breaking news
survey completed
-
హుజూరాబాద్లో దళితబంధు సర్వే పూర్తి.. ఎంత మందికంటే
హుజూరాబాద్ రూరల్: దళితబంధు సర్వే గురువారంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ముగిసింది. ఆగస్టు 27 నుంచి ఏడురోజుల పాటు ఐదు మండలాల్లో అధికారులు ఇంటింటా తిరుగుతూ.. సర్వే నిర్వహించారు. 2014 సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా వివరాలు సేకరించారు. 17,166 కుటుంబాలకుగానూ.. 16,370 కుటుంబాల వివరాలు యాప్లో అప్లోడ్ చేశారు. మరో 2,775 కుటుంబాలకు సంబంధించి దరఖాస్తులు నింపారు. సర్వేలో నియోజకవర్గంలో మొత్తంగా 18,619 దళిత కుటుంబాలు ఉన్నట్లు తేల్చారు. హుజూరాబాద్ పట్టణంలో 1,794 కుటుంబాల వివరాలు యాప్లో నమోదు చేశారు. మరో 611కుటుంబాలకు సంబంధించి దరఖాస్తులు నింపారు. హుజూరాబాద్ మండలంలోని 19 పంచాయతీల్లో 3,387 కుటుంబాల వివరాలు ఆప్లోడ్ చేశారు. మరో 295 కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జమ్మికుంట మున్సిపాలిటీలో 2,313 కుటుంబాలను పొందుపర్చారు. 446 కుటుంబాలవి దరఖాస్తులు స్వీకరించారు. జమ్మికుంట రూరల్ పరిధిలో 2,428 కుటుంబాలను గుర్తించగా 464 దరఖాస్తులను స్వీకరించారు. ఇల్లందకుంట మండలంలో 2,951కుటుంబాలను ఆప్లోడ్చేశారు. వీణవంక మండలంలో 3,497 కుటుంబాల వివరాలు యాప్లో, 955 దరఖాస్తులను నేరుగా స్వీకరించారు. చదవండి: ‘సోనీ క్షమించు! నీకు ఏం చేయలేకపోయా’ కన్నీటితో భర్త చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి -
నల్లపాడు-గుంతకల్ రెండో రైల్వేలైన్కు సర్వే పూర్తి
మార్కాపురం టౌన్, న్యూస్లైన్ : దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్లోని నల్లపాడు నుంచి గుంతకల్ వరకు రెండో లైన్ ఏర్పాటుకు సర్వే పూర్తయిందని, వచ్చే మార్చి బడ్జెట్లో దీన్ని ప్రవేశపెడతామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాత్సవ తెలిపారు. శ్రీశైలం వెళ్లివస్తూ మార్గమధ్యంలోని మార్కాపురం రైల్వేస్టేషన్లో శుక్రవారం ఆయన ఆగారు. స్టేషన్ను పరిశీలించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 426 కోట్ల రూపాయలతో నల్లపాడు నుంచి గుంతకల్ వరకు ఎలక్ట్రికల్ లైన్ ఏర్పాటు చేసేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. బడ్జెట్ అనంతరం పనులు చేపడతామన్నారు. అలాగే మార్కాపురం నుంచి విజయవాడకు కొత్త రైలు మంజూరైనట్లు తెలిపారు. మార్కాపురం రైల్వేస్టేషన్లోని సమస్యలను డీఆర్యూసీసీ మెంబర్ షేక్ ఇస్మాయిల్, తదితరులు జీఎం దృష్టికి తెచ్చారు. హౌరా-పుట్టపర్తి సూపర్ఫాస్ట్ రైలును బెంగళూరు వరకు పొడిగించాలని, మొదటి ప్లాట్ఫాంపై షెడ్డు, ఫ్లోరింగ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. మార్కాపురం రైల్వేస్టేషన్ను మోడల్ స్టేషన్గా తీర్చిదిద్దాలని, మచిలీపట్నం-యశ్వంత్పూర్ రైలును ప్రతిరోజూ నడపాలని, విశాఖపట్నం-గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను నంద్యాల వరకు పొడిగించాలని, గుంటూరు-సికింద్రాబాద్, సికింద్రాబాద్-గుంటూరు రైలును ఫాస్ట్ ప్యాసింజర్గా మార్పుచేయాలని, గుంటూరు-డోన్ ప్యాసింజర్ను గుంతకల్ వరకు పొడిగించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. అనంతరం జీఎంను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గుంటూరు డివిజన్ రైల్వే మేనేజర్ ఎన్కే ప్రసాద్, ప్రయాణికుల సంఘ నాయకుడు, డీఆర్యూసీసీ మెంబర్ షేక్ ఇస్మాయిల్, సంఘ అధ్యక్షుడు మల్లిక్, సెక్రటరీ ఆర్కేజే నరసింహం, గౌరవాధ్యక్షుడు మాలకొండ నరసింహారావు, కోశాధికారి కె.శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ గుంటక వెలుగొండారెడ్డి, గైకోటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.