breaking news
primitive man
-
ఆదిమ బాలుని ఆగమనం
నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా జీవించే ఎన్నో ఆదిమజాతులకు బ్రెజిల్లోని అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం ఆవాసంగా ఉంది. ఆ ఆదిమజాతుల కట్టూ»ొట్టూ, ఆచరవ్యవహారాలు, ఆహార నియమాలు ఎవరికీ తెలీదు. బ్రెజిల్ ప్రభుత్వం కూడా ఎవరికీ చెప్పదు. ఆధునిక పోకడల బారిన పడకుండా ఆ జాతులను తమ మానాన వారి బతకనివ్వాలని బ్రెజిల్ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే అలాంటి ఆదిమజాతులు ఆవాసాల వైపు ఎవరినీ వెళ్లనివ్వదు. అయితే అనుకోకుండా ఆ ఆదిమజాతుల్లో ఒక గిరిజనజాతికి చెందిన వ్యక్తి వాళ్ల ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. వెంట రెండు చిన్న దుంగలను తెచ్చుకున్నాడు. మంట రాజేయడానికి అగ్గి కావాలని అభ్యర్థించాడు. ఈ అరుదైన ఘటన గత బుధవారం నైరుతి అమెజాన్లోని పురూస్ నదీతీరం వెంట బెలారోసా అనే కుగ్రామంలో జరిగింది. బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఒక గిరిజన వ్యక్తి ఒంటిపైభాగంపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా కాళ్లకు చెప్పులు లాంటివి ఏమీ లేకుండా నడుచుకుంటూ కుగ్రామానికి చేరుకున్నాడు. సంబంధిత వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ఏజెన్సీ సంపాదించింది. ఆ వీడియోలో ఆ గిరిజన వ్యక్తి పూర్తి ఆరోగ్యవంతంగా, నెమ్మదస్తుడిగా కనిపించాడు. గ్రామస్థులను అగ్గి కావాలని అడిగాడు. దీంతో వాళ్లు ఒక లైటర్ను ఇచ్చి దీంతో అగ్గిరాజేసుకోవాలని సూచించారు. అయితే అతనికి లైటర్ను ఎలా వెలిగించాలో అర్థంకాలేదు. దానిని ఎలా వాడాలో స్థానికులు ఎంతలా విడమరిచి, వివరించి చూపినా అతనికి అర్థంకాలేదు. ఈలోపు బ్రెజిల్ దేశ ఆటవిక, ఆదివాసీ, గిరిజన సంబంధ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘ఫునాయ్’ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ మనిíÙని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. స్థానికులతో ఉండటంతో స్థానికులకు ఉన్న అంటురోగాలు, ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఏమైనా సోకాయో లేదో అని నిర్ధారించుకుని గురువారం సాయంత్రం కల్లా తిరిగి ఆ ఆదిమజాతి ఆవాసానికి సురక్షితంగా పంపేశారు. ఆదిమజాతులు శతాబ్దాలుగా బయటి వ్యక్తుతో కలవని కారణంగా వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఆధునిక జీవనశైలికి అలవాటుపడ్డ సాధారణ ప్రజల్లో అన్ని రకాల అంటురోగాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు పోగుబడి ఉంటాయి. ఇవి పొరపాటున ఆదిమజాతులకు సోకినా చాలా ప్రమాదం. గతంలో జరిగిన ఇలాంటి ఉదంతాల్లో కొన్ని జాతులు హఠాత్తుగా రోగాలపాలై సగం జనాభా అంతరించిపోయింది. అందుకే అతడిని ఎవరితోనూ కలవనీయకుండా విడిగా ఉంచి 24 గంటల్లోపు తిరిగి అతని జాతి ఆవాసానికి పంపేశారు. స్థానికులు అతను వచ్చిన మార్గం గుండా వెళ్లి ఆదిమజాతులను కలవకుండా ఉండేందుకు ఫునాయ్ అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఇలా ఎవరైనా గిరిజనులు బాహ్యప్రపంచంలోకి పొరపాటున వస్తే వారిని మెమోరియా గ్రాండే ఆదిమ,పర్యావరణ పరిరక్షణా స్థావరానికి తీసుకెళ్లి సపర్యలు చేసి పంపేస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ వృత్తం.. ఓ వి‘చిత్రం’!
