breaking news
Increased prices
-
నాడు రూ.16.. నేడు రూ.20
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ వినియోగదారులను నిలువునా దోచుకుంటోంది. ఒకవైపు మార్కెట్లో నిత్యావసర సరకుల రేట్లు ఆకాశాన్ని తాకుతుంటే చోద్యం చూస్తూ... మరోవైపు రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే సరకుల రేట్లు మాత్రం అమాంతం పెంచేస్తోంది. జాతీయ ఆహార భద్రత చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ పేద ప్రజలపై భారం మోపుతోంది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ గాడితప్పింది. రాగులు, జొన్నలు, గోధుమ పిండి పంపిణీని అటకెక్కించింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే బియ్యం నాణ్యతకు పాతరేసింది. ఇప్పుడు పండగల వేళ ప్రజలను మభ్యపెట్టేందుకు పాత పంపిణీలనే కొత్తగా చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో తొలిసారిగా ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని పంపిణీ చేయగా... అధికారంలోకి వచ్చాక దానిని చంద్రబాబు కక్షపూరితంగా నిలిపివేసి... ఏడాదిన్నర తర్వాత రేటు పెంచి మళ్లీ పంపిణీ ప్రారంభిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కిలోకి రూ.4 చొప్పున పెంచేసి... వైఎస్సార్సీపీ హయాంలో పేదలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రాగులు, జొన్నల పంపిణీతోపాటు ఫోర్టీఫైడ్ గోధుమ పిండిని అందించారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బియ్యానికి బదులుగా ఉచితంగా రాగులు, జొన్నలు ఇచ్చేలా ఒప్పించారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎఫ్సీఐ నుంచి గోధుమలు సేకరించి వాటిని మరాడించి, ఫోర్టీఫైడ్ చేసి నాణ్యమైన ప్యాకింగ్లో కిలో రూ.16కే లబి్ధదారుల ఇంటి వద్దకే చేర్చారు. కానీ ఏడాదిన్నరగా ఆ గోధుమ పిండి పంపిణీని నిలిపివేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ జనవరి నుంచి కిలో రూ.20కి ఇస్తున్నట్టు ప్రకటించి అభాసుపాలైంది. ఎందుకంటే అప్పట్లో భారత్ బ్రాండ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వయంగా కిలో ప్యాకెట్ను రూ.27.50కి వినియోగదారులకు ఇస్తే.. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రం కిలో రూ.16కే అందించి ప్రజల మన్ననలు పొందింది. ఇప్పుడు అదే గోధుమ పిండి ప్యాకెట్కు ఏకంగా రూ.4 అదనంగా చంద్రబాబు దండుకోవడం విస్తుగొలుపుతోంది. అరకొర పంపిణీకే హడావిడి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నెలకు 1,839 టన్నుల గోధుమలను అందిస్తోంది. వాటిని మరాడిస్తే 1,690 టన్నుల పిండి వస్తుంది. ఈ పిండినే కిలో ప్యాకెట్లలో నింపి ప్రజలకు పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి ఏపీలో 1.48 కోట్ల రైస్ కార్డులున్నాయి. వీళ్లందరికీ కిలో గోధుమ పిండి అందించాలంటే నెలకు 15 వేల టన్నులు అవసరం. అలాంటిది నెలకు కేవలం 1690 టన్నులు మాత్రమే సరఫరా చేస్తుండడం... అది కూడా జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఇస్తుండటం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది.బినామీల కోసమే రేటు పెంచేసి..చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి స్కీము సరికొత్త స్కామ్ను తలపిస్తోంది. ఇందుకు ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా వదలట్లేదు. ప్రభుత్వం ఎఫ్సీఐ నుంచి కిలో గోధుమలు రూ.6.10కి కొనుగోలు చేస్తోంది. వాటిని మరాడించి... ఆ పిండిని కిలో చొప్పున ప్యాకింగ్ చేసి, ఎంఎల్ఎస్ పాయింట్లకు చేర్చి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు రూ.20కు ఇస్తోంది. వాస్తవానికి నవంబర్ 5న సాక్షాత్తూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కిలో గోధుమ పిండిని రూ.18కి ఇస్తున్నట్టు మీడియా సమక్షంలో ప్రకటించారు. అయితే, ప్రభుత్వం మాత్రం డిసెంబర్ 24 ఇచ్చిన జీవోలో కిలో గోధుమ పిండి రేటును రూ.20గా పేర్కొంది.