Test cricket history
-
‘విరాట్’ పరుగుల పర్వాలు
‘నేను టెస్టు క్రికెట్ను రోజంతా ఒకే తరహా తీవ్రతతో ఆడాలని భావిస్తా. 88వ ఓవర్లో కూడా బ్యాటర్ షాట్ ఆడితే నేను సింగిల్ ఆపేందుకు అవసరమైతే డైవ్ కూడా చేస్తా. నా దృష్టిలో టెస్టు క్రికెట్ అంటే అదే’... ఇది విరాట్ కోహ్లికి టెస్టు ఫార్మాట్పై ఉన్న అభిమానాన్ని చూపిస్తోంది. ‘నేను నా మనసును, ఆత్మను కూడా టెస్టు క్రికెట్ కోసమే ఇచ్చా. ఈ ఫార్మాట్లో ఫిట్నెస్ కోసమే ఎన్నో త్యాగాలు చేశా’... 100 టెస్టులు పూర్తయిన సందర్భంగా అతను తన సంతృప్తిని ప్రదర్శించిన వ్యాఖ్య ఇది. ‘ఈ రోజంతా మనిద్దరమే బ్యాటింగ్ చేద్దాం.అవతలి జట్టులో ఒక్కొక్కడికి పగిలిపోవాలి’... ఇది మైదానంలో ప్రత్యర్థులపై అతను ప్రదర్శించిన దూకుడుకు ఒక చిన్న ట్రైలర్... టెస్టు క్రికెట్కు ఆదరణ తగ్గిపోతోందని అనిపించినప్పుడల్లా మైదానంలో కోహ్లిని చూస్తే అలాంటి భావనే కనిపించదు. అతను టెస్టుల్లో భారీగాపరుగులు మాత్రమే చేయలేదు. అతను ఎన్నో లెక్కలను కొత్తగా తిరగరాశాడు. సాంప్రదాయ ఫార్మాట్లో ఎన్నో సాంప్రదాయాలను బద్దలు కొట్టాడు. క్రమశిక్షణ, పట్టుదల, పోరాటపటిమ, ఫిట్నెస్, ఎక్కడా వెనక్కి తగ్గని తత్వం టెస్టుల్లోనే ఎక్కువగా బయట పడింది. కోహ్లిలాంటి టెస్టు క్రికెటర్ ఇకపై రాకపోవచ్చు. ఈ ఫార్మాట్లో అది ఎవరూ పూరించలేని లోటు. –సాక్షి క్రీడా విభాగం ‘భారత్ తరఫున ఆడుతున్న ఆ్రస్టేలియన్’... విరాట్ కోహ్లి దూకుడును ఆసీస్ గడ్డపై చూసిన తర్వాత విశ్లేషకులు ఇచ్చిన పేరు ఇది. మైదానంలో దూకుడు, ఢీ అంటే ఢీ అనే తత్వం, అటు బ్యాటర్గా, ఇటు కెపె్టన్గా అతని శైలి కోహ్లి ప్రత్యేకతను నిలబెట్టాయి. ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గను అన్నట్లుగా తెల్ల దుస్తుల్లో యుద్ధానికి సిద్ధమైన ఒక సైనికుడిలా అతను కనిపించేవాడు. 2014లో ఆస్ట్రేలియా గడ్డపై నాటి టాప్ పేసర్ మిచెల్ జాన్సన్తో అతను తలపడిన తీరును అభిమానులు ఎవరూ మర్చిపోలేరు.తన బౌలింగ్లో అద్భుతమైన కవర్ డ్రైవ్లు, పుల్ షాట్లతో కోహ్లి విరుచుకుపడుతుంటే జాన్సన్ మాటల యుద్ధానికి దిగగా, కోహ్లి ఎక్కడా తగ్గకుండా తాను అదే తరహాలో దీటుగా నిలబడ్డాడు. ఈ సిరీస్లో ఏకంగా 4 సెంచరీలతో 692 పరుగులు చేసిన అతను తన సత్తాను ప్రదర్శించాడు. అంతకుముందు దాదాపు మూడేళ్ల క్రితమే కోహ్లి దూకుడును ఆసీస్ చూసింది. 2011–12 టెస్టు సిరీస్లో భాగంగా జరిగిన పోరులో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంభీర్వంటి స్టార్ బ్యాటర్లంతా విఫలం కాగా భారత్ నుంచి ఒకే ఒక సెంచరీ నమోదైంది. అది కోహ్లి బ్యాట్ నుంచి వచి్చంది. ఇది కోహ్లి కెరీర్లో ఎనిమిదో టెస్టు. రెండు టెస్టుల క్రితం సిడ్నీలో క్రమశిక్షణారాహిత్యంతో శిక్షకు గురైన కోహ్లి... ఈ మ్యాచ్లో తన దూకుడును పరుగులుగా మలచి కసి తీర్చుకున్నట్లుగా అనిపించింది. అలా మొదలై... వన్డేల్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల తర్వాత గానీ కోహ్లి తొలి టెస్టు ఆడలేదు. సచిన్ గైర్హాజరులో అతనికి 2011లో వెస్టిండీస్ వెళ్లే అవకాశం లభించింది. అక్కడ పెద్దగా ఆకట్టుకోకపోయినా... ఆ తర్వాత ముంబైలో విండీస్తోనే రెండు ఇన్నింగ్స్లలో అర్ధ సెంచరీలు చేయడంతో కాస్త నిలదొక్కుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆ్రస్టేలియా సిరీస్ అవకాశం దక్కగా అడిలైడ్లో చేసిన సెంచరీతో కొత్త తరం ప్రతినిధిగా అతని ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత స్వదేశంలో నిలకడ కొనసాగగా... 