Tala semiya
-
బడికి వెళ్లే వయసులోనే.. రక్త కన్నీటి గాథ..!
కొందరు చిన్నారులు తల్లిపాలు తాగే వయస్సులో రక్తాన్ని ఎక్కించుకుంటూ తల్లడిల్లుతున్నారు. బడికి వెళ్లాల్సిన సమయంలో రక్తనిధి కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాక్లెట్లు చప్పరించాల్సిన నోటితో చేదు మందు బిల్లలు తింటున్నారు. తోటి చిన్నారులు ఆనందంగా ఆడుకుంటుంటే చూస్తూ ఉండటం తప్ప ఏమి చేయలేని నిస్సహాయస్థితి వారిది. అలసట, ఆయాసాల మధ్య ప్రాణాంతక వ్యాధి తలసేమియా బాధితుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఉమ్మడి జిల్లాలో 179 మంది చిన్నారుల సంతోషాన్ని ఇది దూరం చేస్తోంది. అయితే వారి ఆయుష్షు పెంచే బాధ్యతను జిల్లా జనరల్ ఆస్పత్రి, రెడ్క్రాస్ తీసుకుంది. రక్తం ఎక్కించాల్సిందే.. తలసేమియా జన్యు సంబంధిత వ్యాధి. వ్యాధి సోకిన వారికి వారం, పదిహేను రోజులకు ఒకసారి రక్తాన్ని ఎక్కించాల్సిందే. లేకపోతే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ వ్యాధిగ్రస్థుల్లో హిమోగ్లోబిన్ ఉత్పత్తి శరీరానికి అవసరమైనంత ఉండదు. ఒకవేళ ఉత్పత్తి అయినా ఎక్కువ కాలం ఉండదు. 2018లో తలసేమియాను ఆరోగ్యశ్రీ పథకంలో విలీనం చేయడం వల్ల బాధితులకు ప్రతి నెల మందులను జనరల్ ఆస్పత్రి నుంచి ఇస్తుంటే.. రక్తం మాత్రం రెడ్క్రాస్ నుంచి అందిస్తున్నారు. ఇదీ చదవండి: World Ovarian Cancer Day : సైలెంట్గా..స్త్రీలకు గండంగా!వ్యాధి లక్షణాలు.. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంది. చిన్నారులు ఎదుగుతున్న కొద్దీ వ్యాధి బయటపడుతుంది. వ్యాధి బారినపడిన పిల్లలకు రక్తహీనత మొదలై జీర్ణశక్తి మందగిస్తుంది. ముఖం పాలిపోవటం, ఎదుగుదల లేకపోవడం, హుషారు తగ్గడం, నీరసించి పోవడం వంటి లక్షణాలు కని్పస్తాయి. కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి ప్రారంభమై, మూత్రం పసుపు వర్ణంతో వస్తోంది. ఇదీ చదవండి: వాడిన నూనెను ఇంత బాగా క్లీన్ చేయొచ్చా.. సూపర్ ఐడియా!పరీక్షలు చేయించు కోవాలి ఈ వ్యాధి బారిన పడినవారు పసువు రంగులో మూత్ర విసర్జన చేస్తుండటం వల్ల దీనిని తల్లిదండ్రులు పచ్చకామెర్లుగా భావిస్తుంటారు. అవగహన లేమి కారణంగా పచ్చ కామెర్లకు చికిత్స అందిస్తారు. పైలక్షణాలు పిల్లల్లో ఉంటే జనరల్ ఆస్పత్రిల్లో పూర్తిస్థాయి పరీక్షలు చేయించి చికిత్స చేయించుకోవాలి. -
దేవుడోలె ఆదుకుంటారని..
