breaking news
London School of Economics
-
బీజేపీ x విపక్ష కూటమి
లండన్: భారత్లో 2019 సార్వత్రిక ఎన్నికల్ని బీజేపీ, ప్రతిపక్షాల ఐక్య కూటమి మధ్య పోరుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్అభివర్ణించారు. దేశంలో తొలిసారిగా రాజ్యాంగ సంస్థలపై దాడులు జరుగుతున్నాయని, అందుకే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ శుక్రవారం రాత్రి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో భారతీయ విద్యార్థులతో ముచ్చటించారు. బీజేపీని ఓడించడం, ప్రభుత్వ సంస్థల్లో ఆర్ఎస్ఎస్ జోక్యాన్ని అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రాధాన్యమని చెప్పారు. ‘వచ్చే ఎన్నికల్లో ఒకవైపు బీజేపీ, మరోవైపు ప్రతిపక్ష కూటమి మధ్య ముఖాముఖి పోరు తథ్యం’ అని అన్నారు. ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడేందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని చెప్పారు. సిక్కు అల్లర్లలో కాంగ్రెస్ పాత్ర లేదు: ‘1984లో సిక్కులపై దాడులను 100శాతం ఖండిస్తున్నా. హింసలో భాగస్తులైన వారికి శిక్ష పడడాన్ని సమర్ధిస్తా. హింసా బాధితుడిగా అది ఏ రూపంలో ఉన్నా నేను వ్యతిరేకం. నేను ప్రేమించినవారు హత్యకు గురవడాన్ని దగ్గరనుండి చూశా. అల్లర్లలో కాంగ్రెస్ పాత్ర ఉందన్న మీ వాదనతో నేను ఏకీభవించను’ అని అన్నారు. వారసత్వ రాజకీయాలపై స్పందిస్తూ.. ‘మా కుటుంబం రాజకీయాల్లో ఉండడం నా రాజకీయ జీవితానికి దోహదపడినా.. ఇతర రాజకీయ నాయకుల్లాగా ఎన్నికల్లో నేను పోరాడుతున్నా’ అని సమాధానమిచ్చారు. ఎన్నికల కోసం కాంగ్రెస్ కీలక కమిటీలు న్యూఢిల్లీ: 2019 లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ ఈ దిశగా జోరును మరింత పెంచేందుకు మూడు కీలక కమిటీలను శనివారం ఏర్పాటుచేసింది. ఈ కమిటీలు మేనిఫెస్టో రూపకల్పన, ఎన్నికల ప్రచారం అంశాలపై పనిచేస్తాయి. ఈ రెండు బృందాలతోపాటు కీలకమైన కోర్టీమ్కు కూడా రాహుల్ ఆమోదముద్ర పడింది. పార్టీలోని సీనియర్, పాతతరం నేతలకు కోర్ టీమ్లో చోటు కల్పించారు. ఈ కోర్ బృందంలో ఏకే ఆంటోనీ, గులాంనబీ ఆజాద్, పి. చిదంబరం, అశోక్ గెహ్లాట్, మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, జైరాం రమేశ్, రణ్దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్లు ఉన్నారు. ఈ బృందం సోనియాగాంధీ నేతృత్వంలో పనిచేస్తుంది. మేనిఫెస్టో కమిటీలో పి. చిదంబరం, హరియాణా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా, మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేశ్, సల్మాన్ ఖుర్షీద్, శశిథరూర్, కుమారీ సెల్జా, రణ్దీప్ సుర్జేవాలాతోపాటుగా 19 సభ్యులున్నారు. 13 మంది సభ్యుల ఎన్నికల పబ్లిసిటీ కమిటీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో రణ్దీప్ సుర్జేవాలా, ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ, రాజీవ్ శుక్లా, భక్త చరణ్దాస్, ప్రవీణ్ చక్రవర్తి, మిలింద్ దేవ్రా, కుమార్ కేట్కర్, పవన్ ఖేరా, వీడీ సతీశన్, జైవీర్ షెర్గిల్, ప్రమోద్ తివారీ, పార్టీ సోషల్ మీడియా హెడ్ స్పందనలకు చోటు దక్కింది. ఈ కమిటీలను అశోక్ గెహ్లాట్ శనివారం ఢిల్లీలో ప్రకటించారు. -
3 రోజులపాటు జగన్ లండన్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల పర్యటనకోసం శనివారం ఉదయం లండన్ వెళ్లనున్నారు. నవంబర్ ఆరోతేదీనుంచి ప్రారంభం కానున్న ‘ప్రజా సంకల్పం’ పాదయాత్ర దాదాపు ఎనిమిది నెలల పాటు కొనసాగనున్న విషయం తెలిసిందే. జగన్ పెద్ద కుమారై వైఎస్ హర్ష ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో విద్యాభ్యాసం చేస్తున్న విషయం విదితమే. పాదయాత్ర మొదలయ్యాక లండన్ వెళ్లేందుకు వీలుపడదు కాబట్టి జగన్ శనివారం బయలుదేరి కుమార్తె వద్దకు వెళ్లనున్నారు. -
పాక్పై కశ్మీరీలకు ఆశలేం లేవు!
