breaking news
Prime Minister Sheikh Hasina
-
Bangladesh Political Crisis: సంక్షోభ బంగ్లా
ఢాకా/న్యూఢిల్లీ: పొరుగుదేశం బంగ్లాదేశ్ పెను రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. సోమవారం రోజంతా అత్యంత నాటకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ప్రధాని షేక్ హసీనా (76)కు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా జరుగుతున్న దేశవ్యాప్త ఆందోళనలు ఉధృత రూపం దాల్చాయి. నిరసనకారుల ‘లాంగ్ మార్చ్’ పిలుపునకు స్పందిస్తూ జనమంతా కర్ఫ్యూను ధిక్కరించి మరీ దేశ నలుమూలల నుంచీ రాజధాని ఢాకాకు తండోపతండాలుగా తరలారు. దాంతో ప్రజల డిమాండ్కు హసీనా తలొగ్గారు. ప్రధాని పదవికి రాజీనామా చేశారు. జనాగ్రహానికి జడిసి పలాయన మంత్రం పఠించారు. ఉన్నపళంగా దేశం వీడారు. సోదరితో కలిసి కట్టుబట్టలతో సైనిక విమానంలో భారత్ చేరుకున్నారు. వెంటనే సైన్యం పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకుంది. సైన్యాధ్యక్షుడు జనరల్ వకారుజ్జమాన్ జాతినుద్దేశించి టీవీలో ప్రసంగించారు. ప్రధాని రాజీనామాను అధికారికంగా ప్రకటించారు. ‘‘శాంతిభద్రతలతో పాటుదేశ బాధ్యతలన్నింటినీ తాత్కాలికంగా నేనే స్వీకరిస్తున్నా. దయచేసి సహకరించండి’’ అని ప్రకటించారు. నిరసనకారులపై ఒక్క తూటా కూడా పేల్చొద్దని సైన్యాన్ని, పోలీసు శాఖను ఆదేశించారు. ‘‘అందరికీ న్యాయం జరిగేలా చూస్తాం. నిరసనకారులు ఆందోళన విరమించాలి’’ అని కోరారు. వీలైనంత త్వరగా మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆ వెంటనే పారీ్టలతో భేటీ అయ్యారు. తర్వాత ఆయా పారీ్టల నేతలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యారు. అధికార అవామీ లీగ్ మినహా మిగతా పక్షాలు హాజరయ్యాయి. మరోవైపు హసీనా దేశం వీడారన్న వార్తతో ఆందోళనకారులంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. దేశవ్యాప్తంగా బాణసంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సందడి చేశారు. హసీనా అధికార నివాసంలోకి చొరబడ్డారు. సర్వం లూటీ చేసి తమ ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. ఆమె తండ్రి, బంగబంధు షేక్ ముజిబుర్ రెహా్మన్ విగ్రహాన్ని సుత్తెలతో పగలగొట్టి నేలమట్టం చేశారు. అధికార అవామీ లీగ్ కార్యాలయానికి నిప్పు పెట్టారు. పార్లమెంటులోకీ చొరబడ్డారు. పుట్టి ముంచిన రిజర్వేషన్లు రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో కొద్ది నెలలుగా బంగ్లాదేశ్ అట్టుడికిపోతుండటం తెలిసిందే. బంగ్లా విముక్తి యుద్ధవీరుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ గత జూన్లో హసీనా సర్కారు తీసుకున్న నిర్ణయం చివరికి ఆమె పుట్టి ముంచింది. ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. దాంతో నెల క్రితం జరిగిన భారీ ఆందోళనలు, ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ రిజర్వేషన్లను 5 శాతానికి తగ్గించింది. దాంతో సమస్య సమసినట్టేనని అంతా భావించారు. కానీ హసీనా తప్పుకోవాలంటూ వారం రోజులుగా మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి. 200 మంది అమాయకుల మృతికి ఆమే కారణమంటూ ఆందోళనలు తీవ్ర రూపు దాల్చాయి. హసీనా రాజీనామా డిమాండ్తో జనం మరోసారి రోడ్డెక్కారు. శని, ఆదివారాల్లో దేశవ్యాప్త ఘర్షణల్లో 100 మందికి పైగా మరణించారు. హసీనా సర్కారు ఓ మెట్టు దిగి వారిని చర్చలకు ఆహా్వనించినా ససేమిరా అన్నారు. దాంతో వారిపై హసీనా తీవ్రంగా మండిపడ్డారు. ఆ క్రమంలో, ‘యువత ముసుగులో సంఘవిద్రోహ శక్తులే ఘర్షణలకు దిగుతున్నా’రంటూ ఆదివారం ఆమె చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. హసీనాను గద్దె దింపడమే లక్ష్యంగా ‘ఢాకా లాంగ్ మార్చ్’కు నిరసనకారులు పిలుపునిచ్చారు. అది చివరికి హసీనా పలాయనానికి దారితీసింది. రిజర్వేషన్ల రగడ ఆమె 15 ఏళ్ల పాలనకు చివరికిలా తెరదించింది. నాలుగోసారి అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు కూడా దాటకుండానే హసీనా సర్వం పోగొట్టుకుని శరణారి్థగా దేశం వీడాల్సి వచ్చింది! ఆలయాల విధ్వంసం హసీనా రాజీనామా చేశారన్న ప్రకటన వింటూనే దేశవ్యాప్తంగా జనం రెచ్చిపోయారు. ఢాకాలో ప్రధాని అధికార నివాసంతో పాటు హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ నివాసంలోకి చొచ్చుకెళ్లారు. వాటిని పూర్తిగా లూటీ చేశారు. హసీనా భర్త డాక్టర వాజెడ్ మియా ఇంటిని కూడా వదిలిపెట్టలేదు. దానికి నిప్పు పెట్టారు. బంగబంధు స్మారక మ్యూజియంతో పాటు బంగ్లాదేశ్తో భారత ద్వైపాక్షిక సంబంధాలకు ప్రతీకగా నిలిచిన ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం తదితర కీలక భవనాలకు కూడా నిప్పు పెట్టారు. దేశ ప్రధాన న్యాయమూర్తి నివాసంపైనా అల్లరి మూకలు దాడికి దిగాయి. కాసేపటికే ఇంట్లోంచి కేకలు, ఆక్రందనలు, మూలుగులు విని్పంచినట్టు స్థానిక మీడియా పేర్కొంది. దేశవ్యాప్తంగా హింసాకాండ, ఆస్తుల విధ్వంసం తదితరాలు కొనసాగాయి. నాలుగు ఆలయాలను ధ్వంసం చేశారు. ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారుల నివాసాలు, కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లపై రాళ్లు రువ్వారు. వాటికి నిప్పు పెట్టారు. రన్వే మీదా వెంటాడిన జనం... త్రుటిలో తప్పించుకున్న హసీనా సైనిక విమానంలో సోదరితో కలిసి ఢిల్లీకి ఉన్నపళంగా బంగ్లా వీడిన హసీనా తన సోదరి షేక్ రెహానాతో కలిసి భారత్ చేరుకున్నారు. ఆ క్రమంలో, వెల్లువెత్తిన జనాగ్రహం బారినుంచి ఆమె త్రుటిలో తప్పించుకున్నారు! హసీనాను వెంబడిస్తూ నిరసనకారులు ఢాకా విమానాశ్రయంలోకి కూడా చొచ్చుకొచ్చారు. వారిలో పలువురు గేట్లన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ హసీనాకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తూ రన్వే మీదికి కూడా చేరుకున్నారు. అప్పటికే ఆమె, సోదరి బంగ్లా వైమానిక దళానికి చెందిన సి–130జె రవాణా విమానం ఎక్కేశారు. దాంతో నిరసన మూక బారిన పడకుండా తప్పించుకున్నారు. కాసేపటికి వారిద్దరూ ఢిల్లీ సమీపంలో గాజియాబాద్లోని హిండన్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. విమానం భారత వాయుతలంలోకి ప్రవేశించగానే మన వాయుసేన విమానాలు రక్షణగా తోడు వచ్చాయి. విమానాశ్రయంలో ఎయిర్ఫోర్స్ ఉన్నతాధికారులు హసీనాకు స్వాగతం పలికారు. హసీనాతో దోవల్ భేటీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హిండన్ ఎయిర్బేస్లో హసీనాతో భేటీ అయ్యారు. వారు ఏం చర్చించిందీ తెలియరాలేదు. అనంతరం ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఢిల్లీలో ఉన్న తన కూతురు సైమా వాజెద్ను కలిసిన అనంతరం హసీనా లండన్ వెళ్తారని సమాచారం. వాజెద్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఆగ్నేయాసినా ప్రాంతీయ డైరెక్టర్గా పని చేస్తున్నారు. హసీనా ఇంటి ముట్టడి సర్వం దోచుకెళ్లిన జనం రెండేళ్ల క్రితం శ్రీలంక అంతర్యుద్ధం సందర్భంగా ఏం జరిగిందో గుర్తుందా? అధ్యక్ష నివాసాన్ని ముట్టడించిన జనం భవనమంతా కలియదిరిగారు. అధ్యక్షుని కురీ్చలో విలాసంగా కూర్చుని ఫొటోలకు పోజులిచ్చారు. సెలీ్పలు దిగారు. కిచెన్లో దూరి ఉన్నవన్నీ తింటూ సరదాగా గడిపారు. ఈత కొలనుల్లో ఈదులాడారు. సోమవారం ఢాకాలోనూ అవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. ప్రధాని హసీనా రాజీనామా చేసి దేశం వీడినట్టు తెలియగానే నిరసనకారులు సంబరాలు చేసుకున్నారు. ఆమె అధికార నివాసం ‘గణభదన్’ను భారీ సంఖ్యలో ముట్టడించారు. డ్రమ్ములు వాయిస్తూ, కొమ్ముబూరాలు ఊదుతూ విజయనాదం చేశారు. జాతీయ పతాకాలు చేబూని స్వేచ్ఛా నినాదాలు చేశారు. లాన్ల నిండా పరుగులు తీస్తూ, స్విమింగ్పూల్స్లో ఈదులాడుతూ, భవనమంతా కలియదిరుగుతూ హసీనాపై తమ ఆగ్రహాన్ని వెలిగక్కారు. భద్రతా సిబ్బందితో కలిసి ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. కొందరు ప్రధాని కుర్చీలో కూర్చున్నారు. బెడ్రూంలో మంచంపై హాయిగా సేదదీరారు. అంతటితో ఆగకుండా వంట సామగ్రి మొదలుకుని ఫరి్నచర్, పురాతన వస్తువుల దాకా సర్వం ఎత్తుకెళ్లారు. ఎవరికి ఏది చేతికందితే అది తీసుకెళ్లారు. భవనాన్ని పూర్తిగా లూటీ చేసి వదిలారు. ఒక వ్యక్తి లిప్స్టిక్లు చేతబట్టుకుని మీడియా కంటబడ్డాడు. ‘‘నియంత కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తం చేశాం. మా పోరాటానికి ప్రతీకగా ఈ లిప్స్టిక్ను నా దగ్గరుంచుకుంటా’’ అని చెప్పుకొచ్చాడు! దేశ పార్లమెంటులోకి కూడా జనం వెల్లువలా దూసుకెళ్లారు. ప్రజాప్రతినిధురల కురీ్చల్లో కూర్చుని విలాసంగా పొగ తాగుతూ, సెల్పీలు తీసుకుంటూ గడిపారు. ఇక తిరిగి రారు: కుమారుడు లండన్: హసీనా తిరిగి బంగ్లాదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టబోరని