కష్టాలు లేని, రాని మనిషులుంటారా..? కచ్చితంగా ఉండరు. కానీ కక్షకట్టి దాడిచేసినట్టు.. ఒకదాని తర్వాత ఒకటిగా మీదనొచ్చి పడితే తట్టుకోవడం సాధ్యమా.. ఎంతమాత్రమూ కాదు. అందులోనూ ఖరీదైన జబ్బుల రూపంలో వచ్చి పట్టిపీడిస్తే..? అదీ రోజుకూలి చేసుకుని బతుకుబండిని లాగే పేదలైతే.. నిత్యం నరకమే. కానీ ఇదే జరిగింది ఉప్పలయ్యకు.. ఒకదాన్నుంచి తెరిపి లభించిందనుకునేలోపే.. మరొటి.. ఆ వెంటనే ఇంకోటి. తట్టుకోలేకపోయాడు. చివరికి మంచం పట్టాడు. పాపం చిన్నారి రుషికేష్కూ అంతే. ఆడిపాడాల్సిన వయసులో.. ముద్దుముద్దు మాటలతో ఇంట్లో నవ్వులు పూయించాల్సిన చిరుప్రాయంలో తలసేమియాతో మంచానికే పరిమితమయ్యాడు. సాధ్యమా.. వీరిని చూస్తూ తట్టుకోవడం సాధ్యమా.. దేవుడిలా వచ్చి దాతలు ఆదుకుంటారని, ఆపన్నహస్తం అందించి ఆదుకుంటారని వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి ఈ విధివంచిత కుటుంబాలు. తలసేమియాతో తల్లడిల్లుతున్న బాలుడు మహబూబాబాద్ : మానుకోటకు చెందిన బొడ్డుపెల్లి ఉపేందర్, అరుణ దంపతులది నిరుపేద కుటుంబం. ఉపేందర్ హోంగార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఆరున్నరేళ్ల క్రితం కుమారుడు రుషికేష్ జన్మించడంతో సంబరపడిపోయారు. కానీ ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. పుట్టిన కొన్ని రోజులకే బాబుకు అనారోగ్యంగా ఉందని ఆస్పత్రికి తీసుకెళ్తే అప్పుడు తెలిసింది గుండెలు పిండేసే విషయం. చిన్నారి తలసేమియాతో బాధపడుతున్నాడని, నెలలో రెండుసార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో బోరున విలపించారు. బాబును బతికించుకునేందుకు హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడి రెడ్క్రాస్ సొసైటీలో ఉచితంగా రక్తాన్ని ఇస్తున్నారు. అయితే మందులు, రవాణా చార్జీలు కలిపి ప్రతినెల ఐదువేల రూపాయల వరకు అవుతున్నాయని ఉపేందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు విధులకు హాజరుకాకుంటే వేతనంలో కోత పెడుతున్నారని వాపోతున్నాడు. వస్తున్న వేతనం బాలుడి వైద్యానికే ఖర్చవుతుండడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కన్నీరు పెట్టుకున్నాడు. మంచానికే పరిమితం రోజులు గడుస్తున్న కొద్దీ రుషికేష్ ఆరోగ్యం క్షీణిస్తోంది. బాలుడి తల్లి నిత్యం దగ్గరుండి సేవలందిస్తున్నా పరిస్థితిలో మా త్రం ఇసుమంతైనా మార్పులేదు. ఇంట్లో చెంగుచెంగున ఎగురుతూ సందడి చేయాల్సిన కొడుకు ఇలా మంచానికే పరిమితమవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మద్రాసులోని ఓ ప్రై వేటు ఆస్పత్రిలో రుషికేష్కు బోన్మారో ఆపరేషన్ చేయిస్తే తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు అవకాశం ఉందని, ఇందుకు రూ.25లక్షలకు పైగా ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియక అల్లాడిపోతున్నారు. డబ్బులు సమకూర్చుకునేందుకు ఏడాది కాలంగా పడరాని పాట్లు పడుతున్నారు. ప్రతి ఒక్కరిని చేతులు జోడించి అర్థిస్తున్నా రు. తమకు ఏ ఆధారం లేకపోవడంతో అప్పు ఇచ్చేందుకు అందరూ వెనుకాడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. పేదోళ్లకి ఖరీదైన జబ్బు రాకూడదంటూ వెక్కివెక్కి ఏడుస్తున్నారు. ప్రభుత్వం, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు.