లాలిపాప్... యాప్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: పెద్దలు చెప్పే కథలు వింటూ నిద్రలోకి జారుకోవాల్సిన చిన్నారులు... టీవీ కార్టూన్ల మాయాజాలంలో చిక్కుకుంటున్నారనేది ఇప్పటి తల్లిదండ్రుల ఆవేదన. అందుకే నేటి టెక్నాలజీకి తగ్గట్టుగా 5-12 ఏళ్ల లోపు పిల్లలకు అర్థమయ్యేలా, పిల్లలో ఊహాశక్తిని పెంచేలా... కేవలం వాయిస్ మాత్రమే ఉండే ఓ యాప్ రూపొందింది.
‘లాలీపాప్ ఎంటర్టైన్మెంట్స్’ డెరైక్టర్ రామలక్ష్మి ఏమిరెడ్డి సూచనల మేరకు ప్రముఖ నటుడు, దర్శక-రచయిత రావికొండలరావు ఆధ్వర్యంలో రూపొందిన దీని పేరు ‘లాలిపాప్ స్టోరీస్’. దీన్ని శనివారం హైదరాబాద్లో ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. ‘నీతి కథలను చెప్పేలా లాలీపాప్ ఈ యాప్ను విడుదల చేయడం సంతోషంగా ఉంద’న్నారు. ముఖ్యఅతిథుల్లో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ- మన సంప్రదాయాలను మర్చిపోకూడదన్నారు. సంస్థ డెరైక్టర్లలో ఒకరైన రాజేంద్రప్రసాద్, రావికొండలరావు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.