ఆమె కుమారుడు సజీవ్ వాజెడ్ జాయ్ ప్రకటించారు. ఆమె క్షేమం కోరి కుటుంబీకులమంతా ఒత్తిడి చేసిన మీదటే దేశం వీడారని బీబీసీకి ఇచి్చన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఖలేదా జియాకు విముక్తిఢాకా: జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఖలేదా జియాను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతోపాటు దేశం విడిచిపెట్టిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం సంభవించడం గమనార్హం. అధ్యక్షుడు షహబుద్దీన్ ప్రతిపక్ష పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్ ఖలేదా జియాను తక్షణమే విడుదల చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయానికి వచ్చినట్లు ఒక అధికారిక ప్రకటన వెలువడింది. షేక్ హసీనా మొదటిసారిగా 1996లో దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ఖలేదా జియా అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ప్రధాని కుర్చీ వారిద్దరి మధ్య మారుతూ వచ్చింది.నిరసనలు ఇలా... జూన్ 5: స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరిస్తూ కోర్టు తీర్పు జూన్ 6: యూనివర్సిటీల్లో మొదలైనఆందోళనలు. దేశమంతటికీ వ్యాప్తి.జూన్ 7: విద్యార్థుల రహదారుల దిగ్బంధం జూన్ 15: పెరిగిన నిరసనల తీవ్రత జూలై 15: హింసాత్మకంగా మారిన నిరసనలు జూలై 18: ఆందోళనలు తీవ్రరూపం..19 మంది మృతి. కర్ఫ్యూ, రంగంలోకి సైన్యం జూలై 19: దేశమంతటా హింసజూలై 21: కోటాను 5 శాతానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఆగస్ట్ 3: మృతి చెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మళ్లీ నిరసనలు ఆగస్ట్ 4: దేశవ్యాప్త ఆందోళనల్లో మరో 100 మందికి పైగా మృతి. న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశం. అయినా చల్లారని జనాగ్రహం ఆగస్ట్ 5: ప్రధాని షేక్ హసీనా రాజీనామా. దేశం విడిచి పలాయనం భారత్పై ప్రభావం ఎంత?! బంగ్లా్లదేశ్ సంక్షోభం భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. హసీనా తొలి నుంచీ భారత్కు గట్టి మద్దతుదారు. ఆమె హయాంలో 15 ఏళ్లుగా ద్వైపాక్షిక బంధం నానాటికీ దృఢమవుతూనే వస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్లోని భారత వ్యతిరేకుల నోళ్లకు హసీనా గట్టిగా తాళం వేశారు. 2009లో ఆమె రెండోసారి గద్దెనెక్కినప్పుడు యూపీఏ–2 మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నారు. ఆ ఐదేళ్లలో ఇరు దేశాల బంధం గట్టిపడింది. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక సంబంధాలు మరింతగా బలపడుతూ వచ్చాయి. మన ప్రబల ప్రత్యర్థి చైనాకు బంగ్లాదేశ్ మరీ దగ్గరవకుండా ఉండేందుకు పలు అంశాల్లో బంగ్లాకు ఇతోధికంగా సాయపడుతూ వచి్చంది. ఖలీదా జియా హయాంలో ఇరు దేశాల మధ్య మనస్ఫర్ధలు తలెత్తాయి. భారత వ్యతిరేకతే జియా ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉంటూ వస్తోంది కూడా! బంగ్లాదేశ్ మేలు కంటే హసీనా, అవామీ లీగ్ రాజకీయ ప్రయోజనాల పరిరక్షణే భారత్కు ప్రధానమని ఆ దేశంలో ఒక వర్గంలో ఉన్న అభిప్రాయానికి ఆమె గట్టి సమర్థకురాలు. జియా హయాంలో ఉల్ఫా తీవ్రవాదులు బంగ్లా కేంద్రంగా ఈశాన్య భారతంలో ధ్వంసరచన చేశారు. కొద్ది నెలల క్రితం బంగ్లాదేశ్లో సాగిన ‘బాయ్కాట్ భారత్’ ప్రచారానికి జియా, బీఎన్పీ నేతలు బాహాటంగా మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలో జియా జైలు నుంచి విడుదలవడమే గాక సైన్యం దన్నుతో కూడిన మధ్యంతర ప్రభుత్వానికి సారథ్యం వహించవచ్చన్న వార్తలు భారత్కు ఇబ్బందికరమే.పరిస్థితిని సమీక్షించిన మోదీబంగ్లా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ సారథ్యంలో భద్రతపై కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి సీతారామన్ భేటీలో పాల్గొన్నారు. బంగ్లాలో తాజా పరిస్థితిని మోదీకి జైశంకర్ నివేదించారు. సరిహద్దుల్లో అప్రమత్తత బంగ్లాదేశ్తో 4,096 కిలోమీటర్ల పొడవునా సరిహద్దుల వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. బీఎస్ఎఫ్ హై అలర్ట్ జారీ చేసింది. అదనపు బలగాలను మోహరించారు. మన విద్యార్థులు వెనక్కి ..బంగ్లాదేశ్ సంక్షోభం నేపథ్యంలో అక్కడున్న భారత విద్యార్థులు పెద్ద సంఖ్యలో వెనక్కొస్తున్నారు. జూలై చివరికల్లా 2,894 మంది తిరిగొచ్చారు. మరో 3,000 మంది త్వరలో రానున్నట్టు అధికారులు వెల్లడించారు. -
బంగ్లాలో మళ్లీ ఘర్షణలు: 97 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలన్న డిమాండ్తో నిరసనకారులు, విద్యార్థులు చేపట్టిన సహాయ నిరాకరణోద్యమం తొలిరోజే హింసాత్మకంగా మారింది. అధికార ఆవామీ పార్టీ కార్యకర్తలకు, ఆందోళకారులకు మధ్య ఆదివారం దేశవ్యాప్తంగా 13 జిల్లాల్లో జరిగిన ఘర్షణల్లో ఏకంగా 97 మంది మరణించారు. ఆందోళనల ధాటికి రాజధాని ఢాకాలో దుకాణాలు మూతబడ్డాయి. షాబాగ్లో వేలాది మంది విద్యార్థులు తదితరులు గుమికూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు బంగాబంధు షేక్ ముజీబ్ మెడికల్ కాలేజీలో వీరంగం సృష్టించారు. వాహనాలను తగలబెట్టారు. దాంతో రోగులు, వైద్యులు, విద్యార్థులు భయంతో వణికిపోయారు. దేశ విమోచన పోరాట అమరుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాను తగ్గించాలంటూ యువత, ఆందోళనకారులు ఇటీవల చేపట్టిన భారీ ఆందోళనల్లో 200కు పైగా చనిపోవడం తెలిసిందే. అందుకు బాధ్యత వహిస్తూ హసీనా గద్దె దిగాలంటూ నిరసనకారులు తాజాగా మళ్లీ ఉద్యమబాట పట్టారు. దాంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఫేస్బుక్, వాట్సప్, మెసేంజర్, ఇన్స్ట్రాగాం సేవలను నిలిపేశారు. 4జీ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేయాలని మొబైల్ ఆపరేటర్లను ఆదేశించారు. ఉద్యమం చేస్తున్న వారిలో యువత లేరని, ఉగ్రవాదులే ఉన్నారని హసీనా ఆరోపించారు. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తాజా పరిస్థితిపై ఆర్మీ, పోలీసు విభాగాల అధిపతులతో ఆమె సమీక్ష జరిపారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందామంటూ నిరుద్యోగులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం, వారు తిరస్కరించడం తెల్సిందే. రాజుకున్న చిచ్చు... బంగ్లాదేశ్ విముక్తి యోధుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ల నిర్ణయం ఇటీవల బంగ్లాలో చిచ్చు రేపడం తెలిసిందే. దాంతో సుప్రీంకోర్టు వాటిని 5 శాతానికి తగ్గించింది. -
హసీనా అఖండ విజయం
గత ఏడాది దక్షిణాసియాలోని మూడు దేశాల్లో–పాకిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్– చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. ఎవరు గెలిచి అధికారంలోకొచ్చినా సైన్యానిదే పైచేయి అయ్యే పాకిస్తాన్ సంగతలా ఉంచితే, మాల్దీవుల్లో అడుగడుగునా భారత వ్యతిరేకతను ప్రదర్శించిన అబ్దుల్లా యామీన్ ఓడిపోయి, విపక్ష కూటమి అభ్యర్థి సోలిహ్ దేశాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఆదినుంచీ మనకు మిత్ర దేశంగా ఉన్న బంగ్లాదేశ్లో సైతం ఇప్పుడు ప్రధాని షేక్ హసీనా వాజెద్ నేతృత్వంలోని అవామీ లీగ్ కూటమి అఖండ విజయం సాధించింది. ఇప్పటికే వరసగా రెండు దఫాలనుంచి అధికారంలో కొనసాగుతున్న హసీనా మూడోసారి కూడా విజేత కావడం మనకు అనుకూల పరిణామం. బంగ్లాదేశ్లో మిలిటెన్సీ బలపడితే దాని ప్రభావం పశ్చిమ బెంగాల్పైనా, ఈశాన్య రాష్ట్రాలపైనా ఎక్కువగా ఉంటుంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అందుకోసం తెగ ప్రయత్నిస్తోంది. మన దేశం బంగ్లా ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతోపాటు ఉగ్రవాదంపై ఎప్పటికప్పుడు దాన్ని అప్రమత్తం చేస్తూ ఆ ప్రయత్నాలను వమ్ము చేస్తోంది. బంగ్లా సైతం మూడో దేశం ప్రమేయానికి తావీయకుండా మనకు చెక్కుచెదరని మిత్ర దేశంగా ఉంటున్నది. అవామీ లీగ్ కూటమికి వచ్చిన విజయం అసాధారణమైనది. ఊహకందనిది. పార్లమెంటులోని 300 స్థానాల్లో ఆ కూటమి 299 చోట్ల పోటీచేయగా ఏకంగా 96 శాతం సీట్లు...అంటే 288 వచ్చాయి. ఈ సందర్భంగా హసీనా గెలుపును గురించి చెప్పుకోవాలి. ఆమెకు మొత్తం 2,29,539 ఓట్లు రాగా, ప్రత్యర్థి పక్షమైన బంగ్లా నేషనల్ పార్టీ(బీఎన్పీ) అభ్యర్థికి కేవలం 123 ఓట్లు లభించాయి. మరో అభ్యర్థికి 71 ఓట్లు వచ్చాయి. మొన్న డిసెంబర్ 30న పోలింగ్ పూర్తయిన వెంటనే ‘నిశ్శబ్ద ప్రజా వెల్లువ’ బ్యాలెట్ పెట్టెల్ని ముంచెత్తిందని అభివర్ణించిన బీఎన్పీ ఆధ్వర్యంలోని జాతీయ ఐక్య ఫ్రంట్ చివరకు ఏడంటే ఏడు స్థానాలకు పరిమితమై అందరినీ విస్మయపరచడంతోపాటు తానూ అయోమయంలో పడిపోయింది. అధికార అవామీ లీగ్ ‘ఇది ప్రజా తీర్పు’ అంటుంటే...