breaking news
ST commission chairman
-
ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్గా కుంభా రవిబాబు బాధ్యతలు స్వీకరించారు
-
ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్గా కుంభా రవిబాబు బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్గా కుంభా రవిబాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 32 లక్షల మంది గిరిజనుల కల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని తెలిపారు. ఎస్టీ కమిషన్ ఏర్పాటుతో ఆదివాసీల పక్షపాతిగా నిలిచారన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసీల సమగ్రాభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. గతంలో అటకెక్కిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కుంభా రవిబాబు వెల్లడించారు. చదవండి: ఉగాదికి విద్యాశాఖ పోస్టుల భర్తీకి క్యాలెండర్ పూలింగ్.. ప్రపంచంలోనే పెద్ద స్కామ్ -
దళిత భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
రాజమహేంద్రవరం: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశంలో మాదిగలు వినతిపత్రం ఇస్తే ప్రభుత్వానికి సమర్పిస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ చెప్పారు. బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అధికారులతో సమీక్ష, రాజ మహేంద్రవరం ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. రాజమహేంద్రవరం డివిజన్లో దళితుల భూములు అన్యాక్రాంతమైనట్టు తమ దృష్టికి వచ్చిందని, రెవెన్యూ అధికారులు సత్వరమే పరిష్కరించాలని సూచించారు. దళిత భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రుణాలను రాజమహేంద్రవరం కార్పొరేషన్ కమిషనర్ వెంటనే మంజూరు చేయాలని కోరారు. వెంకటాయపాలెం శిరోముండన కేసు పురోగతి కోసం కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ను ఆదేశించినట్టు తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సర్పంచ్లను కుల వివక్షతో వేధింపులకు గురిచేసినా, అనవసరంగా చెక్పవర్ రద్దు చేసినా సహించేది లేదన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు గ్రామసభ తీర్మానాలు చేయడంలో అడ్డుపడవద్దని కారెం శివాజీ కోరారు.