ఇంతలోనే అంత వ్యత్యాసం రావడం వెనుక బినామీలు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కేవలం రూ.16కు అందించిన గోధుమ పిండి ఇప్పుడు ఏకంగా రూ.20కి చేరుకుంది. అప్పుడు.. ఇప్పుడూ రేషన్ దుకాణ డీలర్ కమిషన్ రూపాయిగానే ఉంది. కానీ ప్రజలపై మాత్రం భారం మోపుతోంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీకి మిల్లింగ్, ప్యాకింగ్ కాంట్రాక్టు అప్పగించారు. ఆ ఏజెన్సీ తమ దగ్గర ఎంప్యానల్ అయిన కంపెనీలకు మాత్రమే మిల్లింగ్, ప్యాకింగ్ బాధ్యతలు ఇచ్చింది.ఇందులో విచిత్రం ఏమంటే.. చంద్రబాబు బినామీ, మంత్రి వియ్యంకుడికి చెందిన కాకినాడ జిల్లాలోని ఓ కంపెనీకి గోధుమ పిండి మిల్లింగ్, ప్యాకింగ్ కాంట్రాక్టు దక్కింది. సదరు కంపెనీ సరఫరా విధానంలో గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. వాటిని పక్కన పెట్టిన సర్కార్ నోడల్ ఏజెన్సీ ద్వారా అనుకున్నది చేసింది. ఇక్కడ ఎంప్యానల్ చేసిన మిల్లుల కంటే బహిరంగంగా టెండర్ పిలిస్తే పోటీ పెరిగి మిల్లింగ్, ప్యాకింగ్ ధర తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. -
నషాళానికి ధరల కిక్కు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. ఐఎంఎఫ్ఎల్ కార్టన్ ప్రాథమిక ధరపై కనిష్టంగా 5 శాతం, గరిష్టంగా 12 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక ధర రూ. 450–700 ఉన్న కార్టన్కు 12 శాతం, రూ. 700–1,000 ఉన్న మద్యానికి 10 శాతం, రూ.1,000 ఆపైన ఉన్న లిక్కర్కు 5 శాతం చొప్పున పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ ప్రకారం చీప్ లిక్కర్ క్వార్టర్కు కనిష్టంగా రూ. 6, మీడియం లిక్కర్కు రూ. 10 నుంచి రూ. 20 వరకు, ప్రీమియం లిక్కర్ క్వార్టర్కు రూ. 70 నుంచి ఆపైన ధరలు పెరిగాయి. పెరిగిన ధరల్లో పన్నులు మినహాయించి మిగిలిన మొత్తాన్ని డిస్టిలరీల యాజమాన్యాలకే ఇవ్వనున్నారు. నేటి నుంచే ధరలు అమల్లోకి వస్తాయని, బీరు ధరలకు ఈ ఉత్తర్వులు వర్తించవని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 12 ఏళ్లలో ఇంత పెద్ద మొత్తంలో ధరలు పెరగటం ఇదే ప్రథమం. 2010లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో ధరలు స్వల్పం గా పెరిగాయి. ఐదేళ్లుగా నో టెండర్లు రాష్ట్రంలో దాదాపు 700 కంపెనీలు మద్యం సర ఫరా చేస్తున్నాయి. రాష్ట్రానికి అవసరమయ్యే మద్యం సరఫరాకు సంబంధించి ఏటా మద్యం కంపెనీలతో ప్రభుత్వం ఒప్పం దం చేసుకుంటుంది. సాధా రణంగా మే నుంచి జూన్ వరకు కాంట్రాక్టు ఒప్పందం గడువు ఉంటుంది. అవస రమైతే గడువును మరో ఏడాది టీఎస్బీసీఎల్ పొడిగించవచ్చు. కానీ వేర్వేరు కారణాలతో ఐదేళ్లుగా ప్రభుత్వం టెండర్లు పిలవడం లేదు. 2011లో కుదిరిన ఒప్పందం 2012 జూన్తోనే ముగిసినా పాత ఒప్పందాన్నే ఏటా రెన్యువల్ చేసుకుంటూ వస్తోంది. 2012లో ఒప్పందం ముగియగానే మద్యం బేసిక్ ధర పెంచాలని డిస్టిలరీల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రం విడిపోయే వరకు ఆ డిమాండ్ను అప్పటి సీఎంలు పట్టించుకోలేదు. కమిటీ ప్రకారమే.. తెలంగాణ ఏర్పాటయ్యాక ధరల పెంపు సాధ్యాసాధ్యా లపై ముగ్గురు సభ్యులతో టెండర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కంపెనీలకు అదనపు ధర కట్టివ్వొచ్చని అప్పట్లోనే ఆ కమిటీ నివేదికిచ్చింది. కానీ దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా అదే నివేదిక ఆధారంగా ధరలు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఇప్పటివరకు చీప్ లిక్కర్ పెట్టెకు (48 క్వార్టర్లు) రూ. 