2013 దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రదర్శన కోహ్లి స్థాయిని పెంచింది. ఆపై కివీస్పై వెల్లింగ్టన్లో చేసిన శతకంతో అతని బ్యాటింగ్ విలువ అందరికీ కనిపించింది. ఇక్కడి వరకు కోహ్లి టెస్టు కెరీర్ సాఫీగా సాగిపోయింది. తొలి 24 టెస్టుల్లో 46.71 సగటుతో 1721 పరుగులు చేయగా అందులో 6 సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత వచి్చంది ఇంగ్లండ్ పర్యటన. ఆరేళ్లు అద్భుతంగా... విరాట్ టెస్టు కెరీర్ అక్టోబర్ 2014 నుంచి డిసెంబర్ 2019 వరకు అత్యద్భుతంగా సాగింది. ఈ సమయంలో అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనలు వచ్చాయి. అటు ఆటగాడిగా, ఇటు కెపె్టన్గా కూడా ఈ సమయంలో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. భారత అభిమానుల కోణంలో చూస్తే ఈ సమయంలో కోహ్లి అసలైన టెస్టు మజాను చూపించాడు. జట్టును తన బ్యాటింగ్తో బలమైన స్థితిలో నిలపడమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు అసాధారణ బ్యాటింగ్తో టెస్టులను ఎలా ఆడాలో అతను చేసి చూపించాడు.ఈ ఆరేళ్ల కాలంలో 55 టెస్టులు ఆడిన కోహ్లి ఏకంగా 63.65 సగటుతో 5347 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సమయంలో గణాంకాలు అతడిని నంబర్వన్ టెస్టు బ్యాటర్గా నిలిపాయి. ముఖ్యంగా ఒక 18 నెలలు అతని బ్యాటింగ్ శిఖరానికి చేరింది. కేవలం 34 ఇన్నింగ్స్ల వ్యవధిలో కోహ్లి ఏకంగా 6 డబుల్ సెంచరీలు నమోదు చేయడం విశేషం. 34 ఇన్నింగ్స్ల వ్యవధిలో చూస్తే ఒక్క బ్రాడ్మన్ (8) మాత్రమే అతనికంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. కాస్త పదును తగ్గి... అసాధారణ బ్యాటింగ్ తర్వాత 2020 ఆరంభం నుంచి అతని టెస్టు బ్యాటింగ్లో పదును కాస్త నెమ్మదించింది. కోవిడ్ కారణంగా మ్యాచ్ల సంఖ్య తగ్గడంతో పాటు ఒకే తరహా జోరును కొనసాగించడంలో కోహ్లి విఫలమయ్యాడు. సెంచరీ మొహం చూసేందుకు మూడేన్నరేళ్లు పట్టాయి. 2021 ఇంగ్లండ్ పర్యటన కేవలం 2 అర్ధసెంచరీలతో నిరాశగా ముగియగా, 2023–24 దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా అతని ముద్ర కనిపించలేదు. ఇటీవల ముగిసిన ఆ్రస్టేలియా సిరీస్లోనైతే పెర్త్ మినహా అతని బ్యాటింగ్ చూస్తే కెరీర్ ముగింపునకు వచి్చనట్లే అనిపించింది. జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆడిన 39 టెస్టుల్లో కోహ్లి కేవలం 30.72 సగటుతో 2028 పరుగులు సాధించాడు. 3 శతకాలు మాత్రమే నమోదు చేయగలిగాడు. గత రెండేళ్లుగా అతని బ్యాటింగ్ సగటు 32.56 మాత్రమే. ఎలా చూసుకున్నా ఇది ఒక ప్రధాన బ్యాటర్కు సంబంధించి పేలవ ప్రదర్శనే. టెస్టు బ్యాటర్గా తన అత్యుత్తమ దశను ఎప్పుడో దాటిన కోహ్లి ఇప్పుడు కెరీర్ను హడావిడి లేకుండా ముగించాడు. పడి... పైకి లేచి... కోహ్లి వైఫల్యం గురించి చెప్పాలంటే అందరికీ గుర్తుకొచ్చేది 2014లో ఇంగ్లండ్లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్. స్వింగ్కు అనుకూలించిన అక్కడి పరిస్థితుల్లో సరైన ఫుట్వర్క్ లేక ఒకే తరహాలో పదే పదే అవుట్ అవుతూ కోహ్లి అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు. భారత నంబర్వన్ బ్యాటర్గా అక్కడ అడుగు పెట్టి అద్భుతాలు చేస్తాడనుకుంటే పూర్తిగా చేతులెత్తేశాడు. 