breaking news
Parvati Parmeshwaran
-
పుష్పదంతునికి పరమేశ్వరుని శాపం
పార్వతీ పరమేశ్వరులకు ఒకసారి ఈ లోకాలకి దూరంగా కొంతకాలం పాటు ఏకాంతంగా ఉందామనిపించింది. వారు అందుకు అనువైన ప్రదేశం కోసం వెదుకుతూ అమరనాథ గుహకు వచ్చారు. అక్కడ కూర్చుని వారు ప్రాపంచిక బాధలు లేకుండా హాయిగా కథాకాలక్షేపం చేయసాగారు. తాముండే ఆ గుహ వద్దకు ఎవ్వరినీ రానివ్వకుండా నందిని కాపలాగా ఉంచి పరమేశ్వరుడు పార్వతీదేవికి రోజూ ఒక కథ అత్యంత రమణీయంగా కన్నులకు కట్టినట్లు చెప్పేవాడు. పార్వతీదేవి ఎంతో ఆసక్తితో ఆ కథలు వినేది. అయితే ఆ గుహలో పుష్పదంతుడనే యక్షుడు పావురం రూపంలో ఒక మూలన రహస్యంగా దాగి ఉండి ఆ కథలను వింటూ ఉండేవాడు. అతను అంతటితో ఆగక ఆ కథలను ఇంటికి వెళ్లి తన భార్యకు చెప్పేవాడు. ఆమె ఎంతో శ్రద్ధగా వినేది ఆ కథలను. పార్వతీపరమేశ్వరుల ఏకాంతవాసం అయిపోయింది. వారు తిరిగి కైలాసానికి వెళ్లి, యథావిధిగా లోకాలను పాలిస్తున్నారు. పుష్పదంతుని భార్య పార్వతీదేవికి భక్తురాలు. అనుంగు చెలికత్తె కూడా కావడంతో కైలాసానికి వెళ్లి పార్వతీదేవిని కలుసుకుంది. వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆమె పార్వతీదేవికి తాను భర్త ద్వారా విన్న కథలను చెప్పింది. పార్వతీదేవి ఆ కథలు విని నిర్ఘాంతపోయింది. ప్రపంచంలో ఎక్కడా వినని కథలు చెప్పమంటే అందరికీ తెలిసిన కథలు చెప్పాడేంటి అనుకుని పరమేశ్వరుడిని నిలదీసింది. పరమేశ్వరుడు దివ్యదృష్టితో చూసి జరిగిందేమిటో గ్రహించాడు. ఏకాంతంలో ఉన్న తమ రహస్యాలను బహిర్గతం చేసినందుకు కోపించి, పుష్పదంతుని పిలిచి, బేతాళుడిగా అంటే శవంలా పడుండమని శపించాడు. పుష్పదంతుడు తాను చేసిన తప్పిదానికి పశ్చాత్తాపపడి పరమేశ్వరుడి పాదాల మీదపడి తనను క్షమించి, శాపాంతం చెప్పమని వేడుకున్నాడు. భక్త వత్సలుడైన బోళాశంకరుడు కరుణించి ‘‘భూలోకంలో ఒక చెట్టుమీద శవంలా పడున్న నిన్ను విక్రమార్కుడనే రాజు దించి భుజానేసుకుని ఒక మాయా సన్యాసి వద్దకు మౌనంగా తీసుకు వెళుతుంటాడు. ఆ సమయంలో నువ్వు ఈ కథలు అసంపూర్తిగా చెప్పి, వాటి గురించి ప్రశ్నలు వేసి, ‘తెలిసి కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోయావో, నీ తల వెయ్యి వక్కలవుతుంది’ అని బెదిరించి మౌనభంగం చేస్తుండు. ఏ ప్రశ్నకైతే అతను సమాధానం చెప్పలేక మౌన ంగా ఉంటాడో, అప్పుడే నీకు శాపవిమోచనం అవుతుంది’ అని చెప్పాడు. ఆ తర్వాతి కథ అందరూ చిన్నప్పటినుంచి చందమామ కథల్లో చెప్పుకున్నదే, అందరికీ తెలిసిందే. ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏమిటంటే, ఎవరైనా సరే, రహస్యమంటూ చెబితే, దానిని పదిమందికీ చెప్పి బట్టబయలు చేయడం, ఇతరుల ఏకాంతాన్ని భంగపరచడం, చాటుగా దంపతుల మాటలు విని, వాటిని ఇతరులకు చేరవేయడం వంటివి పరమ నీచమైన పనులు. వాటిని ఎవ్వరూ అలవాటు చేసుకోకూడదు. అలా అలవాటు చేసుకుంటే, పర్యవసానాలు తీవ్రంగా వుండొచ్చు. – డి.వి.ఆర్. భాస్కర్ -
శివయ్య పెళ్లికొడుకాయనే!