లండన్: దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ల మాజీ గూఢచారులు లండన్లో ఒకే వేదికను పంచుకుని కశ్మీర్ అంశంపై మాట్లాడారు. ‘నిఘా సంస్థలు మంచి చేయగలవా?’ అన్న శీర్షికన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత పరిశోధన, విశ్లేషణ విభాగం (రా) మాజీ అధిపతి అమర్జిత్ సింగ్ దులాత్, పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) మాజీ చీఫ్ ఎహ్సాన్ హక్ పాల్గొన్నారు. దులాత్ మాట్లాడుతూ ‘కశ్మీరీల మనసుల నుంచి పాక్ ఎప్పుడో చెరిగిపోయింది. పాక్తో ఒనగూరే లాభం ఏదీ ఉండదని వారు గ్రహించారు. ఆ దేశంపై కశ్మీరీలు ఆశలేం పెట్టుకోలేదు. గత 15 నెల ల క్రితం వరకు పాక్గానీ, పాకిస్తాన్లో గానీ కశ్మీర్పై మాట్లాడింది లేదు. అయితే గత 15 నెలలుగా కశ్మీర్లో భారత్ సృష్టించిన గందరగోళం, ప్రభుత్వ విధానాల వల్లే మళ్లీ పాక్ కశ్మీర్ ను తెరపైకి తెస్తోంది’ అని అన్నారు. కశ్మీర్లో హింసకు ప్రతిహింస సమాధానం కాదన్నారు. భారత్ కశ్మీరీలతో మాట్లాడకుండా ఇప్పటికీ తప్పు చేస్తోందనీ, సమస్య పరిష్కారానికి వేర్పాటువాదులతోనూ చర్చించాలన్నారు. బీజేపీ– పీడీపీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆయన తప్పుబట్టారు. బీజేపీకి ప్రభుత్వంలో చోటు కల్పించిన పీడీపీని ప్రజలు ఇకపై ఎప్పటికీ క్షమించరన్నారు. ఎహ్సాన్ మాట్లాడుతూ కశ్మీర్లో గతేడాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం అక్కడి ప్రజల్లో తిరుగుబాటు పెరిగిందని అన్నారు. కశ్మీర్ వివాదాన్ని అలాగే వదిలేయకూడదనీ, అది అపరిష్కృతంగా ఉంటే సమస్య అంతకంతకూ పెరుగుతూ పోతుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాలు కశ్మీర్ అంశంపై చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని రెండు దేశాల గూఢచారులు ఆకాక్షించారు. దులాత్ గతంలో కశ్మీర్లో ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రత్యేక డైరెక్టర్గా కూడా పనిచేశారు. -
ఆహ్వానిస్తేనే వెళ్లాను: విజయ్ మాల్యా ట్వీట్
లండన్: పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానిస్తేనే వెళ్లాలని, అంతేకాని అక్రమంగా సభలోకి చొరబడలేదని కింగ్ఫిషర్ విజయ్ మాల్యా స్పష్టం చేశారు. బ్రిటన్లో భారత రాయబారి నవ్తేజ్ సర్ణ హాజరైన గత గురువారం నాటి పుస్తకావిష్కరణ సభకు భారత కోర్టు దోషిగా నిర్ధారించిన విజయ్ మాల్యా హాజరు కావడం కలకలం సృష్టించింది. ఆహ్వానితుల జాబితాలో విజయ్ మాల్యా పేరులేదని శనివారం విదేశీ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. అయితే తన జీవితంలో ఎన్నడూ అక్రమంగా అనుమతి లేకుండా లోపలికి వెళ్లలేదని, భవిష్యత్తులో కూడా అలా చేయబోనని విజయ్ మాల్యా ట్వీట్ చేశారు. ఏ పుస్తకం కోసం అయితే ఆవిష్కరణ సభ జరిగిందో ఆ పుస్తకాన్ని రాసింది తన మిత్రుడైనందున, ఆయన కోసం ఆ సభకు వెళ్లానని మాల్యా చెప్పారు. తగిన సాక్ష్యం లేదని, చార్జ్షీట్ లేదని. తనకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకునే అవకాశం కూడా తనకు ఇవ్వలేదని, ఇది అత్యంత అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుహెల్ సేథ్ రాసిన కొత్త పుస్తకావిష్కరణ సభను గత గురువారం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నిర్వహించింది. -