10 ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 134 పరుగులతో ఘోరంగా విఫలం కావడమే కాదు... అప్పటి బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా గర్ల్ఫ్రెండ్ అనుష్క శర్మను టూర్కు తీసుకెళ్లి తీవ్ర విమర్శలపాలయ్యాడు.అయితే నాలుగేళ్లు తిరిగాయి... కోహ్లి ఆట మారింది. వ్యక్తిగా కూడా ఎంతో మారాడు. లోపాలను సరిదిద్దుకొని 2018లో మళ్లీ ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టాడు. ఏ బౌలర్నూ లెక్క చేయకుండా నాటి గాయాలూ మానేలా చెలరేగిపోయాడు. 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో ఏకంగా 593 పరుగులు సాధించి సిరీస్ టాపర్గా నిలిచాడు. ఇది కోహ్లిలోని పట్టుదలను, తాను విఫలమైన చోట మళ్లీ తానేంటో చూపించుకోవాలనే కసిని చూపించింది. ⇒ 4 భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సచిన్ (15,921), ద్రవిడ్ (13,288), గావస్కర్ (10,122) తర్వాత నాలుగో స్థానంలో నిలిచిన కోహ్లి (9230)... అత్యధిక శతకాల జాబితాలో కూడా సచిన్ (51), ద్రవిడ్ (36), గావస్కర్ (34) తర్వాత 30 శతకాలతో నాలుగో స్థానంలోనే ఉన్నాడు. ⇒ 4 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెపె్టన్ల జాబితాలో గ్రేమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41) తర్వాత కోహ్లి (40) నాలుగో స్థానంలో నిలిచాడు. ⇒ 7 కోహ్లి డబుల్ సెంచరీల సంఖ్య. ఓవరాల్ జాబితాలో బ్రాడ్మన్ (12; ఆస్ట్రేలియా), సంగక్కర (11; శ్రీలంక), లారా (9; వెస్టిండీస్) తర్వాత వాలీ హామండ్ (7; ఇంగ్లండ్), జయవర్ధనే (7; శ్రీలంక)లతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. -
చరిత్ర సృష్టించిన పాక్ బ్యాటర్.. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు
పాక్ బ్యాటర్ సౌద్ షకీల్ చరిత్ర సృష్టించాడు. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఏడు టెస్ట్ల్లో కనీసం ఓ హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 27 ఏళ్ల షకీల్ తన టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు 7 టెస్ట్ మ్యాచ్ల్లో 13 ఇన్నింగ్స్ల్లో 87.5 సగటున ఓ అజేయమైన డబుల్ సెంచరీ, అజేయమైన సెంచరీ, 5 హాఫ్ సెంచరీల (ఓ అజేయమైన హాఫ్ సెంచరీ) సాయంతో 875 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో షకీల్ వరుసగా (37 & 76), (63 & 94), (23 & 53), (22 & 55 నాటౌట్), (125 నాటౌట్ & 32), (208 నాటౌట్ & 30), 57 స్కోర్లు చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు.. తన తొలి 7 టెస్ట్ల్లో ఈ ఘనత సాధించింది లేదు. కాగా, శ్రీలంక పర్యటనలో తొలి టెస్ట్ మ్యాచ్ నెగ్గి 2 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న పాక్.. లంకతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్లోనూ పట్టు బిగించింది. నాలుగో రోజు ఆటలో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ను 576/5 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఆ జట్టుకు 410 తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అబ్దుల్లా షఫీక్ (201) డబుల్ సెంచరీతో చెలరేగగా.. అఘా సల్మాన్ (132) అజేయ శతకంతో మెరిశాడు. షాన్ మసూద్ (51), సౌద్ షకీల్ (57), మహ్మద్ రిజ్వాన్ (50 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం 410 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించిన శ్రీలంక.. 27 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. నిషాన్ మధుష్క (33), దిముత్ కరుణరత్నే (41) ఔట్ కాగా.. కుశాల్ మెండిస్ (12), ఏంజెలో మాథ్యూస్ (4) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఇంకా రెండ్రోజుల ఆట (27, 28 తేదీలు) మిగిలి ఉంది. పాక్కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో పాక్ గెలిస్తే 2 మ్యాచ్ల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేస్తుంది. -
వారెవ్వా అక్షర్ పటేల్.. టెస్టు క్రికెట్ చరిత్రలో మూడో బౌలర్గా
Axar Patel Was 3rd Bowler In Test Cricket history.. టీమిండియా లెగ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్లో తన సూపర్ ఫామ్ను కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో అక్షర్ పటేల్ 34 ఓవర్లు వేసి 6 మెయిడెన్లు సహా 62 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టామ్ లాథమ్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, టామ్ బ్లండర్, సౌథీ రూపంలో అక్షర్ 5 వికెట్లు తీసుకున్నాడు. అంతకముందు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో నాలుగుసార్లు ఐదు వికెట్ల మార్క్ను అందుకున్నాడు. చదవండి: Ashwin Vs Nitin Menon: అంపైర్తో అశ్విన్ గొడవ.. అది మనసులో పెట్టుకొనేనా? ► కాగా అక్షర్ టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీయడం ఇది ఐదోసారి. తొలి నాలుగు టెస్టుల్లో ఎక్కువసార్లు ఐదు వికెట్లు తీసిన జాబితాలో టామ్ రిచర్డ్సన్, రోడ్ని హగ్తో కలిసి అక్షర్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో ఉన్న చార్లి టర్నర్ తొలి నాలుగు టెస్టుల్లో ఆరు సార్లు ఐదు వికెట్ల మార్క్ను అందుకున్నాడు. ఇక వెర్నన్ ఫిలాండర్, ఫ్రెడ్ స్పోపోర్త్, సిడ్ బార్నెస్, నిక్ కుక్లు నాలుగేసి సార్లు ఐదు వికెట్ల మార్క్ సాధించారు. ► ఇంకో విశేషమేమిటంటే డెబ్యూ టెస్టు నుంచి తాను ఆడిన నాలుగు టెస్టుల్లో అక్షర్ ప్రతీ టెస్టులో ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంతకముందు ఇద్దరు మాత్రమే ఈ ఘనత సాధించారు. చార్లీ టర్నర్ (1887లో డెబ్యూ నుంచి తొలి నాలుగు టెస్టులు), టామ్ రిచర్డ్సన్(1893 డెబ్యూ నుంచి తొలి నాలుగు టెస్టులు) ఉన్నారు. తాజాగా అక్షర్ పటేల్ వీరి సరసన నిలిచాడు. చదవండి: Tom Latham Stump Out: రెండో బ్యాట్స్మన్గా టామ్ లాథమ్! 30 ఏళ్ల తర్వాత.. ► ఇక టీమిండియా తరపున అక్షర్ పటేల్ కంటే ముందు ఎల్. శివరామకృష్ణన్, నరేంద్ర హిర్వాణిలు తొలి నాలుగు టెస్టుల్లో మూడేసి సార్లు ఐదు వికెట్ల మార్క్ను సాధించారు. కాగా ఈ విషయంలో మాత్రం అక్షర్ పటేల్ టీమిండియా తరపున తొలి స్థానంలో నిలిచాడు. -
144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్ర.. కుంబ్లే ఫీట్కు దక్కని చోటు
లండన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ను పురస్కరించుకుని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆవిష్కరించిన ఓ పోస్టర్ వివాదాస్పదంగా మారింది. 144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలోని గ్లింప్సెస్ను పొందుపరుస్తూ ఐసీసీ రూపొందించిన ఈ పోస్టర్లో భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు చోటు దక్కకపోవడంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుంబ్లే 1998-99లో పాక్పై సాధించిన 10 వికెట్ల ఫీట్ను ఐసీసీ పరిగణలోకి తీసుకోకపోవడంపై వారు మండిపడుతున్నారు. ఈ చర్య కుంబ్లేను ఉద్దేశపూర్వకంగా అవమానించినట్టేనంటూ ఊగిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ అంశాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా, 1877లో మెల్బోర్న్ వేదికగా ఆసీస్-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ మొదలుకుని.. నేటి డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు సేకరించిన కొన్ని గ్లింప్సెస్తో ఐసీసీ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఇందులో దిగ్గజ ఆటగాళ్లు షేన్ వార్న్, అండర్సన్, ముత్తయ్య మురళీధరన్, ఇమ్రాన్ ఖాన్, జాక్వెస్ కల్లిస్, సచిన్ టెండుల్కర్, స్టీవ్ వా, షకీబుల్ హసన్, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ తదితర దిగ్గజాల ఫొటోలను ముద్రించింది. ఈ విషయంలో ఐసీసీ ప్రయత్నం మెచ్చుకోదగ్గదే అయినప్పటికీ.. కొన్ని అరుదైన ఫీట్లను విస్మరించడం వివాదాస్పదంగా మారింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదుగా చెప్పుకునే ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్ల ఘనత సాధించిన అనిల్ కుంబ్లేకు చోటు లభించకపోవడంపై భారతీయ అభిమానులు ఊగిపోతున్నారు. చదవండి: KL RAHUL: ప్రియసఖితో తొలిసారి.. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే -
టెస్టుల్లో రికార్డు సృష్టించిన లంక బౌలర్
ఢాకా: శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్ టెస్టుల్లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో తైజూల్ ఇస్లాం వికెట్ పడగొట్టి అత్యధిక వికెట్ల పడగొట్టిన లెఫ్టార్మ్ బౌలర్గా రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు పాక్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ పేరిట ఉండగా హెరాత్ అధిగమించాడు. ఇప్పటికే 400 వికెట్ల మార్కును దాటిన ఐదో స్పిన్ బౌలర్గా హెరాత్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇక 89 టెస్టు మ్యాచ్లాడిన హెరాత్ 28.17 సగటుతో 415 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు పాక్ దిగ్గజ బౌలర్ వసీమ్ 104 మ్యాచుల్లో 414 వికెట్లు పడగొట్టి ఈ రికార్డును నమోదు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో హెరాత్ 4వికెట్లతో చెలరేగడంతో బంగ్లాదేశ్పై 215 పరుగుల తేడాతో లంక భారీ విజయంసాధించింది. ఈ గెలుపుతో 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది. లంక ఆటగాడు రోషన్సిల్వా కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్, మ్యాన్ఆఫ్ది సిరీస్లు లభించాయి. తొలి ఇన్నింగ్స్: శ్రీలంక 222 ఆలౌట్, బంగ్లాదేశ్ 110 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: శ్రీలంక 226 ఆలౌట్, బంగ్లాదేశ్ 123 ఆలౌట్ -
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి..!
