-
బట్టబయలైన రహస్య బంధం
ఏడాది ముందు రాజధానిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుపై పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగితే అందరూ నిజమేన నుకున్నారు. తరువాత జరిగిన మీటింగుల్లో కూడా అడపాదడపా విమర్శిస్తుంటే ఆ టెంపో కొనసాగిస్తున్నా రేమోనని భ్రమ పడిన జనం ఇప్పుడిప్పుడే నిజం తెలుసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘ఆ రెండు పార్టీలు వేర్వేరు కాదు. లోపాయికారీగా కలిసే పనిచేస్తున్నాయి. చంద్రబాబు డైరెక్షన్లో అభ్యర్థులను బరిలోకి దించారు. జనసేనను నమ్ముకున్నోళ్లను అన్యాయం చేశారు. పొత్తుల వెనక చంద్రబాబు హస్తం ఉంది. వైఎస్సార్సీపీ ఓట్లు చీల్చేందుకు వేసిన ఎత్తుగడ. బీఎస్పీ అధినేత్రి మాయావతిని కూడా మాయ చేశారు.’ ఇవీ గత కొన్ని రోజులుగా జనసేన, బీఎస్పీ నేతల నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యలు. టీడీపీ చెబితే టిక్కెట్లు ఇచ్చారా? చీకటి ఒప్పందాలు, రాత్రి రాజకీయాలు చేతకావు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానంటున్న పవన్ కల్యాణ్... అభ్యర్థులను ఎలా ప్రకటించారో గుండె మీద చేయి వేసి ఆలోచించుకోవాలని, చీకటి ఒప్పందాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, రెండు రోజుల క్రితం వరకు జనసేనలో కొనసాగిన పంతం గాంధీమోహన్ ఆరోపించారు. బంధం లోగుట్టును వివరించిన టీడీపీ నేత మెట్ల రమణబాబు ఈసారి ఏకంగా టీడీపీ నేతే జనసేనతో బంధాన్ని బయటపెట్టారు. అమలాపురంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో టీడీపీ నేత మెట్ల రమణబాబు నేరుగా జనసేనతో ఉన్న రహస్య బంధాన్ని వెల్లడించారు. ‘చంద్రబాబు, పవన్ కలిసే ఉన్నారు. ఇద్దరూ ఒక అండర్ స్టాండింగ్తోనే ఉన్నారు. వాళ్లిద్దరూ బద్ద శత్రువులేమీ లేరు. మధ్యలో చిన్న డిస్ట్రబెన్స్ క్రియేట్ అయింది. జనసేనలో కాపు యువత కావచ్చు లేదా వేరే యువత కావచ్చు...జనసేన అన్నప్పుడు మనం వివరించి చెప్పాలి... మీ ఓటు వృథా చేయవద్దు... ఈ సారికి ఇలా చేయండి... పవన్ కల్యాణ్కు ఇంకా వయస్సు ఉంది. భవిష్యత్ ఉంది... ఆయన సంగతి అప్పుడు అలోచిద్ధామని చెప్పండి ’ అని మెట్ల రమణబాబు బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీడీపీ నేత పవన్, బాబు మధ్య ఉన్న బంధాన్ని బహిర్గతం చేయడంతో జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే చర్చనీయాంశమైంది. టీడీపీ, జనసేన లోపాయికారీ ఒప్పందం. ఒక్కో ఘటన బయటపడుతుండడంతో నిజమైన జనసేన శ్రేణులు నివ్వెరపోతున్నాయి. నిజంగానే బాబుతో విభేదించి బయటకు వచ్చారని, నిజమైన ప్రత్యామ్నాయం కోసం పవన్ కల్యాణ్ తపనపడుతున్నాడని నమ్మిన ఆయన అనుచరులు కంగుతింటున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిస్తే, చంద్రబాబును విమర్శిస్తున్నట్టు నటించిన పవర్ స్టార్ ఏకంగా షాక్కు గురి చేస్తున్నారని ఇప్పటి వరకు ఆయన వెంట తిరిగిన సమూహం కన్నెర్ర చేస్తోంది. కార్యకర్తల పరిస్థితి ఇలా ఉంటే...