‘ది డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని రచించింది?
ప్రపంచంలోనే మొదటగా వెలిసిన విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా, వివిధ దేశాల విద్యార్థులను ఆకర్షించిన ప్రాచీన నలందా విశ్వవిద్యాలయం బీహార్లోని ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన రాజ్గిర్లో పునఃప్రారంభమైంది. దాదాపు 821 సంవత్సరాల తర్వాత మళ్లీ తాత్కాలిక ప్రాంగణంలో సెప్టెంబర్ 1న తరగతులు మొదలయ్యాయి. ఈ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ 2014, సెప్టెంబర్ 19న లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంజి, వర్సిటీ వైస్ చాన్సలర్ గోప సభర్వాల్, ఫ్యాకల్టీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ (లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్) తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నలందా విశ్వవిద్యాలయ వివరాలను పరిశీలిస్తే.. 15 మందితో ప్రారంభం: నలందా విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం దాదాపు 40 దేశాలకు చెందిన 1,000 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. తొలి విడతగా పర్యావరణ శాస్త్రంపై తరగతులను 11 మంది అధ్యాపకులు, 15 మంది విద్యార్థులతో ప్రారంభించారు. గుప్తుల కాలంలో: ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థుల్ని ఆకర్షించిన నలందా విశ్వవిదాల్యయం ఐదో శతాబ్దంలో గుప్తుల కాలంలో ప్రారంభమైంది. ఇందులో 10 వేల మంది విద్యార్థులు, 1500 మంది అధ్యాపకులు ఉండేవారు. ఇక్కడ తొమ్మిది అంతస్తుల గ్రంథాయం కూడా ఉండేది. క్రీ.శ. 1193లో భక్తియార్ ఖిల్జీ సైన్యం ఈ విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది. అప్పటి నుంచి ఇది శిధిలావస్థలో ఉంది. కలాం చొరవ: నలందా విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించాలని 2006లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం బీహార్ అసెంబ్లీలో ప్రసంగం సందర్భంగా ప్రతిపాదించారు. ఆ తర్వాత 2010 ఆగస్టులో నలందా యూనివర్సిటీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. అదే సంవతర్సం సెప్టెంబర్ 21న రాష్ట్రపతి ఆమోదించడంతో ఈ బిల్లు చట్టం రూపం దాల్చింది. అదే ఏడాది నవంబర్ 25 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ విశ్వవిద్యాలయ మొదటి చాన్సలర్గా నోబెల్ గ్రహీత అమర్త్య సేన్, వైస్చాన్సలర్గా గోప సభర్వాల్ 2011 ఫిబ్రవరిలో నియమితులయ్యారు. 455 ఎకరాల భూమి: నలందా విశ్వవిద్యాలయ నిర్మాణానికి బీహార్ ప్రభుత్వం 455 ఎకరాల భూమిని కేటాయించింది. జపాన్, సింగపూర్ దేశాలు 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. 2010లో చైనా మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. దీన్ని ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,727 కోట్లు కేటాయించింది. 2020 నాటికి వర్సిటీకి పూర్తిస్థాయి క్యాంపస్ అందుబాటులోకి రానుంది. ప్రాక్టీస్ బిట్స్ 1. ఇటీవల భారత్లో పర్యటించిన చైనా అధ్యక్షుడు? ఎ) జియాంగ్ జెమిన్ బి) హు జింటావో సి) లీ కెకియాంగ్ డి) జీ జిన్పింగ్ 2. క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచిన విద్యాసంస్థ? ఎ) మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బి) కేంబ్రిడ్జ్ సి) ఇంపీరియల్ డి) హార్వర్డ్ 3. లోక్సభ నైతిక విలువల కమిటీ చైర్మన్గా 2014, సెప్టెంబర్లో ఎవరు నియమితులయ్యారు? ఎ) ప్రహ్లాద్ జోషి బి) మురళీ మనోహర్ జోషి సి) ఎల్కే అద్వానీ డి) బి.సి.ఖండూరి 4. 2014, సెప్టెంబర్ 17న జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎవరిని నియమించారు? ఎ) మీనాక్షి లేఖి బి) శాంతా సిన్హా సి) నిర్మలా సీతారామన్ డి) లలితా కుమార మంగళం 5. 2014, సెప్టెంబర్లో ఆత్మహత్య చేసుకున్న శంకర్ బారువా ఏ రాష్ట్ర మాజీ డీజీపీ? ఎ) అసోం బి) బీహార్ సి) ఒడిషా డి) త్రిపుర 6. భారత సంతతి అమెరికన్ బాబీ జిందాల్ అమెరికాలోని ఏ రాష్ట్రానికి గవర్నర్? ఎ) కాలిఫోర్నియా బి) నార్త్ కరోలినా సి) సౌత్ కరోలినా డి) లూసియానా 7. 17వ గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పురస్కారం ఏ దర్శకుడికి లభించింది? ఎ) ఎస్.ఎమ్.వసంత్ బి) గౌతమ్ మీనన్ సి) గ్యాన్ కొర్రియా డి) రోహిత్ శెట్టి 8. 2014, మార్చి 12 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సంస్థ? ఎ) ఫేస్బుక్ బి) వరల్డ్ వైడ్ వెబ్ సి) గూగుల్ డి) మైక్రోసాఫ్ట్ 9. 2014 మార్చిలో ఆసియా యూత్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాగాల వెంకట రాహుల్ రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించాడు. ఈ పోటీలను ఎక్కడ నిర్వహించారు? ఎ) సియోల్ -దక్షిణ కొరియా బి) టోక్యో-జపాన్ సి) హనోయ్-వియత్నాం డి) బ్యాంగ్ సేన్-థాయ్లాండ్ 10. ఏ సాహిత్య బహుమతిని గతంలో ‘ఆరెంజ్ ప్రైజ్’గా పేర్కొనేవారు? ఎ) పులిట్జర్ ప్రైజ్ బి) మ్యాన్ బుకర్ప్రైజ్ సి) బెయిలీస్ ప్రైజ్ డి) ఏదీకాదు 11. బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన 2014 ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ విజేత? ఎ) పాకిస్థాన్ బి) బంగ్లాదేశ్ సి) శ్రీలంక డి) భారత్ 12. 2014 మార్చిలో ఆంధ్రా బ్యాంకు 2000వ శాఖను ఎక్కడ ప్రారంభించింది? ఎ) మచిలీపట్నం బి) హైదరాబాద్ సి) తిరుపతి డి) విజయవాడ 13. 2014 జాతీయ స్నూకర్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఎ) కమల్ చావ్లా బి) ఆదిత్య మెహతా సి) పంకజ్ అద్వానీ డి) రూపేశ్ షా 14. 