breaking news
medal table
-
ఒలింపిక్స్లో అత్యధిక పతకాలు సాధించిన దేశం ఏదో తెలుసా..?
పారిస్ వేదికగా జరుగనున్న సమ్మర్ ఒలింపిక్స్ 2024 ఇవాల్టి (జులై 26) నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సారి ఒలింపిక్స్లో రికార్డు స్థాయిలో 206 దేశాల నుంచి 10714 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 32 క్రీడల్లో 329 విభాగాల్లో విశ్వ క్రీడలు జరుగనున్నాయి. ఇవాళ జరిగే ఓపెనింగ్ సెర్మనీతో పోటీలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. భారత్ నుంచి ఈ సారి 117 మంది క్రీడాకారులు ఒలింపిక్స్లో పాల్గొననున్నారు. పీవీ సింధు, శరత్ కమల్ ఓపెనింగ్ సెర్మనీలో భారత ఫ్లాగ్ బేరర్లుగా ఉంటారు. భారత్ విశ్వ క్రీడల్లో పాల్గొనడం ఇది 26వ సారి. గత ఒలింపిక్స్లో భారత్ ఏడు పతాకలు సాధించి, పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది. భారత్ సాధించిన పతకాల్లో ఓ స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ సారి ఒలింపిక్స్లో 16 క్రీడా విభాగాల్లో పోటీపడుతున్న భారత్ ఎన్ని పతకాలు సాధిస్తుందో చూడాలి.కాగా, 128 ఏళ్ల ఘన చరిత్ర (1896-2024) కలిగిన సమ్మర్ ఒలింపిక్స్లో అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్గా యూఎస్ఏకి చెందిన మైఖేల్ ఫెల్ప్స్ ఉన్నాడు. ఫెల్ప్స్ 2004-2016 మధ్యలో ఏకంగా 28 మెడల్స్ సాధించాడు. ఇందులో 23 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. ఫెల్ప్స్ తర్వాత అత్యధిక పతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో లరిసా లాటినినా (సోవియట్ యూనియన్-18), మారిట్ ఝోర్గెన్ (నార్వే-15), నికొలై యాండ్రియానోవ్ (సోవియట్ యూనియన్-15) టాప్-4లో ఉన్నారు.ఒలింపిక్స్లో అత్యధిక పతకాలు సాధించిన దేశంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) ఉంది. యూఎస్ఏ ఇప్పటివరకు జరిగిన 25 ఒలింపిక్స్లో 2629 పతకాలు సాధించింది. ఇందులో 1061 స్వర్ణాలు, 830 రజతాలు, 738 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆల్టైమ్ పతకాల పట్టికలో (స్వర్ణ పతకాల వారీగా) యూఎస్ఏ తర్వాతి స్థానంలో సోవియట్ యూనియన్ (1010), గ్రేట్ బ్రిటన్ (916), చైనా (636), ఫ్రాన్స్ (751), ఇటలీ (618), జర్మనీ (655), హంగేరీ (511), జపాన్ (497), ఆస్ట్రేలియా (547) టాప్-10లో ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ 56వ స్థానంలో ఉంది. భారత్ ఇప్పటివరకు జరిగిన ఒలింపిక్స్లో 10 స్వర్ణాలు, 9 రజతాలు, 16 కాంస్య పతకాలు (35) సాధించింది. -
అప్పటి నుంచి టాప్–5లోనే...
రష్యా తొలిసారిగా ఒలింపిక్స్ బరిలో దిగింది 1996లో! అట్లాంటా (అమెరికా) ఆతిథ్యమిచ్చిన సమ్మర్ ఒలింపిక్స్ నుంచి గత ‘రియో’లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ వరకు రష్యా పతకాల పట్టికలో ‘టాప్–5’లోనే నిలిచింది. 1996 అట్లాంటాలో 63 పతకాలతో రెండో స్థానంలో... 2000 సిడ్నీలో 89 పతకాలతో రెండో స్థానంలో... 2004 ఏథెన్స్లో 90 పతకాలతో మూడో స్థానంలో... 2008 బీజింగ్లో 60 పతకాలతో మూడో స్థానంలో... 2012 లండన్లో 68 పతకాలతో నాలుగో స్థానంలో... 2016 రియో ఒలింపిక్స్లో 56 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. అంతకంటే ముందు సోవియట్ యూనియన్లో భాగంగా బరిలోకి దిగింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక తొలిసారి 1992 బార్సిలోనా ఒలింపిక్స్లో ‘యూనిఫైడ్ టీమ్’గా పోటీపడింది. ఇక వింటర్ ఒలింపిక్స్లోనూ రష్యా ఆధిపత్యాన్ని చాటింది. రెండు సార్లు 1994, 2014లో అగ్రస్థానాన్ని పొందిన రష్యన్ బృందం వాంకోవర్ (2010)లో మినహా ప్రతీసారి టాప్–5లోనే నిలిచింది. వాంకోవర్లో మాత్రం 11వ స్థానంతో సరిపెట్టుకుంది. -
సున్నాతో ముగించారు
బీజింగ్ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భారత్ పతకాల వేట ముగిసింది. పతకం మీద ఆశలు రేపిన వికాస్ గౌడ శనివారం నిరశపరచగా.. ఆదివారం మారథాన్ లో భారత అథ్లెట్లు నేషనల్ రికార్డుతో సరిపెట్టుకున్నారు. ఓపీ జైషా 2:34:43 టైమింగ్ తో నేషనల్ రికార్డు నెలకొల్పింది. మరో రన్నర్ సుధాసింగ్ 2:35:35తో వ్యక్తిగత రికార్డు మెరుగుపరుచుకుంది. దీంతో భారత్ పతకాల జాబితాలో చిట్ట చివరి స్థానంతో సరిపెట్టుకుంది. ఇక లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించే ఇధియోపియా నుంచి మారే డిబాబా మారథాన్ స్వర్ణం గెలుచుకోగా.. కెన్యా రన్నర్ హెలత్ రెండో స్థానంలో నిలిచింది.