breaking news
Indian Naval Ships
-
చైనా చేరిన భారత యుద్ధ నౌకలు
పెదవాల్తేరు(విశాఖతూర్పు): చైనాలో జరుగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు భారత్కు చెందిన నౌకలు తరలి వెళ్లాయి. భారతీయ నావికాదళానికి చెందిన కోల్కతా, శక్తి నౌకలు చైనాలోని క్వింగ్డాయో నగరంలోకి సోమవారం ప్రవేశించాయి. చైనా నేవీ పీఎల్ఏ 70వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అంతర్జాతీయ ఫ్లీట్రివ్యూ తలపెట్టారు. భారతీయ నౌకలకు చెందిన సిబ్బంది చైనాలో 21 తుపాకులతో సెల్యూట్ నిర్వహించారు. భారతీయ నౌకలకు స్వాగత కార్యక్రమంలో భాగంగా చైనా నేవీ పీఎల్ఏ సిబ్బంది నేవీ బ్యాండుతో సాదర స్వాగతం పలికారు. కాగా, భారతీయ నౌకలు చైనాలో అంతర్జాతీయ ఫ్లీట్రివ్యూలో గతంలో 2009, 2014 సంవత్సరాల్లోనూ పాల్గొన్నాయి. భారత్–చైనా మధ్య గల సౌభ్రాతృత్వ స్నేహానికి వారధిగా ఇరు దేశాల నేవీలు పరస్పర సహకారంలో భాగంగానే భారతీయ నౌకలు అంతర్జాతీయ ఫ్లీట్రివ్యూలో పాల్గొంటున్నాయి. ఈనెల 23వ తేదీన భారతీయ నౌకలు నిర్వహించే పరేడ్ని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమీక్షిస్తారు. పలు క్రీడా ఈవెంట్లలో భారతీయ నౌకాదళ సిబ్బంది పాల్గొంటారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్రివ్యూలో చైనాలోని భారత్ రాయబారి విక్రమ్మిస్రి తదితర అధికారులు పాల్గొంటారు. మే 4వ తేదీన ఫ్లీట్రివ్యూ ప్రారంభోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. భారతీయ నౌకలు చైనా ప్రయాణంలో భాగంగా వియత్నాంలోని కామ్రన్హ్బే పోర్టు మీదుగా చైనా చేరుకున్నాయి. అలాగే, ఈ నౌకలు తిరుగు ప్రయాణంలో భాగంగా పోర్టు బూషన్, దక్షిణ కొరియా, సింగపూర్ పోర్టుకు వెళతాయి. కేంద్ర ప్రభుత్వ యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా తూర్పు, దక్షిణ ఆసియా దేశాలతో సాంస్కృతిక, ఆర్థిక, మేరీటైమ్ రంగాల్లో ఆయా దేశాలతో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. -
పెర్త్లో భారత్- ఆస్ట్రేలియాల నౌకాదళ విన్యాసాలు
విశాఖపట్నం: భారత ఆస్ట్రేలియా దేశాల యుద్ధ నౌకలు ఆస్ట్రేలియాలోని పెర్త్లో శుక్రవారం విన్యాసాలు ప్రారంభించాయి. ఈ సందర్భంగా పెర్త్లోని ఫ్రీమేంట్లే పోర్టులో తూర్పు నావికా దళం చీఫ్ రియర్ అడ్మిరల్ సతీష్సోనీ అస్ట్రేలియా నావికాదళ అధికారులతో శుక్రవారం భేటీ అయ్యారు. ద్వైపాక్షిక ఒప్పందాల బలోపేతంలో భాగంగా ఇరుదేశాల నావికా దళాల యుద్ధనౌకలు విన్యాసాల్లో పాల్గొంటుండగా భారత్ తరపున స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన నౌకలు ఐఎన్ఎస్ సత్పురా, కమోర్తాలు పెర్త్ చేరుకున్నాయి. ప్రపంచ దేశాలు లుక్ ఈస్ట్, ఏక్ట్ ఈస్ట్ పాలసీ పట్ల ఆసక్తిగా గమనిస్తున్న తరుణంలో ఈ విన్యాసాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.