breaking news
Protection Drought
-
భద్రత ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, గుంటూరు/కోసిగి/తిరుపతి తుడా: రాష్ట్రంలోని పలు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినులకు భద్రత లేకుండా పోతోంది. ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడంతో మార్గదర్శకాలేవీ అమలు కావడం లేదు. ఫలితంగా చీకటి పడితే చాలాచోట్ల హాస్టల్ ప్రాంగణాలు మందుబాబులకు నిలయంగా మారుతున్నాయి. ఎవరు పడితే వారు యథేచ్ఛగా హాస్టళ్లలోకి వచ్చి వెళ్తుండటం కనిపిస్తోంది. కనీస సౌకర్యాలు, భద్రత ఎండమావిగా మారింది. గుంటూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఇటీవల గుంటూరు నగరంలో రెండు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినులకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లడంతో దుమారం రేగింది. అధికారులు దిద్దుబాటు చర్యల్లో భాగంగా మెమోలు ఇవ్వడంతో పాటు చిన్న స్థాయి సిబ్బందిని విధుల నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. నగరంలోని ఒక ఎస్సీ కాలేజీ బాలికల హాస్టల్లో ఒక విద్యార్థినిని ఓ ఆకతాయి మాయామాటలు చెప్పి ఒక రోజంతా బయటకు తీసుకువెళ్లాడు. సదరు విద్యార్థిని కనపించకపోవడంతో హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది. స్టాల్ గరŠల్స్ కాంపౌండ్లోని బీసీ ప్రీ మెట్రిక్ (చిన్న పిల్లల) హాస్టల్లో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులను ఇద్దరు ఆకతాయిలు మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లారు. దీనిపై తోటి విద్యార్థిని వార్డెన్కు ఫిర్యాదు చేయడంతో దీనిపై కేసు నమోదైంది. పట్టించుకోవాల్సిన వార్డెన్పై చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో గతంలో పనిచేసిన నగరపాలెం సీఐ వార్డెన్ను, వార్డెన్ డ్రైవర్ను కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు భారీ మొత్తంలో సదరు సీఐ నగదు తీసుకున్నట్లు విమర్శలు వినిపించాయి. ఎస్టీ బాలికల హాస్టల్లో కూడా ఇలాంటే సంఘటనలు జరుగుతున్నప్పటికి అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని సమాచారం. ఇదంతా హాస్టల్ సిబ్బంది సహకారంతోనే జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని హాస్టళ్లలో మహిళ వార్డెన్స్తో పాటు వారి భర్తలు కూడా హాస్టళ్లకు వస్తుంటారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. నేరుగా బాలికల రూముల్లోకి వార్డెన్ల భర్తలు వెళుతుంటారనే ఫిర్యాదులూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ తెలిసి కూడా సంక్షేమ హాస్టళ్ల అధికారులు మామూళ్ల మత్తులో చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వందలాది మంది విద్యార్థులున్న హాస్టళ్లకు సోలార్ ఫెన్సింగ్ లేదు. సీసీ కెమెరాలు లేవు. హాస్టల్కు ఎవరు వస్తున్నారు.. ఎవరు వెళ్తున్నారు.. అని గమనించే వారే లేరు. చాలా చోట్ల హాస్టల్స్కు కాపలా ఉన్న సిబ్బంది ఆకతాయిలతో కుమ్మక్కు కావడంతో ఘోరాలు జరుగుతున్నాయి. ఈ హాస్టల్లో పిల్లలను ఉంచలేం..» కర్నూలు జిల్లా కోసిగి మండలం నుంచి అత్యధికంగా ప్రజలు బతుకుదెరువు కోసం వలస బాట పడుతున్నారు. తమ పిల్లలను హాస్టల్లో వదిలి వెళ్తున్నారు. అయితే విద్యార్థులకు హాస్టల్లో భద్రత కరువైంది. కోసిగిలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను పాత సంతమార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేశారు. హాస్టల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 210 మంది విద్యార్థులు ఉన్నారు. హాస్టల్ చుట్టూ కంపు కొడుతోంది. హాస్టల్ ఒకవైపు మహిళల బహిర్భూమి ప్రాంతం ఉంది. మరో వైపు మురుగు నీరు నిల్వ ఉంది. ముందు భాగంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. నిరుపయోగంగా వదిలేశారు. దీంతో పందులు గుంపులు గుంపులుగా తిష్ట వేస్తున్నాయి. చీకటి పడితే చాలు మందుబాబులు హాస్టల్ ప్రాంతంలోనే మద్యం తాగి.. గ్లాసులు, సీసాలు అక్కడే పడేస్తున్నారు. పగటి పూట కోతుల బెడద ఉంది. కిటికీలకు ఉన్న గ్లాసు తలుపులన్నీ ధ్వంసమైపోయాయి. ఇద్దరికి గాను ఒక వార్డెన్ మాత్రమే ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఈ హాస్టల్లో తమ పిల్లలను ఉంచలేమని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు చదువు మాన్పించి వెంట తీసుకెళ్లారు. »తిరుపతి జిల్లాలో నాలుగు నెలలుగా గురుకుల వసతి గృహాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా వింత పరిస్థితులను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తిరుపతిలోని బైరాగిపట్టెడ సమీపంలోని గిరిజన బాలికల గురుకుల వసతి సముదాయంలో కలుషిత ఆహారం తిని 23 మంది విద్యార్థినులు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని హుటాహుటిన రుయా ఆసుపత్రికి తరలించారు. తాగునీరు, ఆహారం కలుషితం కావడం వల్లే ఇలా జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇలా జరిగిందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.హాస్టల్ చుట్టూ దుర్వాసన వస్తోందిమా సొంత గ్రామం సోమలగూడురు. కోసిగి బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతూ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఉంటున్నాను. హాస్టల్ చుట్టూ దుర్వాసన వస్తోంది. చుట్టూ చెత్తా చెదారమే. కాంపౌండ్ వాల్ లేక పోవడంతో కోతులు, పందుల బెడద తీవ్రంగా ఉంది. ఎవరెంటే ఎవరు వస్తూ పోతూ ఉంటారు. – వీరేంద్ర, 9వ తరగతి, కోసిగి, కర్నూలు జిల్లాభద్రత కల్పించాలిరాత్రిళ్లు చలి గాలి వీస్తోంది. హాస్టల్లో విద్యార్థులకు దుప్పట్లు ఇవ్వలేదు. హాస్టల్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచితే బావుంటుంది. హాస్టల్ కిటికీల తలుపులు పగిలి పోవడంతో దుర్వాసన వస్తోంది. ముఖ్యంగా భద్రత కల్పించాలి. – శ్రీధర్, 8వ తరగతి, కోసిగి, కర్నూలు జిల్లాసంక్షోభ హాస్టళ్లుపేద విద్యార్థుల పట్ల కూటమి సర్కారు నిర్లక్ష్యంసాక్షి, అమరావతి: ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల భద్రతను కూటమి సర్కారు గాలికి వదిలేసింది. తమకు సంబంధం లేదన్నట్లు బాధ్యత మరిచి వ్యవహరిస్తోంది. పేద పిల్లలు ఉండే వసతి గృహాలు, గురుకులాల నిర్వహణలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను పటిష్టంగా అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. 5 నెలలుగా చోటు చేసుకుంటున్న వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. విద్యార్థుల భద్రతకు గత ప్రభుత్వం ప్రాధాన్యం విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సంక్షోభ నివారణ వంటి పటిష్ట చర్యల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్ఓపీ అమలు చేసింది. జాతీయ విద్యా విధానం–2020ని అనుసరించి విద్యార్థుల రక్షణ, భద్రత, మౌలిక వసతులు, విద్య, వైద్యం, వసతి వంటి అనేక అంశాలపై మార్గదర్శకాలు జారీ చేస్తూ గతేడాది జూలైలో జీవో 46 జారీ చేసింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని 3,783 వసతి గృహాలు, గురుకులాలు తదితర విద్యా సంస్థల్లో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. తద్వారా వీటిలో చదువుతున్న సుమారు 6.40 లక్షల మంది పేద విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు సంబంధించిన జాగ్రత్తలు, భోజనం, మంచి నీరు, వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రత వంటి వాటి పట్ల శ్రద్ధ తీసుకుంది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు వివిధ స్థాయిల్లో సందర్శించి వాటి నిర్వహణను పర్యవేక్షించి చర్యలు చేపట్టేలా మార్గదర్శకాలను అమలు చేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్య తీసుకోవడంతోపాటు సంక్షోభ నిర్వహణలో అన్ని స్థాయిల్లోనూ అధికారులు స్పందించి చర్యలు తీసుకునేలా పటిష్టమైన మార్గదర్శకాలను అమలు చేశారు. వాటిని కొత్త ప్రభుత్వం గాలికి వదిలేయడంతో పేద విద్యార్థుల భద్రత, భవిత ఇబ్బందుల్లో పడింది. కాగా, రాష్ట్రంలో సుమారు 900 పైగా ఆశ్రమాలు, ట్రస్ట్ హాస్టల్స్ ఉన్నాయి. వీటిలో మేం నిర్వహించలేమంటూ (నాట్ విల్లింగ్) ఇచ్చిన సంస్థలు 65 నుంచి 70 శాతం ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ నుంచి తప్పించుకునేందుకు.. మేం ట్రస్ట్, ఆశ్రమాలు నడపడం లేదంటూ బుకాయించి, అనధికారికంగా వాటిని నిర్వహిస్తూ దేశ, విదేశీ దాతల నుంచి విరాళాలు దండుకుంటున్నవి అనేకం. ప్రతి నెలా వీటిని తనిఖీ చేసి నిర్వహణ లోపాలు, అనుమతి ధ్రువపత్రాలు వంటి వాటిని పరిశీలించాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. -
రాళ్లెత్తే కూలీలకు రక్షణ కరువు
* నీరు లేదు.. భోజనం చేయనీయరు.. మండే ఎండల్లోనూ శ్రమదోపిడీ * చాలీచాలనీ జీతాలకు ప్రాణాలను పణంగా పెడుతున్న పొరుగు రాష్ట్రాల కార్మికులు * అమలు కాని కార్మిక చట్టాలు.. పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం * సర్కారు వారి ఇలాకాలోనే వెట్టిచాకిరీ * తాత్కాలిక సచివాలయ నిర్మాణ కూలీల బతుకులు దుర్భరం సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో రాళ్లెత్తుతున్న కూలీలకు రక్షణ కరువైంది. అద్భుత ప్రజా రాజధాని అంటూ చంకలు గుద్దుకుంటున్న సర్కారు వారి ఇలాకాలో అత్యంత ఘోరమైన వెట్టిచాకిరీ అమలవుతోంది. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చూపకుండా ప్రభుత్వం దగాచేసింది. పొరుగు రాష్ట్రాల కార్మికుల శ్రమదోపిడీకి అవకాశం కల్పించింది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు యువ కార్మికులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం తోటి కార్మికుల్లో, వారి కుటుంబాల్లో భయందోళనలను సృష్టించింది. ఇక్కడ తాము అనుభవిస్తున్న దుర్భర పరిస్థితులను ‘సాక్షి’ ప్రతినిధి వద్ద కార్మికులు ఏకరువు పెట్టారు. తమ పేర్లు, ఫొటోలు పేపర్లో వేస్తే ఉన్న ఉపాధి పోయి రోడ్డున పడతామంటూ వారు వేడుకున్న తీరు చూస్తే ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అవగతమవుతోంది. ఒక్కో గదిలో 30 మంది మగ్గాల్సిందే గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం పనులు చేపట్టిన ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ కంపెనీలు పొరుగు రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చాయి. బీహార్, చత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ పనులు చేయిస్తున్నారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పొరుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 1,800 మందికిపైగా కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. వారికి రోజువారీ వేతనంగా రూ.185 నుంచి రూ.250 ఇచ్చి శ్రమదోపిడీ చేస్తున్నారు. కొందరికి నెలవారీగా రూ.8 వేల నుంచి 15 వేలు ఇస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా కార్మికులకు జీతాలు అందలేదు. ఇంతేకాదు ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. తాగేందుకు మంచినీరు లేదు. దాహమైతే దూరప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిందే. సమయానికి భోజనం చేయడానికి వీలుండదు. పని పూర్తి చేసి వెళ్లు అని నిర్మాణ సంస్థల ప్రతినిధులు హూంకరిస్తుంటారు. తలదాచుకునేందుకు పక్కా నివాసాలు లేవు. మండే ఎండల్లోనూ రేకుల షెడ్లలో ఉక్కబోతతో మాడిపోవాల్సిందే. షెడ్లలోని ఒక్కో గదిలో 20 నుంచి 30 మంది బతకాల్సిందే. కొన్ని షెడ్లలో కనీసం బాత్రూమ్, లెట్రిన్ సౌకర్యం కూడా లేదు. ఇంత జరుగుతున్నా మంత్రులు, అధికారులు అటువైపు దృష్టి సారించి కార్మికుల సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవు. అమలు కాని కార్మిక చట్టాలు.. సర్కారు వారి ఇలాకాలో కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. ఏ కార్మికుడైనా ఎనిమిది గంటలు పని చేయాలన్న కార్మిక చట్టం ఇక్కడ అమలు కాకపోవడంతో ఏకంగా 12 నుంచి 14 గంటలకుపైగా వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. రోజుకు మూడు షిఫ్ట్లు అమలు చేయాల్సిన నిర్మాణ కంపెనీలు రెండు షిప్ట్లతో శ్రమదోపిడీ చేస్తున్నాయి. పని వేళలు పాటించకపోవడంతో రాత్రి, పగలు తమకు అప్పగించిన పనులు పూర్తి చేసేందుకు కార్మికులు శ్రమిస్తూ ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. నిర్మాణ ప్రాంతంలో ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రమాదం జరిగితే వెంటనే వైద్య సదుపాయం అందించే అవకాశం లేదు. వేసవి తీవ్రత కారణంగా ఇటీవల కార్మికులకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనికి విరామం ఇవ్వాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను సచివాలయ నిర్మాణంలో పనిచేసే కార్మికులకు వర్తింపచేయకపోవడం చూస్తే చట్టం అమలులో పాలకుల చిత్తశుద్ధి ఏపాటితో అర్థమవుతోంది.