445, మీడియం లిక్కర్ పెట్టెకు రూ. 585, ప్రీమియం పెట్టెకు రూ.1,300 నుంచి రూ. 2,200 చొప్పున డిస్టిలరీల యాజమాన్యాలకు టీఎస్బీసీఎల్ చెల్లిస్తోంది. తాజాగా చీప్ లిక్కర్కు రూ. 509, మీడియం లిక్కర్కు రూ. 655, ప్రీమియం లిక్కర్కు రూ. 1,365 నుంచి రూ. 2,310 చొప్పున చెల్లించనుంది. 180 ఎంఎల్ క్వార్టర్కు అంచనా పట్టిక బ్రాండ్ ప్రస్తుత ధర పెరిగిన ధర రాయల్ గేమ్ 65 70 ఓల్డ్ టవెరన్ 80 90 ఆఫీసర్స్ చాయిస్ 90 100 ఏసీ ప్రీమియం 110 120 ఎంసీ విస్కీ 110 120 ఇంపీరియల్ బ్లూ 110 120 మీడియం లిక్కర్ రాయల్ స్టాగ్ 150 165 రాయల్ చాలెంజ్ 210 220 ప్రీమియం లిక్కర్ బ్లెండర్స్ ప్రైడ్ 240 260 సిగ్నేచర్ 250 275 100 పైపర్స్ 410 480 -
ఉల్లికిపాటు
సాక్షి, విశాఖపట్నం : జిల్లావాసులను ఉల్లి కన్నీళ్లు ఇప్పట్లో వీడేలా లేవు. పెరిగిన ధరలతో సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న వీటి ధర మరో రెండు మూడు నెలలైనా తగ్గేలా కనిపించడం లేదు. ఆకాశాన్నంటిన ధరలను ఎలాగైనా దించాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. డిమాండ్, సప్లయికి మధ్య అంతరం రోజురోజుకు పెరిగిపోతుండటంతో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాకు 136 మెట్రిక్ టన్నుల ఉల్లి అవసరమైతే కేవలం 3 టన్నులు మాత్రమే దిగుమతవుతోంది. దీంతో పెరిగిన వినియోగానికి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. కిలో రూ.60పైనే అమ్ముడుపోతోంది. దీనిని తగ్గించే క్రమంలో జిల్లా అవసరాలకు మించి సరకును దిగుమతికి ఇప్పటికే మార్కెటింగ్శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అందు కోసం రాష్ట్రంలో కర్నూలు తర్వాత హోల్సేల్ ఉల్లి వ్యాపారానికి రెండో కేంద్రంగా పెట్టింది పేరైన తాడేపల్లిగూడెం నుంచి రప్పించాలని ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా ఇక్కడి నుంచి రైతు బజార్ల ఎస్టేట్ అధికారులు ఇద్దరిని అక్కడకు ధరలు, నాణ్యత పరిశీలనకు పంపారు. తీరా అక్కడ హోల్సేల్ మార్కెట్లో కిలో రూ.45 నుంచి రూ.50 పలుకుతోంది. దానికి తోడు నిల్వలు తక్కువగా ఉండటం, ఉల్లిపాయల నాణ్యత అసలేం బాగోలేకపోవడంతో చేసేది లేక ఇటీవల తిరిగొచ్చేశారు. అక్కడ కొనుగోలుచేసినా రవాణా ఖర్చుతో కలిసి ఇక్కడ ధరకే అక్కడి నుంచి కొనుగోలు చేసినట్టవుతుందని ప్రయత్నాలు విరమించుకున్నారు. మరోపక్క సీఎం కిరణ్కుమార్రెడ్డి శుక్రవారం నిత్యావసర వస్తువుల ధరలు ఎలాగైనా తగ్గించే ప్రయత్నాలు చేయాలని ఆయా జిల్లాల అధికారులకు సూచించడంతో జేసీ కూడా రంగంలోకి దిగారు. మార్కెటింగ్శాఖ అధికారులతో మాట్లాడారు. అవసరమైతే జిల్లాతోపాటు చుట్టు పక్క జిల్లాల్లో ఉల్లిసాగుచేసే రైతులు,వ్యాపారులతో మాట్లాడి వారి నుంచి నేరుగా కొనుగోలుచేసి రైతుబజార్లలో విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాని వ్యాపారుల వద్దకూడా నిల్వలు లేకపోవ్చనే సమాచారంతో తదుపరి ఏంచేయాలనేదానిపై ఆలోచిస్తున్నారు. అక్కడంతా కుళ్లిపోయింది... : కర్నూలుతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జిల్లాకు ఉల్లి దిగుమతవుతోంది. ఇందులో అధిక భాగం మహరాష్ట్ర, కర్ణాటక నుంచే అధికారులు కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల అక్కడ భారీ వర్షాలతోపాటు,వరదల కారణంగా ఉల్లిపంట తీవ్రంగా నష్టపోయింది. ఉపయోగానికి వీలులేకు ండా కుళ్లిపోవడంతో దిగుమతులు నిలిచిపోయాయి. ఇప్పటికిప్పుడు జిల్లాలో ఉల్లి ధరలు దిగిరావాలంటే ఎంతలేదన్నా 140 మెట్రిక్ టన్ను ల సరకు వస్తేనే ధరలు దిగివస్తాయని చెబుతున్నారు.