శ్రీకాళహస్తి : ముక్కంటీశుని కల్యాణం సర్వజగత్తుకే పండుగ. స్వర్ణముఖి నది తీరంలో ఆకాశమే పందిరిగా భూదేవి పీటగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. సాధారణంగా దేవతామూర్తుల కల్యాణోత్సవం వారి ఆలయాల్లో నిర్వహిస్తారు. అయితే ఇక్కడ సోమస్కంధుడు పట్టణం నడిబొడ్డున ప్రజల సమక్షంలో వివాహం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గజవాహనంపై వాయులింగేశ్వరుడు,సింహవాహనంపై జ్ఞానప్రసూనాంబ పెళ్లిమండపం వద్దకు గురువారం రాత్రి పయనమయ్యారు. అర్ధరాత్రి తర్వాత శాస్త్రోక్తంగా పూజారులు వివాహ మహోత్సవం నిర్వహించడం ఇక్కడి సంప్రదాయం. వరుడుగా సర్వేశ్వరుడు కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని విభూదీశుడైన వాయులింగేశ్వరుడు అద్భుతమైన బంగారు స్వర్ణాభరణాలను ధరిం చాడు. ముందుగా చండీకేశ్వరుడు, భృంగిరీటుడు, నికుంభధరుడు, భద్రకాలుడు తదితర ముక్కోటి దేవతలు సర్వేశురుని వెంట నిలిచారు. విభూదిని ఒకరు రాయగా, రుద్రాక్షమాలను మరొకరు అలంకరించగా, భిక్షపాత్ర ఒకరు, దివ్యాభరణాలను మరొకరు అలంకరించారు .పురాతనమైన అపురూప ఆభరణాలతో, పట్టువస్త్రాలతో, భారీ పూలమాలలతో, మంగళవాయిద్యాలతో పార్వతీ పరమేశ్వరులు పెళ్లిమండపానికి మందగమనంతో పయనమయ్యారు. ఉమాదేవి, సుబ్రమణ్యస్వామి సమేతుడైన సోమస్కంధమూర్తి గజవాహనంపై, జ్ఞానప్రసూనాంబ సింహవాహనంపై తేరువీధి నుంచి పెళ్లిమండపానికి బయలుదేరారు. ముందుగా గజవాహనంపై ఠీవిగా కూర్చున్న స్వామివారు రంగవల్లులు, మామిడితోరణాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతులు, అరటిచెట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణమండపానికి చేరుకోగా వాలుజడతో సిగ్గులొలకబోస్తూ ముందుకుసాగిన అమ్మవారు తేరువీధి దాటి నెహ్రువీధిలోకి ప్రవేశించి వాహనంతో సహా అక్కడే ఆగిపోయారు. వేదపండితులు పవిత్ర మంత్రోచ్ఛారణతో మండపం వద్ద పూజలను ప్రారంభించారు. హోమం వెలిగించి కలశాలను ప్రతిష్ఠించి వివాహానికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టారు. ఈవో రామిరెడ్డితో పాటు అధికారులు నాయకులు, అనధికారులు భక్తుల సమక్షంలో వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి.