breaking news
The severity of the disease
-
అల్జైమర్స్కు ఉంది మంచి చికిత్స
హోమియో కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 86. ఆయన ఆరోగ్యంగానే ఉంటారు కానీ, ఈ మధ్య వాకింగ్కని వెళ్లి, ఇల్లు కనుక్కోలేక పోతున్నారు. అలాగే కళ్లద్దాలు, హ్యాండ్స్టిక్, సెల్ఫోన్ వంటి వాటిని ఒకచోట పెట్టి మరోచోట వెతుక్కుంటున్నారు. ఒక్కోసారి మా పిల్లల పేర్లు కూడా మర్చిపోతున్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. ఆయన మతిమరపును తగ్గించవచ్చా? - కె.వి.ఆర్, హైదరాబాద్ ప్రతిమనిషి తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి మరచిపోవటం సహజం. ఈ మతిమరపు ఎక్కువగా వృద్ధాప్యంలో చూడటం సాధారణం. వృద్ధులు తమ వస్తువులను ఒకచోట పెట్టి, ఆ విషయం మరచిపోయి మరోచోట వెతుక్కోవడం చూస్తూనే ఉంటాం. కొంతమందిలో కొన్ని కారణాల వల్ల ఈ మతిమరపు ఎక్కువ అవుతుంటుంది. వాకింగ్ చేస్తూండగానో, మరో పనిచేస్తుండగానో తామెందుకు ఆ ప్రదేశానికి వచ్చామో మరచిపోయి మతిభ్రమించినట్లు వెర్రిగా ప్రవర్తించటం చూస్తుంటాం. అదిచూసి ఇంటిలోని వారు విసుక్కోవటం, కోప్పడటం, బాధపడటం సాధారణం. అయితే వారు తమ సమీప బంధుమిత్రులను, ముఖ్యంగా కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేక సతమతమవుతుండటం వంటి లక్షణాలను గమనించినట్లయితే వారు అల్జైమర్ డిసీజ్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించవచ్చు. అల్జైమర్స్ డిసీజ్ అంటే ఏమిటి? డెమైన్షియా అనేది మెదడుకు సంబంధించిన సమస్య. దీని వలన మనిషి అలవాటు పడ్డ పనులలో తేడా రావటం గమనిస్తాము. వృద్ధాప్యంలో చూసే మతిభ్రమణ అంటే డెమైన్షియాను అల్జైమర్స్ డిసీజ్ అంటారు. ఇది మొదట మెదడు భాగాలలో ప్రభావం చూపి క్రమేపీ మనిషి ఆలోచనా విధానంలో, జ్ఞాపకశక్తిలో, భాషావిధానంలో మార్పు తీసుకు వస్తుంది. ఇది సామాన్యంగా 60 ఏళ్ల తర్వాత వస్తుంది. ఆ తర్వాత వయస్సు పెరిగేకొద్దీ వ్యాధి విపరీతమయ్యే అవకాశం ఉంది. స్త్రీ పురుషులిరువురిలోనూ ఈ వ్యాధి కనిపిస్తుంది. మెదడుకు బలమైన దెబ్బతగలటం వల్ల మెదడులో సరిగా రక్తప్రసరణ సరిగా జరగక భవిష్యత్తులో ఈవ్యాధి వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు రోగి ఇంటిలోనుంచి వెళ్లిపోవటం, యాంగ్జైటీకి గురవటం, తమ ఇంటినే గుర్తించలేకపోవటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. నిర్ధారణ: రోగి శారీరక, మానసిక లక్షణాలలో మార్పులను బట్టి, రక్తపరీక్ష, బ్రెయిన్ సీటీస్కాన్, ఎమ్మారై హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్లో రోగి శారీరక, మానసిక లక్షణాలను విశ్లేషించి వ్యాధి కారణాలను కనుగొన్న తర్వాత వైద్యుని పర్యవేక్షణలో మందులు వాడటం ద్వారా అల్జైమర్స్ వ్యాధిని నయం చేయవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సిఎండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ గుండె పెరిగింది..! కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. ఈమధ్య నాకు కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం, దగ్గు, ఛాతీలో నొప్పి వస్తే మా ఫ్యామిలీ డాక్టర్ను సంప్రదించాను. గుండె పెరిగిందని చెప్పారు. ఇలా గుండె పెరగడానికి కారణాలు, లక్షణాలను వివరించండి. - రామారావు, వరంగల్ మన గుండె ఒక పంప్లా పనిచేస్తుంటుంది. ఈ పంపు బలహీనమైనప్పుడు శరీరానికి అవసరమైన రక్తాన్ని పంప్ చేయలేదు. అంతేగాక వివిధ అవయవాలకు అవసరమైన పోషకాలు అందవు. ఈ పరిస్థితినే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఒత్తిడి