార్యకు. ‘మీరు చేయించుకోండ’ని భార్య అనలేని పరిస్థితి ఇంకా దేశంలో ఉంది. ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (2019–2021) నివేదిక ప్రకారం వందమంది వివాహితలలో 38 మంది ఆపరేషన్ చేయించుకుంటున్నారు. పురుషులలో నూటికి ముగ్గురే వేసెక్టమీకి వెళుతున్నారు. కుటుంబ నియంత్రణకు సంబంధించి స్త్రీలు ఎదుర్కొంటున్న ఒత్తిడిని ఈ సర్వే మరోసారి విశదపరిచింది. ఇవాళ దేశంలోని 15–49 వయసు మధ్య ఉన్న వివాహితులలో 99 శాతం మందికి కుటుంబ నియంత్రణకు సంబంధించిన ఏదో ఒక పద్ధతి గురించి తెలుసనేది ఒక అంచనా. అయినప్పటికీ తాత్కాలిక నియంత్రణ కాకుండా శాశ్వత నియంత్రణ విషయానికి వచ్చేసరికి మన దేశంలో ఆ బాధ్యత స్త్రీదేనన్న అవగాహన స్థిరపడిపోయింది. ‘ఫెడరేషన్ ఆఫ్ గైనకలాజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా’ అధ్యయనంగానీ తాజాగా వెలువడ్డ ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (2019–2021)గాని ఇదే విషయాన్ని చెబుతున్నాయి. దేశంలోని మగవారు ‘వేసెక్టమీ’ పట్ల చాలా వైముఖ్యంగానే ఉన్నట్టు ఈ నివేదిక చెబుతోంది. ప్రచారం వల్ల కుటుంబ నియంత్రణ గురించి ప్రభుత్వంగాని, స్వచ్ఛంద సంస్థలుగాని చేసే ప్రచారం ఎప్పుడూ స్త్రీ కేంద్రితంగానే ఉంటుంది. ఆపరేషన్ గురించి, పిల్స్ గురించి, లేదా స్త్రీకి అమర్చే గర్భనిరోధక సాధనాల గురించి ఎక్కువ ప్రచారం ఉంటుంది. పెళ్లయి సంతానం పుట్టడం మొదలయ్యాక ఏ కాన్పులో ఆపరేషన్ చేయించాలో భర్తో అత్తామామలో నిర్ణయిస్తూ ఉంటారు. భార్యకు కూడా కుటుంబ నియంత్రణ సమ్మతమే అయినా ఆపరేషన్ భర్తకు జరగడం గురించి ఆమె అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉండదు. అసలు ఆ ఆలోచనే లేని స్త్రీలు చాలామంది ఉన్నారు. ‘వేసెక్టమీ చేయించుకుంటే పురుషుడిలో లైంగిక శక్తి బలహీన పడుతుందని... మునుపటి ఉత్సాహం ఉండదని... శారీరక కష్టం చేసే వృత్తులలో ఉన్నవారైతే బరువులెత్తలేరని ఇలాంటి అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు దూరం చేయాల్సిన పని తగినంతగా జరగడం లేదు. పురుషులతోపాటు స్త్రీలు కూడా వీటిని నమ్మడం వల్ల ఇంటికి సంపాదించుకుని తేవాల్సిన మగవాడు ఎక్కడ బలహీన పడతాడోనని తామే ఆపరేషన్లకు సిద్ధం అవుతున్నారు’అంటున్నారు (గైనకలాజికల్) ఫెడరేషన్ అధ్యక్షురాలు డాక్టర్ శాంత కుమారి. ‘నిజానికి స్త్రీల ఆపరేషన్ కన్నా పురుషులు చేయించుకునే వేసెక్టమీ సులువైనవి, సురక్షితమైనది’ అంటారు ఆమె. కాని వేసెక్టమీ వైపు చూసే పురుషులు లేరు. పిల్స్ వత్తిడి శాశ్వత నియంత్రణకు వెళ్లే ముందు సంతానానికి సంతానానికి మధ్య తాత్కాలిక నియంత్రణ విషయంలో కూడా స్త్రీల మీదే ఒత్తిడి ఉంటోంది. మన దేశంలో కేవలం 10 శాతం మంది పురుషులే కండోమ్స్ వాడటానికి ఇష్టపడుతున్నారు. 90 శాతం మంది స్త్రీలు పిల్స్ వాడటం గురించి, గర్భనిరోధక సాధనాలు అమర్చుకోవడం గురించి ‘ప్రోత్సహిస్తున్నారు’. దీర్ఘకాలం పిల్స్ వాడటం వల్ల స్త్రీల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిసినా. ‘పల్లెల్లో పురుషులు లైంగిక విషయాల గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడరు. ఆరోగ్య కార్యకర్తలు స్త్రీలే కావడం వల్ల వీరి మాటామంతి స్త్రీలతోనే సాగుతోంది. పురుషులను ఆరోగ్య కార్యకర్తలుగా నియమించి మగవారిలో కుటుంబ నియంత్ర ఆపరేషన్ల పట్ల ప్రచారం కలిగిస్తే మార్పు రావడం సాధ్యం’ అని సర్వేలో పాలుపంచుకున్న నిపుణులు అంటున్నారు. కుటుంబ బాధ్యత స్త్రీ పురుషులదైనప్పుడు కుటుంబ నియంత్రణ బాధ్యత స్త్రీ పురుషులదే. కాని అది స్త్రీదిగానే ఎంచేంత కాలం స్త్రీకి ఈ భారం తప్పదు. పురుషులు మేల్కోవాలి. 3 శాతమే పురుషులు 2019–2021 కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం వంద మంది వివాహితలలో 38.9 శాతం మంది ట్యూబెక్టమీ చేయించుకుంటున్నారు. గత సర్వేతో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ. కాని ఆశ్చర్యకరమైన పరిశీలన ఏమిటంటే గత సర్వేలోనూ ఈ సర్వేలోనూ కేవలం 3 శాతానికే పురుషుల శాతం వేసెక్టమీకి పరిమితమైంది. అంటే పురుషులు ఇది ఏ మాత్రం తమకు సంబంధించిన వ్యవహారంగా చూడటం లేదు. ఈ సర్వేలో భాగంగా అడిగిన ప్రశ్నకు ఉత్తర ప్రదేశ్, బిహార్, తెలంగాణ రాష్ట్రాలలో 50 శాతం మంది మగవారు ‘అది ఆడవాళ్లు చేయించుకోవాల్సిన ఆపరేషన్’గా జవాబు ఇస్తే మధ్యప్రదేశ్లో ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు ‘కుటుంబ నియంత్రణ ఆడవాళ్లదే’ అన్నారు. చదవండి: Normal Delivery: నార్మల్ డెలివరీ టిప్స్! -
అక్కడికొచ్చేసరికి భయమంటాడు..