‘అంతా మోసం, దగా’ అని విపక్షాలు ఆక్రోశిస్తున్నాయి. తిరిగి ఎన్నికలు జరపాలని డిమాండు చేస్తున్నాయి. ఈ ఫలితాలను న్యాయస్థానాల్లో సవాలు చేస్తామంటున్నాయి. ఈ ఎన్నికల్లో హింస విస్తృతంగా జరిగిన మాట వాస్తవం. అయితే 18మంది మృతుల్లో అవామీ పార్టీ కార్యకర్తలే అధికం. బంగ్లా ఎన్నికల్లో రివాజుగా ఉండే భారత వ్యతిరేక ప్రచారం ఈసారి లేకపోవడం గమనించదగ్గది. భారత్ను దూరం చేసుకోవడం మంచిది కాదని విపక్ష బీఎన్పీ కూడా భావించడంవల్లే ఈ మార్పు. ఈ ఎన్నికల్లో తొలిసారి ప్రయోగాత్మకంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలు ఉపయోగించారు. మన దేశంతోసహా వేర్వేరు దేశాలకు చెందిన 175మంది నిపుణులు ఈ ఎన్నికలకు పరిశీలకులుగా వచ్చారు. వీరంతా వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్టు ఎక్కడా తమ దృష్టికి రాలేదని చెప్పారు. కానీ ఒక మీడియా ప్రతినిధికి రెండు మూడుచోట్ల పోలింగ్ కేంద్రాల్లో అసలు విపక్షాల ఏజెంట్లే కనబడలేదు. వాస్తవానికి ఈ స్థాయిలో హసీనా నేతృత్వంలోని కూటమికి అసాధారణ మెజారిటీ రావడంపై అనుమానాలున్నాయి తప్ప ఆమె నెగ్గే అవకాశమే లేదని ఎవరూ అనడం లేదు. విపక్షాలు క్రితంసారి ఎన్నికలను బహిష్కరించినప్పుడు సైతం ఆ కూటమి 234 స్థానాలు గెల్చుకుంది. ఇప్పుడు ఆ పక్షాలన్నీ రంగంలో ఉన్నాయి గనుక మెజారిటీ తగ్గొచ్చునని కొందరు అంచనాలు వేశారు. కానీ అందుకు భిన్నంగా రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకోవడమే అందరినీ అయోమయానికి గురిచేసింది. తమ పార్టీ గెలుపును సమర్థించుకోవడానికి హసీనా మన బీజేపీ, కాంగ్రెస్లను ఉదహరిస్తున్నారు. నాయకుడెవరో తెలియని పార్టీలకు ఓట్లేయరని వివరిస్తున్నారు. ఈ పోలికల మాటెలా ఉన్నా గత పదేళ్లుగా హసీనా అవలంబించిన ఆర్థిక విధానాలు బంగ్లా ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకొచ్చాయన్నది వాస్తవం. పేదరికం గణనీయంగా తగ్గింది. ఆహారభద్రత ఏర్పడింది. సార్వత్రిక ప్రాథమిక విద్య వంటి అంశాల్లో దేశం ముందంజలో ఉంది. అతి తక్కువ అభివృద్ధి సాధించిన దేశాల జాబితా నుంచి బంగ్లాదేశ్ తప్పుకుని వర్ధమాన దేశాల జాబితాలో చేరింది. అవినీతి నిర్మూలనలో, ఛాందసవాద మిలిటెంట్ల ఆగడాలను అదుపు చేయడంలో కఠినంగా వ్యవహరించింది. అలాగని అంతా సవ్యంగా ఉన్నదని చెప్పడం అవాస్తవమవుతుంది. భావప్రకటనా స్వేచ్ఛకు ఆటంకాలు, విచ్చలవిడి ఎన్కౌంటర్లు, మనుషుల్ని అదృశ్యం చేయడం వంటివి ప్రభుత్వ తీరుతెన్నుల్ని ప్రశ్నార్థకం చేశాయి. బీఎన్పీ అధినేత ఖలీదాతోసహా ఎందరో నేతల్ని అవినీతి కేసుల్లో శిక్షలు పడేలా చేయగలిగామని చెబుతున్నా...