పెరిగినప్పుడు తాత్కాలికంగా గుండె విస్తరిస్తుంది. ముఖ్యంగా గర్భిణిగా ఉన్నప్పుడు, గుండె కండరాలు బలహీనమైనప్పుడు, కరొనరీ ఆర్టెరీ వ్యాధి వచ్చినప్పుడు, మహిళల్లో ముఖ్యంగా గర్భం దాల్చినప్పుడు, గుండె కండరాలు బలహీనమైనప్పుడు, గుండె కవాటాల సమస్య ఉన్నప్పుడు. గుండె అసాధారణంగా కొట్టుకున్నప్పుడు గుండె పెరుగుతుంది. కేవలం కొన్ని సందర్భాల్లో గుండె విస్తరించడాన్ని నివారించలేం. కానీ చాలా కేసుల్లో చికిత్స చేసే వీలుంది. గుండె విస్తరించడానికి కారణమయ్యే అంశాలను దృష్టిలో పెట్టుకొని చికిత్స చేస్తారు. అవసరమైతే శస్త్రచికిత్సతో కూడా వైద్యం చేస్తారు. గుండె విస్తరించడాన్ని (హార్ట్ ఎన్లార్జ్మెంట్) వైద్య పరిభాషలో కార్డియో మెగాలీ అంటారు. ఇది వ్యాధి కాదు. ఇతర మెడికల్ కండిషన్లకు సంబంధించిన ఒక లక్షణం. ఛాతీ ఎక్స్రే తీసినప్పుడు అందులో గుండె విస్తరించి ఉందని వైద్యులు చెబుతుంటారు. ఆ తర్వాత ఇతర పరీక్షలు చేస్తారు. కొంతమందిలో గుండె విస్తరించినా ఎలాంటి లక్షణాలూ, చిహ్నాలు కనిపించవు. కానీ కొంతమందిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి... శ్వాసక్రియలో సమస్యలు, కళ్లు తిరగడం, గుండె అసాధారణంగా కొట్టుకోవడం, వాపు (ఎడీమా), ఛాతీలో నొప్పి వంటి లక్షణలు కనిపిస్తాయి. గుండె విస్తరించడాన్ని ముందుగానే గుర్తిస్తే చికిత్స చేయడం సులభమవుతుంది. గుండె పెరగడానికి కారణాలు : అధిక రక్తపోటు, కార్డియోమయోపతి వంశపారంపర్యంగా ఉన్నా, గుండె ధమనుల్లో అడ్డంకులు ఉన్నా, పుట్టుకతో వచ్చే గుండె జబ్బు, గుండె కవాటాల వ్యాధి, అసాధారణ హృదయ స్పందన, పల్మునరీ హైపర్టెన్షన్, రక్తహీనత, థైరాయిడ్, అధిక ఐరన్, గుండెపోటు వంటి వాటి వల్ల గుండె విస్తరించే ముప్పు ఉంది. గుండె ఆరోగ్యంపై మీ ఆందోళనలను మీ డాక్టర్తో పంచుకోండి. దీనివల్ల కలిగే పరిణామాలను ఎలా నివారించాలో చర్చించండి. పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్యం చేయించుకోవడం తప్పనిసరి. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాసిత్పటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
స్వైన్..భయం
సిటీబ్యూరో : నగర వాసులను స్వైన్ భయం వెంటాడుతోంది... ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన వారు.. రోజు రోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్యను చూసి సిటిజన్లు హడలిపోతున్నారు. ఇళ్లు వదిలి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీని ప్రభావం పర్యాటకులపైనా పడింది. నగరంలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల రాక భారీగా తగ్గిపోయింది. నిత్యం జనాలతో కిటకిటలాగే లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, లేజర్ షోలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. సాధారణ రోజుల్లో లేజర్ షోకు నిత్యం 1500 మంది సందర్శకులు వస్తుంటారు. అదే శని, ఆదివారాల్లో అయితే... ఆ సఖ్యం 2000లకు పైగానే ఉంటోంది. సాగర్ బోటింగ్, సంజీవయ పార్కు వంటివాటికి సెలవు రోజుల్లో జనం పోటెత్తుతుంటారు. వారం రోజులుగా రద్దీ క్రమక్రమంగా తగ్గుతోందని బీపీపీ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రైతుబజార్లలో భయం భయం కూరగాయలు కోసం రైతుబజార్కు వెళ్లిన వినియోగదారులు భయం భయంతో గడుపుతున్నారు. ప్రత్యేకించి మెహిదీపట్నం, కూకట్పల్లి, ఎర్రగడ్డ రైతుబజార్లు ఇరుకిరుకుగా ఉండడంతో అక్కడ ఎవరు తుమ్మినా, ముక్కుచీదినా పక్కవారు ఉలిక్కిపడుతున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు మాస్క్లు ధరించి వస్తున్నారు. స్కూళ్లలో ఆంక్షలు విద్యార్థులు విధిగా మాస్క్ ధరించి స్కూల్కు రావాలని పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆంక్షలు విధించాయి. మాస్క్ ధరించని విద్యార్థులను వెనక్కు పంపేస్తున్నారు. తొలిరోజు హెచ్చరిక జారీ చేసి మరునాడు మాస్క్తో రాకపోతే ఆ విద్యార్థులకి ఫైన్ విధించేలా చర్యలు తీసుకొన్నట్లు సమాచారం. అమ్మో...హైదరాబాద్ సికింద్రాబాద్: హైదరాబాద్ పేరు చెబితే ప్రజలు హడలి పోతున్నారు. ఇక్కడ ఉండాలన్నా.. పొరుగు ప్రాంతాల నుంచి ఇక్కడకు రావాలన్నా జంకుతున్నారు. స్వైన్ ఫ్లూ వైరస్ విజృంభణే ఇందుకు కారణం .. సిటీలో స్వైన్ మహమ్మారి స్వైర విహారం చేస్తుండడంతో భయంతో నగర వాసులు సొంతూరి బాట పడుతున్నారు.. అలాగే సిటీకి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గింది. మూడు రోజులుగా సిటీ నుంచి బయటకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోరోజువారీ ప్రయాణికుల కన్నా శనివారం 20 వేల పైచిలుకు ప్రయాణికులు ఇక్కడినుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. శనివారం నగరానికి చేరుకున్న రైళ్లలో ప్రయాణికుల సంఖ్య దాదాపు నలభై వేలకు తగ్గినట్టు అధికారులు చెపుతున్నారు.మహాత్మాగాంధీ , జూబ్లీ బస్టేషన్లు రద్దీగా కనిపించాయి. నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఫ్లూ..లూఠీ సిటీబ్యూరో: గ్రేటర్ లో చలి తీవ్రత త గ్గుముఖం పట్టినా స్వైన్ఫ్లూ మాత్రం ఇంకా విజృంభిస్తూనే ఉంది. రోజులకు సగటున 30-35 పాజిటీవ్ కేసులు నమోదు అవుతుండగా, అనుమానితుల సంఖ్య లెక్కేలేదు. ఫ్లూను బూచిగా చూపి పలు కార్పొరేట్ ఆస్పత్రులు రోగులను దోచేస్తున్నాయి. సాధారణ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన రోగిని కూడా ఫ్లూ జాబితాలో చేర్చి అవసరం లేకపోయినా పరీక్షలు చేయిస్తున్నారు. వ్యాధి తీవ్రత నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్వైన్ఫ్లూను ఆరోగ్య శ్రీ జాబితాలో చేర్చినప్పటికీ..పలు కార్పొరేట్ యాజమాన్యాలు చికిత్స చేసేందుకు నిరాకరిస్తున్నట్టు తెలిసింది. వైద్య ఖర్చులు భరించలేని వారు ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లోని ఫ్లూ నోడల్ కేంద్రాలకు వస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడమే ఇందుకు కారణం. స్వైన్ఫ్లూను బూచిగా చూపించి అవసరం లేనివారికి వాక్సిన్ అమ్ముతున్నాయి. వాక్సిన్ కోసం ప్రజలు క్యూ కడుతుండడంతో ఇదే అదనుగా భావించిన యాజమాన్యాలు మందుల ధరలను అమాంతం పెంచేశాయి. రూ. 5 విలువ చేస్తే మాస్కును రూ. 50కి అమ్ముతుండటం విశేషం. ఇక నాలుగు లేయర్లతో తయారు చేసిన ఎన్-95 మాస్క్ ధర రూ.100 చేశారు. ఎంఆర్పీకి మించి అమ్మకూడదనే నిబంధన ఉన్నా..డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 299 పాజిటివ్ కేసులు తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 893 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం ఐపీఎంకు పంపగా, వీరిలో శనివారం మధ్యాహ్నం వరకు 299 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో 10 మంది మృతి చెందగా, వీరిలో అత్యధికులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొంది చివరి క్షణంలో ఇక్కడకు వస్తున్నారు. వ్యాధి తీవ్రత పెరిగి చనిపోతున్నారు. దీనికి తమను బాధ్యత చేస్తుండడం ఏమిటని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లోని స్వైన్ఫ్లూ నోడల్ ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.