వెల్లింగ్టన్: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన వెస్టిండీస్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో చోటుచేసుకుంది. విండీస్ ప్లేయర్ సునీల్ అంబ్రిస్ తన అరంగేట్ర టెస్టులోనే ఓ అరుదైన చెత్త రికార్డును నమోదు చేశాడు. తొలి టెస్టులో ఎదుర్కొన్న తొలి బంతికే ( గోల్డెన్ డక్ ) హిట్ వికెట్ అయిన తొలి బ్యాట్స్మెన్గా అంబ్రిస్ గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు ఈ చెత్త రికార్డు విండీస్కే చెందిన సీఎస్ బాహ్ పేరిట ఉండగా అంబ్రిస్ అధిగమించాడు. సీఎస్ బాహ్ 2003లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్ర మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 19 పరుగులకు హిట్ వికెట్ అయి ఈ రికార్డు జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగాడు. తొలి ఇన్నింగ్స్లో నీల్ వాగ్నర్ 29 ఓవర్ తొలి బంతిని ఫైన్లెగ్ షాట్ ఆడాడు. కానీ అతని ఎడమ కాలు స్టంప్స్ను తాకడంతో హిట్ వికెట్గా వెనుదిరిగాడు. అరంగేట్ర టెస్టు మ్యాచ్లో ఎన్నో కలలతో బ్యాటింగ్కు దిగిన అంబ్రిస్ దురదృష్టం వెంటాడటంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. -
మూడో 'అతిపెద్ద' ఇన్నింగ్స్!
అబుదాబి: టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పాకిస్థాన్ తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో డబుల్ సెంచరీతో విశేషంగా రాణించిన కుక్ మరో ఘనతను కూడా సాధించాడు. కుక్ (528 బంతుల్లో 263; 18 ఫోర్లు) ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఈ స్కోరును చేసే క్రమంలో కుక్ సుదీర్ఘంగా 836 నిమిషాల పాటు క్రీజ్ లో ఉన్నాడు. దాదాపు 14 గంటల పాటు క్రీజ్ ను అంటిపెట్టుకుని ఇంగ్లండ్ కు కీలక ఇన్నింగ్స్ సాధించిపెట్టాడు. అంతకుముందు ఈ ఘనతను సాధించిన వారిలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు హానిఫ్ మహ్మద్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిరెస్టన్ లు ఉన్నారు. 1958 లో బ్రిడ్జిటౌన్ లో వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ లో 970 నిమిషాల పాటు క్రీజ్ లో ఉండి 337 పరుగులు సాధించిన హనీఫ్ అగ్రస్థానంలో ఉండగా, 1999లో డర్బన్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 878 నిమిషాలు క్రీజ్ లో ఉండి 275 పరుగులను సాధించిన గ్యారీ కిరెస్టన్ రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా కుక్ ఆడిన ఇన్నింగ్స్ టెస్టు క్రికెట్ చరిత్రలో మూడో అతిపెద్ద ఇన్నింగ్స్ గా రికార్డులకెక్కింది.