అది ఏడున్నర మీటర్ల వ్యాసంతో ఉన్న భారీ వృత్తం.. ఎక్కడా వంకరటింకరగా లేకుండా వృత్తలేఖినితో గీసినట్టు కచ్చితమైన రూపం.. పెద్ద బండరాయి మీద 30 అంగుళాల మందంతో చెక్కటంతో అది ఏర్పడింది.. కానీ అది ఇప్పటిది కాదు, దాదాపు 3 వేల ఏళ్ల నాటిది కావడం విశేషం. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర శివారు ప్రాంతాల్లో కొన్ని గుట్టల్లో ఆదిమానవులు గీసిన రంగుల చిత్రాలు నేటికీ కనిపిస్తాయి. కానీ వాటికి భిన్నంగా ఇప్పుడు గుట్ట పరుపుబండ మీద ఆదిమానవులు చెక్కిన పెద్ద వృత్తం (జియోగ్లిఫ్) చరిత్ర పరిశోధకులను ఆకర్షిస్తోంది. మేడ్చల్ సమీపంలోని మూడు చింతలపల్లి శివారులోని గుట్ట మీద ఇది వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కె.గోపాల్, మహ్మద్ నజీరుద్దీన్, అన్వర్ బాష, అహోబిలం కరుణాకర్లు ఇచ్చిన సమాచారం మేరకు చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆ బృందంతో కలసి దాన్ని పరిశీలించారు. ‘తక్కువ ఎత్తున్న గుట్ట పరుపుబండపై ఈ వృత్తం చెక్కి ఉంది. ఏడున్నర మీటర్ల వ్యాసంతో భారీగా ఉన్న ఈ వృత్తం మధ్యలో రెండు త్రిభుజాకార రేఖా చిత్రాలను కూడా చెక్కారు. అంత పెద్దగా ఉన్నప్పటీకీ వంకరటింకరలు లేకుండా ఉండటం విశేషం. దీనికి సమీపంలో కొత్త రాతియుగం రాతి గొడ్డళ్లు నూరిన గాడులు (గ్రూవ్స్) ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో ఈ తరహా చెక్కిన రేఖా చిత్రం వెలుగుచూడకపోవటంతో దీనిపై మరింతగా పరిశోధించాల్సి ఉంది’అని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. సమాధి నమూనా అయ్యుండొచ్చు.. ఈ చిత్రం ఇనుప యుగానికి చెందిందిగా భావిస్తున్నాం. అప్పట్లో మానవుల సమాధుల చుట్టూ వృత్తాకారంలో పెద్ద రాళ్ల వరుసను ఏర్పాటు చేసేవారు. ఆ సమాధి నిర్మాణానికి నమూనాగా ఈ వృత్తాన్ని గీసి ఉంటారన్నది మా ప్రాథమిక అంచనా. గతంలో కర్ణాటకలో ఇలాంటి చిత్రం కనపించింది. దాని మధ్యలో చనిపోయిన మనిషి ఉన్నట్లు చిత్రించి ఉంది. ఈ చిత్రాన్ని మరింత పరిశోధిస్తే కొత్త విషయాలు తెలుస్తాయి. – రవి కొరిశెట్టార్, పురావస్తు నిపుణుడు -
అంతరిస్తున్న ఆదిమానవుడు
ఆత్మకూరు రూరల్: హిరణ్యకశిపుడిని సంహరించడానికి ఉగ్ర నారసింహ అవతారమెత్తిన విష్ణుమూర్తి లోక భీకర రౌద్రాన్ని తన అందచందాలతో హరించి ఆయన్ను వరిస్తుంది చెంచులక్ష్మి. పురాణ కాలంలోనే మనకు ఇలా చెంచుల ప్రస్తావన కనిపిస్తుంది.మానవుడి ఆవిర్భావం ప్రస్తుతం ఆఫ్రికాగా పిలవబడే ప్రాంతంలో సంభవిస్తే భూమి ఖండాలుగా విడిపోయిన కాలంలో ఆఫ్రికాఖంఢపు దక్షిణ భాగంలో అతుక్కుని ఉన్న ప్రస్తుత భారత ఉప ఖండపు దక్షిణభాగం ద్వారా మానవుడి విస్తరణ ఆసియా ఖండానికి సాగిందని ఆంత్రపాలజిస్టులు చెబుతున్నారు. తన చంటి పిల్లలతో చెంచు మహిళ అలా భారత దేశంలోకి విస్తరించిన తొలిమానవుడి ఆనవాలు తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల అడవుల్లో ఆదిమ గిరిజన చెంచుల రూపంలో నిలిచి ఉంది.జన్యు పరివర్తనం జరగక పోవడంతో చెంచులలో రోగనిరోధక శక్తి నశించి వారి జీవన ప్రమాణం కనిష్ట స్థాయికి చేరుకుంది. చెంచితల్లో అసలే రక్తహీనత,అందులో బాల్యవివాహాల సంఖ్య ఎక్కువే ఈ కారణంతో ప్రతి ప్రసవం ఒక గండంగా గడుపుతు అకాల మరణాలకు గురవుతుంటారు. ఆదిమ గిరిజన లక్షణమైన మద్యపానం చెంచుల్లో ఆహారపు అలవాటుగా కొనసాగుతూ ప్రస్తుతం అది వ్యసన దశకు చేరి చెంచుల మరణాల రేటును పెంచి వారి జాతి అంతరించేపోయే దిశకు తీసుకుపోతోంది. దైనందిన జీవనంలో ఓ చెంచు కుటుంబం చెంచుల ఆవాసప్రాంతం ఆదిమ గిరిజన తెగకు చెందిన చెంచులు తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల అడవుల్లో మాత్రమే నివసిస్తున్నారు.ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పూర్వ మహబూబ్ నగర్,కర్నూలు,ప్రకాశం,గుంటూరు జిల్లాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో మాత్రమే వీరి ఉనికి ఉంది. విల్లంబులతో చెంచు యువకుడు జీవనవిధానం అడవుల్లోను , అడవి అంచుల్లో నివాసముండే చెంచులు ఒక ప్రత్యేకమైన డిజైన్లో కనిపించే గుండు గుడిసెల్లో నివాసముంటారు. ఆహార సేకరణ దశలోనే ఉన్న చెంచులు అడవుల్లో దొరికే చిన్నతరహా అటవి ఉత్పత్తుల సేకరణతో జీవనం సాగిస్తారు.భుజాన గొడ్డలి, చేతిలో విల్లంబులు,ముందు నడుస్తు కుక్క,వెనుకనే అనుసరిస్తు భార్య ... ఇది సంప్రదాయ చెంచుకుటుంబం ఆహార సేకరణకు అడవిలోకి నడిచే దృశ్యం. ఉడుముల వంటి చిన్నపాటి జంతువులను వేటాడతారు. చెంచుల బాల్యం ఇపుడిపుడే ప్రభుత్వం ,ఆర్డిటి (రూరల్ డవలప్మెంట్ ట్రస్ట్) వంటి స్వఛ్ఛంధ సంస్థలు కట్టించి ఇస్తున్న ఇళ్లలో నివాసముంటున్నారు. మూఢ నమ్మకాల కారణంగా చెంచులు ఇళ్ళలో శయనించరు.గూడెం మధ్యలో ఏర్పాటు చేసుకున్న వెదురు మంచలపై పడుకుంటారు.అలాగే రాత్రిపూట మైధునం చెంచుల్లో నిషిద్దం. వారు ఆహారసేకరణకు అడవిలో సంచరించే టపుడు పగటి పూట మాత్రమే శృంగారంలో పాల్గొంటారు. చెంచులు అమిత సిగ్గరులు. మైదాన ప్రాంతీయులతో చాలా తక్కువగా మాట్లాడతారు.ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటారు.ఈ కారణంగానేమో రెండు సంవత్సరాలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరొనా భూతం చెంచుగూడేల్లోకి చొరబడ లేక పోయింది.ఆహార సేకరణ దశను దాటలేక పోతున్న చెంచులకు ఎంతగా ప్రయత్నించినా వ్యవసాయం ఒంట పట్టడంలేదు. అందుకే చెంచుల పొలాలు గిరిజనేతరుల చేతుల్లోకి వెళుతున్నాయి. చెంచు కుర్రాడి పనితనం కర్నూలు జిల్లాలో చెంచుల స్థితి కర్నూలు జిల్లాలో మొత్తం 12 మండలాల్లో 42 గూడేల్లో చెంచులు నివసిస్తున్నారు. వెలుగోడు పట్టణంలో 1, ఆత్మకూరులో1 ,పాణ్యం మండలంలో 1,చెంచు గూడెం మినహా అన్ని చెంచు గూడేలు అన్ని నల్లమల అడవుల్లోనో, అటవీ సమీప ప్రాంతంలోనో ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం కర్నూలు జిల్లాలో 2133 చెంచు కుటుంబాలు ఉండగా అందులో 4138 మంది పురుషులు,4022 మంది స్త్రీలు కలిపి మొత్తం జనాభా 8,160 గా ఉన్నారు. చెంచుల సాంప్రదాయ నివాసం గుండు గుడిసెలు పలుచనవుతున్నచెంచుగూడేలు చెంచుగూడేల్లో నానాటికి వారి జనాభా తగ్గిపోతు అంతరించి పోయే దశకు చేరుకుంటోంది.ఉదాహరణకు 40ఏళ్ళ కిందట ఆత్మకూరు అటవి డివిజన్లోని పసురుట్ల, రుద్రకోడు చెంచు గూడేలను తరలించి సమీప గ్రామమైన నల్లకాల్వ సమీపంలో పునరావాసం కల్పించారు.నాడు రెండు గూడేలు కలసి 120కి పైగా చెంచులు నల్లకాల్వ చేరారు. ఇపుడు వారి సంఖ్య 35కు మించి లేక పోవడం విషాదం.2011 జనాభా లెక్కల ప్రకారం కర్నూలు జిల్లాలో 8,160 గా కనిపిస్తున్న చెంచుల జనాభా ఇప్పడు తీయబోయే గణాంకాలలో ఎంత పడిపోయేది అర్థం కాని స్థితి ఉంది.అంతరించి పోయే దశలో ఉన్న పులుల సంరక్షణ కోసం పటిష్ట మైన చట్టాలు,చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం అంతరించ బోతున్న ఒక ఆదిమ మానవ జాతి రక్షణ కోసం యుద్దప్రాతిపదికన రంగంలోకి దిగాల్సి ఉంది. మాడపు గింజలు కాల్చుకు తింటున్న చెంచులు చెంచుల కోసం హేమన్ డార్ఫ్ కృషి చెంచుల స్థితిగతులపై ఒక నివేదికను కోరుతూ నాటి బ్రిటీష్ ప్రభుత్వం హేమన్ డార్ఫ్ అనే విశేషజ్ఞుడిని నియమించింది. ఆయన అప్పట్లో నిజాం తెలంగాణాలోను ఆంధ్ర ప్రదేశ్లోను అనేక ఆదిమ గిరిజన తెగలపై పరిశోధనలు జరిపారు.ఆయన ఇచ్చి నివేదిక సారాంశం తోనే అటు నిజాం నవాబు, ఇటు బ్రిటిష్ ప్రభుత్వము నల్లమల అడవులను చెంచుల (అభయారణ్యం)రిజర్వ్గా ప్రకటించింది.వారి సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు చేశారు. కాని నేడు నల్లమల అంతా పులుల అభయారణ్యంగా మారడం అడవి బిడ్డలైన చెంచులను అడవిని వదలి వెళ్ళాలనే ఒత్తిడికి గురవుతుండడం నేటి విషాదం. కుక్క తోడు ఆదిమ గిరిజన లక్షణం చెంచుల అభివృధ్ధి కోసం ప్రత్యేక ప్రభుత్వ ఏజెన్సీలు చెంచులను అభివృధ్ధి పథంలో తీసుకు వచ్చేందుకు సమీకృతగిరిజనాభి వృధ్ధి సంస్థను శ్రీశైలంలో ఏర్పాటు చేశారు.ఈ ఏజెన్సీ కార్యాచరణలో చెంచుల అభివృధ్ధి కోసం పలు ప్రణాళికలు రచించినా అవి వారిని ఉన్నదశనుంచి మరొ దశకు తీసుకు పోలేని స్థితి నెలకొంది. విద్య, వైద్య రంగాలలో కృషిఅంతంత మాత్రంగానే ఉంది.జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకం చెంచుల ఆకలి తీర్చే వరప్రదాయినిగా ఉంటోంది. అయితే ఈ కార్యక్రమంలో పని కల్పించడంలో అధికారులు అలసత్వం చూపుతారనే విమర్శ ఉంది. పెచ్చెర్వు చెంచు గూడెం ఆదర్శ గిరిజన గ్రామంగా బైర్లూటి ఆత్మకూరు మండల పరిధిలో ఉన్న బైర్లూటి చెంచు గిరిజన గ్రామాన్ని రాష్ట్రప్రభుత్వం ఆదర్శ గ్రామంగా ప్రకటించింది. ఈ ప్రకటణలో ఆంతర్యం గ్రామాన్ని ఆదర్శగ్రామంగా చేయాలని.సకల మౌళిక వసతుల కల్పన ఈ పథకపు ఉద్దేశంగా కనపడుతోంది.రాష్ట్రంలో ఇలా ఆదర్శగ్రామంగా ప్రకటించ బడిన ఆదిమ గిరిజన గ్రామం బైర్లూటి ఒక్కటే కావడం విశేషం. -
ఆదిమానవుల సమాధుల పరిశీలన
మునుగోడు: మండలంలోని వివిధ గ్రామాల్లో బయల్పడిన ఆదిమానవుల ఆనవాళ్లను తెలుసుకునేందుకు పురావస్తుశాస్త్ర వేత్తలతో పరిశీలింపచేస్తానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని ఇప్పర్తి గ్రామంలో ఇటీవల వెలుగుచూసిన ఆదిమానవుల సమాధులు, ఎముకలను పరిశీలించారు. ఒక్కొకరికి దాదాపు పదిగుంటల భూమిలో సమాధి కట్టడాన్ని చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని కిష్టాపురం, ఇప్పర్తి, చీకటిమామిడి, గుండ్లోరిగూడెం గ్రామాల్లో ఆదిమానవులు నివాసం ఉండేవారని, తనకు పెద్దలు చెప్పారన్నారు. త్వరలో పరిశీలింపచేసి అందులో లభించిన వస్తువులను మ్యూజియంలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.