స్వపక్షం అవినీతి విషయంలో హసీనా సర్కారు ఉదాసీనంగా ఉంటోంది. భూ కబ్జాలు, మెగా ప్రాజెక్టుల్లో స్వాహాలు, పబ్లిక్ రంగ సంస్థల్లో అవినీతి, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో విచ్చలవిడిగా రుణాల మంజూరు, ఎగవేతదార్లపై చర్యలు తీసుకోకపోవడం వగైరాలు ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్నాయి. మిలిటెన్సీని అణిచేస్తున్నామని చెబుతున్నా సెక్యులర్ విలువలున్న కళాకారులు, రచయితలపై ఆ సంస్థల దాడులు తగ్గలేదు. ఏదో ఒక సాకుతో విపక్ష నేతల్ని, వారి మద్దతుదార్లను జైళ్లలోకి నెట్టి ఆ పార్టీలకు నాయకత్వమే లేకుండా చేసిన తీరు ఎన్నికల ప్రక్రియపైనే సందేహాలు రేకెత్తించింది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సంయమనం పాటించాలని తమ శ్రేణులకు హసీనా పిలుపునిచ్చారు. మంచిదే. కానీ వచ్చే అయిదేళ్లలో ప్రభుత్వం సైతం అదే రీతిలో మెలగాలి. అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు జనం మనసుల్ని గెల్చుకుని ఉండొచ్చుగానీ, ప్రభుత్వం అదే పనిగా నియంతృత్వ పోకడలకు పోతున్నదన్న అభిప్రాయం కలిగిస్తే మున్ముందు అది ఆమె పార్టీపైన మాత్రమే కాదు...మొత్తంగా ప్రజాస్వామిక వ్యవస్థపైనే అవిశ్వాసాన్ని ఏర్పరుస్తుంది. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా చూస్తేనే, అందరినీ కలుపుకొని వెళ్తేనే బంగ్లాదేశ్ చరిత్రలో హసీనా సమర్థ ప్రధానిగా శాశ్వతంగా నిలిచిపోతారు. -
'భారత్కు ఆ హక్కు ఉంది'
ఢాకా: పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి భారత సైన్యం దాడులు నిర్వహించడాన్ని బంగ్లాదేశ్ సమర్థించింది. భారత్కు ఆ హక్కు ఉందని చెప్పింది. ప్రతి దేశానికి తన సార్వభౌమత్వాన్ని రక్షించుకునే, గౌరవించుకునే హక్కు ఉందని, దానికి భంగం కలిగించినప్పుడు ప్రతిఘటించే హక్కు కూడా ఉందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. 'తన సార్వభౌమత్వానికి, నేలకు భంగం కలిగినప్పుడు ఎలాంటి దాడినైనా తిప్పికొట్టే చట్టపరమైన హక్కు భారత్ ఉంది. దీనికి అంతర్జాతీయ సమాజం అంగీకారం కూడా ఉంది' అని అన్నారు. ప్రధాని హసీనా తరుపున ఆమె వ్యక్తిగత సలహాదారు ఇక్బాల్ చౌదరీ ఈ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్ విషయంపై స్పందిస్తూ అది ద్వైపాక్షిక సమస్య అని అన్నారు. ఇది పరిష్కారం కాకుండా అవతలి వైపు(పాకిస్థాన్) నుంచి వరుసగా దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. -
'వారు చేసింది నీచమైన పని'
ఢాకా: ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, ఆ విధంగా కృషి చేసే ప్రపంచ దేశాలతో కలిసి ముందుకు సాగుతామని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. ఢాకాలోని ఓ రెస్టారెంటుపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన దాడిపై ఆమె స్పందిస్తూ ఈ దాడి ముమ్మాటికి నీచాతి నీచమైనదే అన్నారు. ఇలాంటి వారిని ఏ ముస్లింలు అని అనాలి? అసలు వీరికి మతమంటూ లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రంజాన్ పవిత్ర ప్రార్ధనలు పక్కకుపెట్టి వారు ప్రజలను చంపడానికి వెళ్లారు. ఇలాంటి చర్య ఏమాత్రం సహించరానిది కాదు. వారికి అసలు ఏ మతం లేదు. ఉగ్రవాదమే వారి మతం' అని చెప్పారు.