2014 ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత? ఎ) లీ చాంగ్ వీ బి) లాంగ్ చెన్ సి) లిన్ డాన్ డి) చెన్ జిన్ 15. తెలుగు వ్యక్తి అయిన ఎన్.సాంబశివరావు ఏ ఎరువుల కంపెనీకి మేనేజింగ్ డెరైక్టర్గా నియమితులయ్యారు? ఎ) ఇఫ్కో బి) క్రిబ్కో సి) ఎన్ఎఫ్ఎల్ డి) ఆర్సీఎఫ్ 16. ‘ది డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని రచించింది? ఎ) మహాత్మా గాంధీ బి) బాలగంగాధర్ తిలక్ సి) జవహర్లాల్ నెహ్రూ డి) బాబు రాజేంద్రప్రసాద్ 17. రాళ్ల మీద పెరిగే మొక్కలను ఏమని పిలుస్తారు? ఎ) హాలోఫైట్స్ బి) జీరోఫైట్స్ సి) ఎరిమోఫైట్స్ డి) లిథోఫైట్స్ 18. 86వ ఆస్కార్ అవార్డులలో గ్రావిటీ చిత్రానికి అత్యధిక పురస్కారాలు దక్కాయి. ఆ చిత్రం ఎన్ని ఆస్కార్లను అందుకుంది? ఎ) ఆరు బి) ఏడు సి) ఎనిమిది డి) ఐదు 19. ఆస్కార్ అవార్డులను తొలిసారి ఏ సంవత్సరంలో ప్రదానం చేశారు? ఎ) 1929 బి) 1933 సి) 1932 డి) 1935 20. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఎ) అసోం బి) మధ్యప్రదేశ్ సి) ఉత్తరాఖండ్ డి) ఉత్తరప్రదేశ్ 21. కేంద్ర సాహిత్య అకాడమీ 2014, మార్చి 12 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? ఎ) 25 బి) 50 సి) 60 డి) 75 22. మిషెల్ బాచ్లెట్ ఏ దేశాధ్యక్షురాలిగా ఇటీవల రెండోసారి ఎన్నికయ్యారు? ఎ) పెరూ బి) కోస్టారికా సి) బొలీవియా డి) చిలీ 23. 2014 మార్చిలో అదృశ్యమైన మలేషియా విమానం పేరు? ఎ) ఎమ్హెచ్-370 బి) ఎమ్హెచ్-350 సి) ఎమ్హెచ్-380 డి) ఎమ్హెచ్-450 24. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఎ) చైనా బి) పాకిస్థాన్ సి) భారత్ డి) బంగ్లాదేశ్ 25. ఎన్నికలలో చేతి వేలికి వేసే సిరాను తయారు చేసే పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ సంస్థ ఏ నగరంలో ఉంది? ఎ) నాగ్పూర్ బి) మైసూరు సి) పుణే డి) కోల్కతా 26. 2014 మార్చిలో పౌర విమానయాన ప్రదర్శన ‘ఇండియా ఏవియేషన్’ ఏ నగరంలో జరిగింది? ఎ) న్యూఢిల్లీ బి) ముంబై సి) బెంగళూరు డి) హైదరాబాద్ 27. {పపంచంలో అతి పిన్న వయసులో అణు రియాక్టర్ను నిర్మించి జెమీ ఎడ్వర్డ్స్ ఏ దేశానికి చెందిన బాలుడు? ఎ) అమెరికా బి) బ్రిటన్ సి) జర్మనీ డి) ఫ్రాన్స్ 28. ఇటీవల ఏ పట్టణానికి చెందిన బావి నుంచి 1857 సైనికుల తిరుగుబాటులో మృతి చెందిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలను వెలికి తీశారు? ఎ) బర్నాలా బి) బటాలా సి) పాటియాలా డి) అజ్నాలా 29. ఇప్పటి వరకు పురుషుల విభాగంలో ట్వంటీ20 ప్రపంచ కప్ క్రికెట్ టైటిల్ను సాధించని జట్టు? ఎ) పాకిస్థాన్ బి) ఇంగ్లండ్ సి) వెస్టిండీస్ డి) ఆస్ట్రేలియా 30. ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ను ప్రచారకర్తగా నియమించుకుంది? ఎ) విజయా బ్యాంక్ బి) ఇండియన్ బ్యాంక్ సి) కెనరా బ్యాంక్ డి) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 31. ఇటీవల మరణించిన అహ్మద్ తేజన్ కబ్బా ఏ దేశానికి మాజీ అధ్యక్షుడు? ఎ) సియెరా లియోన్ బి) సూడాన్ సి) లైబీరియా డి) నైగర్ 32. సాల్వడార్ శాంచెచ్ సెరెన్ ఏ దేశాధ్యక్షుడిగా 2014, జూన్ 1న బాధ్యతలు స్వీకరించారు? ఎ) హోండురస్ బి) క్యూబా సి) గ్వాటిమాలా డి) ఎల్ సాల్వడార్ 33. ఇటీవల మరణించిన మహమ్మద్ ఫాహిమ్ ఏ దేశానికి ఉపాధ్యక్షుడు? ఎ) అఫ్గానిస్థాన్ బి) పాకిస్థాన్ సి) ఇరాక్ డి) సౌదీ అరేబియా 34. కింగ్స్టన్ నగరం ఏ దేశానికి రాజధాని? ఎ) నికారాగువా బి) బహమస్ సి) జమైకా డి) హైతీ 35. నా అనేది ఏ నగరానికి పాత పేరు? ఎ) ఆమస్టర్డామ్ బి) ఆమ్స్టెల్ వీన్ సి) ఓస్లో డి) బెర్న్ సమాధానాలు: 1) డి; 2) ఎ; 3) సి; 4) డి; 5) ఎ; 6) డి; 7) సి; 8) బి; 9) డి; 10) సి; 11) సి; 12) డి; 13) సి; 14) ఎ; 15) బి; 16) సి; 17) డి; 18) బి; 19) ఎ; 20) సి; 21) సి; 22) డి; 23) ఎ; 24) సి; 25) బి; 26) డి; 27) బి; 28) డి; 29) డి; 30) సి; 31) ఎ; 32) డి; 33) ఎ; 34) సి; 35) సి. పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించి జీవశాస్త్రం సబ్జెక్ట్ను ఏవిధంగా ప్రిపేర్ కావాలి? ఏయే పుస్తకాలు చదవాలి? -రమేష్, నిజామాబాద్. పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో జీవశాస్త్రం నుంచి 10-15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మన చుట్టు ఉండే మొక్కలు, జంతువులు, వాటి స్వరూపం, వర్గీకరణ, రకాలు, విస్తరణ, ప్రత్యేక లక్షణాలు, పోలికలు మొదలైన అంశాలపై ప్రధానంగా దృష్టిసారించాలి. మొక్కలు, జంతువులపై అడిగే ప్రశ్నలు కొంత మేరకు గందరగోళానికి గురి చేస్తాయి. ప్రత్యేకించి మొక్కలు, జంతువులు వాటి మధ్య పోలికలు, వర్గం గుర్తించమనే సందర్భంలో ఇటువంటి సందేహాలు ఎక్కవగా వస్తాయి. కాబట్టి వర్గీకరణ, సాధారణ లక్షణాలు, అవయవ నిర్మాణం, ఆహారపు అలవాట్లు వంటి అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. అప్పుడే ఇటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని సులభంగా ఇవ్వొచ్చు. మరో ప్రధాన విభాగం.. మానవ శరీర ధర్మ శాస్త్రం. ఎందుకంటే ప్రతి పోటీ పరీక్షలో ఈ అంశం నుంచి తప్పకుండా ప్రశ్నలు ఉంటున్నాయి. కాబట్టి మానవ శరీర నిర్మాణంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. జీవశాస్త్రంలో కీలకమైన అంశం.. పరిశోధనలు. ఈ అంశానికి సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి జీవశాస్త్ర పరిశోధనలు, చేపట్టిన శాస్త్రవేత్తల గురించి క్షుణ్నంగా చదువుకోవాలి. పరీక్షలో ఇంటర్మీడియెట్ స్థాయి వరకు ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ప్రిపరేషన్ను ఇంటర్మీడియెట్ స్థాయి వరకు సాగించాలి. అంటే పదో తరగతి వరకు ఉండి ఇంటర్మీడియెట్లో పునరావృతమయ్యే అంశాలకు మాత్రమే ప్రిపరేషన్ను పరిమితం చేయాలి. -టి. సుధాకర్ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.