అంతంటాడు.. ఇంతంటాడు.. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు మగాళ్ల వెనకడుగు - ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటున్న మహిళలు 75 శాతం - వేసెక్టమీ చేయించుకుంటున్న మగాళ్లు 0.62 శాతమే మగాడు.. కోరమీసమున్న మగాడు.. అన్నింటా ముందుంటానంటాడు.. అంతంటాడు.. ఇంతంటాడు.. అక్కడికొచ్చేసరికి మాత్రం అమ్మో.. భయమంటాడు.. కుటుంబ నియంత్రణ విషయానికొచ్చేసరికి మగాడు ముందుండనంటున్నాడు.. అనేక అపోహల బారిన పడి.. తూచ్ అంటున్నాడు. అప్పట్లోనే కాదు.. ఇప్పటి హైటెక్ పురుషులదీ అదే బాట. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015ృ16 గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నా యి. ‘‘చిన్నకుటుంబం.. చింతలేని కుటుంబం..’’ కుటుంబ నియంత్రణపై ప్రచారం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన నినాదం ఇది.. ఒకవైపు పెరిగిపోతున్న దేశ జనాభా.. అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పనలో ఇబ్బందులు.. ఈ నేపథ్యంలోనే కుటుంబ నియంత్రణకు సర్కారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో చాలా జంటలు.. ఫ్యామిలీ ప్లానింగ్కు సిద్ధమవుతున్నాయి. కానీ.. ఒక కుటుంబంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించు కోవాల్సింది ఎవరు..? మా మూలుగా అయితే మగాళ్ల యినా.. ఆడ వాళ్లయినా ఈ ఆపరేషన్ చేయించుకోవచ్చు. అయితే వాస్తవంలో జరుగు తోంది వేరు.. కుటుంబ నియంత్రణ అంటే ఆడవాళ్లకే పరిమితం అనే ధోరణి మన దేశంలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అధికారిక గణాం కాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గర్భ నిరోధానికి సంబంధించిన పద్ధతుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ను చేయించుకుంటున్న మహి ళలు 75 శాతానికి పైనే. ఫ్యామిలీ ప్లానింగ్ చేయిం చుకుంటున్న మగాళ్ల సంఖ్య 0.62 శాతమే. పదేళ్ల నాటి కంటే తక్కువగా.. పదేళ్ల క్రితం 1శాతం ఉన్న మగాళ్ల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల సంఖ్య ఇప్పుడు 0.62 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. ఈ సంఖ్య మగాళ్లలో గర్భ నిరోధక ఆపరేషన్ల పట్ల ఉన్న నిరాసక్తతను స్పష్టం చేస్తోంది. దీనికి అనేక కార ణాలు ఉన్నాయి. ముఖ్యంగా లైంగిక, గర్భ నిరో ధానికి సంబంధించి అవగాహన లేకపోవడం.. కుటుంబ నియంత్రణ పద్ధతులపై పరిజ్ఞానం లేకపోవడం.. మూఢ నమ్మకాలు.. దురభిప్రా యాలు.. అన్నిటికన్నా ఎక్కువగా.. ఇది చేయిం చుకుంటే లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని భయపడటం. వాస్తవానికి మహిళలతో పోలి స్తే.. కుటుంబ నియంత్రణకు అత్యంత సురక్షి తమైన పద్ధతి వేసెక్టమీ. సులువైనది.. త్వరిత గతిన పూర్తయ్యేది. ఎటువంటి సైడ్ ఎఫెక్టస్ లేనిది. ృ సాక్షి, తెలంగాణ డెస్క్ ఎటు చూసినా ఇదే తీరు.. ప్రపంచవ్యాప్తంగా కూడా వేసెక్టమీ చేయించుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. 2.4 శాతం మందే వేసక్టమీ చేయించుకుంటున్నారు. అమెరికాలో 10.8 శాతం.. కెనడాలో 21.7 శాతం బ్రిటన్లో 21 శాతం మంది వేసెక్టమీ చేయించుకుంటున్నారు. మన పొరుగుదేశాల విషయానికి వస్తే.. భూటాన్ 12.8 శాతం.. నేపాల్లో 4.8 శాతం మంది వేసెక్టమీ చేయించుకుంటున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్లో పురుషులే ఎక్కువగా పాల్గొనాలని, ఇందుకోసం భారీ స్థాయిలో చర్యలు తీసుకోవాలని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా చెపుతున్నారు. భాగస్వామి, పిల్లల ఆరోగ్యానికి సంబంధించి మగాళ్ల ఆలోచనా విధానంలో మార్పు రావాలని.. కుటుంబ నియంత్రణ వంటి నిర్ణయాల్లో భార్యలను కూడా భాగస్వాములను చేయాలని ఆమె సూచించారు.