జనసేనలో గుర్తింపు లేదని, ఏడాది కాలంగా పి.గన్నవరం నియోజకవర్గంలో సుమారు రూ.70 లక్షలు ఖర్చుచేసి అనేక సేకా కార్యక్రమాలు నిర్వహిస్తూ, జనసేన పార్టీ పటిష్టతకు పాటుపడిన యన్నపు లలిత కూడా పవన్ కల్యాణ్ ఎంతటి మోసాకారో వివరించారు. తనను కూడా పట్టించుకోలేదని, ఆయనలో నిజాయితీ లేదని, డబ్బున్న వారికే టిక్కెట్లు ఇచ్చారని, మాట మీద నిలబడే వ్యక్తిత్వం కాదని, మహిళలంటే కనీస గౌరవం లేదని, ఎవ్వరూ నమ్మొద్దని కన్నీటి పర్యంతమయ్యారు. వీరంతా టీడీపీతో ఉన్న రహస్య బంధాన్ని గుర్తు చేస్తూ మాట్లాడారు. అంతకుముందు ఎంపీ హర్షకుమార్ అయితే నేరుగా ఇరుపార్టీలపైన... ఆ అధినేతలపైన విమర్శలు ఎక్కుపెట్టారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు ఒక్కటేనని చెప్పుకొచ్చారు. టీడీపీతో లాలూచీ లేదని, దేవుడి మీద ప్రమాణం చేసి పవన్ కల్యాణ్ చెప్పగలరా అని సవాల్ విసిరారు. బీఎస్పీ నాయకులైతే తమ పొత్తుకు తూట్లు పొడిచి, తమను మోసగించి, టీడీపీ డైరెక్షన్లో టిక్కెటు కేటాయించారని బాహాటంగానే వ్యాఖ్యానించారు. వీరి వ్యాఖ్యలను నిజం చేస్తూ తాజాగా టీడీపీ నేత మెట్ల రమణబాబు తమ కార్యకర్తల సమావేశంలో టీడీపీ, జనసేన బంధాన్ని బయటపెట్టడంతో మరింత చర్చనీయాంశమైంది. కొన్ని బంధాలు దాచినా దాగవులే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో మరీ ఇంత నీచరాజకీయమా అని నెటిజన్లు చీదరించుకుంటున్నారు. -
స్నేహం కోసం...
నటుడు రంగనాద్ను ‘రియల్ లైఫ్లో క్లియర్ హీరో’ అంటున్నారు ఆయన చిరకాల మిత్రుడు రమణబాబు. రంగనాద్ గారిపై రమణబాబు రచించిన పుస్తకం పేరది. ఈ పుస్తకం గురించి, రంగనాద్గారితో ఉన్న అనుబంధం గురించి రమణబాబు మాట్లాడుతూ– ‘1980లో రంగనాద్ గారితో నా మొదటి పరిచయం ఏర్పడింది. ఆ రోజు నుండి ఆయన చనిపోయేంత వరకు ప్రతిరోజు మాట్లాడుకొనేంత స్నేహం మా మధ్యలో ఉంది. డిసెంబర్ 19తో ఆయన స్వర్గస్తులై 3 సంవత్సరాలైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనతో నాకున్న స్నేహానికి గుర్తుగా నేను ఈ పుస్తకాన్ని రచించాను. ఇందులో రంగనాద్ నటించిన మొదటి చిత్రం ‘చందన’ నుండి అనేక చిత్రాల వివరాలతో పాటు ఎన్నో వ్యక్తిగత విషయాలను మీ ముందుంచాను. ఆయన గురించి ఎంతో మంది సినీ ప్రముఖుల దాసరి, కృష్ణంరాజు, కృష్ణ, విజయ నిర్మల, యస్పీ బాల సుబ్రహ్మణ్యం, గిరిబాబు వంటి ప్రముఖుల అభిప్రాయాలను పొందుపరిచాను. ఆయన అభిరుచులు, వ్యక్తిగతంగా ఆయన ఎంత లోతున్నవారో, ఇండస్ట్రీలో అజాత శత్రువుగా ఎలా మెలిగారో అనే విషయాలను ‘రియల్ లైఫ్లో క్లియర్ హీరో’ ద్వారా మీకు సవివరంగా తెలియజేశాను’’ అన్నారు రమణబాబు. -
బెజవాడ బరిలో చిన్నమ్మ?
హైదరాబాద్: కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఇటీవల బీజేపీలో చేరిన దగ్గుబాటి పురందేశ్వరిని విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీకి దింపాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తోంది. అక్కడ కుదరని పక్షంలో గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా ప్రతిపాదించింది. విజయవాడ సీటుకు ఎర్నేని సీతాదేవి పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక ప్రస్తుతం పురందేశ్వరి ఎంపీగా ఉన్న విశాఖపట్నం స్థానం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన కంభంపాటి హరిబాబు పేరును ప్రతిపాదించారు. అరుుతే హరిబాబుతో పాటు మరో ఇద్దరి పేర్లను కూడా పరిశీలన కోసం జాబితాలో చేర్చారు. సీమాంధ్రలో బీజేపీ తరఫున పోటీచేసే అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను సిద్ధం చేసిన రాష్ట్ర శాఖ ఒకటీ రెండురోజుల్లో వీటిని జాతీయ నాయకత్వానికి పంపనుంది. హరిబాబుతో పాటు ఆ ప్రాంత పార్టీ ఎన్నికల కమిటీ కన్వీనర్ సోము వీర్రాజు నాయకత్వంలో కమిటీ సభ్యులు నర్సింహారెడ్డి, శాంతారెడ్డి, బండారు రంగమోహన్రావు, సురేశ్రెడ్డి తదితరులు శనివారం హైదరాబాద్లో సమావేశమయ్యూరు. 175 శాసనసభా స్థానాలకు 280 మంది, 25 ఎంపీ సీట్లకు 90 మంది ఆశావాహులు ఉండగా.. మొత్తం స్థానాలకు ఉన్నంత లో బలమైన అభ్యర్థుల పేర్లను సూచిస్తూ జాబితాలను రూపొందించారు. తమ ప్రాంతంలో ఇతర పార్టీలతో ఎన్నికలకు పొత్తు పెట్టుకునే అంశంపై నిర్ణయూన్ని పూర్తిగా జాతీయ నాయకత్వానికే వదిలివేశామని హరిబాబు తెలిపారు. ఎన్నికల కమిటీ సమావేశానంతరం పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీలోకి రమణబాబు వశిష్ట, ద్రోణ విద్యాసంస్థల చైర్మన్ ఎన్వీ రమణబాబు బీజేపీలో చేరారు. హరిబాబు, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి భవర్లాల్వర్మ, మజ్దూర్మోర్చా గ్రేటర్ అధ్యక్షుడు తాళ్ల రవీందర్గౌడ్లతో కలిసి ఆయన శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి కిషన్రెడ్డి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
హైదరాబాద్లో తగ్గిపోయిన ఇళ్ల అమ్మకాలు
నాకన్నీ నువ్వే అమ్మా.. హ్యాపీ ఫాదర్స్ డే
సిలబస్ కాషాయీకరణ..‘ఎన్సీఈఆర్టీ’ డైరెక్టర్ క్లారిటీ
ఖాళీ కుర్చి.. అమెజాన్ బెజోస్ టెక్నిక్ ఇది..!
ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇది ఒకెత్తు!
రుషి కొండ భవనాలపై టీడీపీ విష ప్రచారం.. ఖండించిన వైఎస్సార్సీపీ
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రిసెప్షన్ (ఫొటోలు)
కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురి పెళ్లి.. గ్రాండ్గా రిసెప్షన్
ఐర్లాండ్తో మ్యాచ్.. పరువు కోసం పాక్! తుది జట్లు ఇవే
Advertisement