breaking news
salaries change
-
ఆఫీసులో ఉచిత మీల్స్, స్నాక్స్ కట్..
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ అన్ఎకాడమీ ఇకపై అనవసర వ్యయాలను గణనీయంగా తగ్గించుకుని, లాభదాయకతపై మరింతగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మేనేజ్మెంట్ జీతాల్లో కోత విధించడంతో పాటు గ్లోబల్ టెస్ట్ ప్రెప్ వంటి కొన్ని వ్యాపారాలను కూడా మూసివేయనుంది. సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖలో వ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్ ముంజల్ ఈ విషయాలు తెలిపారు. ఆఫీసులో కాంప్లిమెంటరీగా ఇచ్చే మీల్స్, స్నాక్స్ కూడా ఇకపై ఉండబోవని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థాపకులు, టాప్ మేనేజ్మెంట్తో పాటు ఎవరికీ కూడా బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణాల్లాంటి ప్రయోజనాలు లభించనవి ముంజల్ తెలిపారు. అంతే కాకుండా టాప్ ఎగ్జిక్యూటివ్ల కోసం ప్రత్యేకంగా నియమించిన డ్రైవర్లను కూడా తొలగిస్తున్నామని చెప్పారు. కంపెనీ ఖాతాల్లో పుష్కలంగా రూ. 2,800 కోట్ల మేర నిధులు ఉన్నప్పటికీ .. వచ్చే రెండేళ్లలో పబ్లిక్ ఇష్యూకి వస్తున్న నేపథ్యంలో లాభదాయకతను పెంచుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ముంజల్ వివరించారు. పనితీరు బాగాలేదంటూ ఇటీవలే 10 శాతం మంది సిబ్బందిని (దాదాపు 600 మంది) తొలగించిన అన్ఎకాడమీ తాజాగా మరిన్ని వ్యయ నియంత్రణ చర్యలు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఆర్టీసీ ‘సవరణ’బకాయిల చెల్లింపునకు ఓకే
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఇటీవల జరిగిన వేతన సవరణకు సంబంధించిన బకాయిల తొలి విడత చెల్లింపునకు మార్గం సుగమమైంది. ఇందుకు అవసరమైన రూ.250 కోట్ల మొత్తాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సమ్మతించినట్లు తెలిసింది. సవరించిన వేతనాలను 2013 నుంచి అమలు చేయనున్నట్టు ఫిట్మెంట్ ప్రకటన సమయంలో ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రూ.1500 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో చెల్లించనున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం, మిగతా మొత్తాన్ని మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తామని ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో దసరాకు మొదటి విడత చెల్లించాల్సి ఉంది. కాని ప్రస్తుతం ఆర్టీసీ వద్ద చిల్లిగవ్వ లేకపోవటంతో అధికారులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీంతో ఆ మొత్తాన్ని చెల్లించేం దుకు ప్రభుత్వం అంగీకరించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వు సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంది.