breaking news
Increased prices
-
నషాళానికి ధరల కిక్కు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. ఐఎంఎఫ్ఎల్ కార్టన్ ప్రాథమిక ధరపై కనిష్టంగా 5 శాతం, గరిష్టంగా 12 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక ధర రూ. 450–700 ఉన్న కార్టన్కు 12 శాతం, రూ. 700–1,000 ఉన్న మద్యానికి 10 శాతం, రూ.1,000 ఆపైన ఉన్న లిక్కర్కు 5 శాతం చొప్పున పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ ప్రకారం చీప్ లిక్కర్ క్వార్టర్కు కనిష్టంగా రూ. 6, మీడియం లిక్కర్కు రూ. 10 నుంచి రూ. 20 వరకు, ప్రీమియం లిక్కర్ క్వార్టర్కు రూ. 70 నుంచి ఆపైన ధరలు పెరిగాయి. పెరిగిన ధరల్లో పన్నులు మినహాయించి మిగిలిన మొత్తాన్ని డిస్టిలరీల యాజమాన్యాలకే ఇవ్వనున్నారు. నేటి నుంచే ధరలు అమల్లోకి వస్తాయని, బీరు ధరలకు ఈ ఉత్తర్వులు వర్తించవని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 12 ఏళ్లలో ఇంత పెద్ద మొత్తంలో ధరలు పెరగటం ఇదే ప్రథమం. 2010లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో ధరలు స్వల్పం గా పెరిగాయి. ఐదేళ్లుగా నో టెండర్లు రాష్ట్రంలో దాదాపు 700 కంపెనీలు మద్యం సర ఫరా చేస్తున్నాయి. రాష్ట్రానికి అవసరమయ్యే మద్యం సరఫరాకు సంబంధించి ఏటా మద్యం కంపెనీలతో ప్రభుత్వం ఒప్పం దం చేసుకుంటుంది. సాధా రణంగా మే నుంచి జూన్ వరకు కాంట్రాక్టు ఒప్పందం గడువు ఉంటుంది. అవస రమైతే గడువును మరో ఏడాది టీఎస్బీసీఎల్ పొడిగించవచ్చు. కానీ వేర్వేరు కారణాలతో ఐదేళ్లుగా ప్రభుత్వం టెండర్లు పిలవడం లేదు. 2011లో కుదిరిన ఒప్పందం 2012 జూన్తోనే ముగిసినా పాత ఒప్పందాన్నే ఏటా రెన్యువల్ చేసుకుంటూ వస్తోంది. 2012లో ఒప్పందం ముగియగానే మద్యం బేసిక్ ధర పెంచాలని డిస్టిలరీల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రం విడిపోయే వరకు ఆ డిమాండ్ను అప్పటి సీఎంలు పట్టించుకోలేదు. కమిటీ ప్రకారమే.. తెలంగాణ ఏర్పాటయ్యాక ధరల పెంపు సాధ్యాసాధ్యా లపై ముగ్గురు సభ్యులతో టెండర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కంపెనీలకు అదనపు ధర కట్టివ్వొచ్చని అప్పట్లోనే ఆ కమిటీ నివేదికిచ్చింది. కానీ దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా అదే నివేదిక ఆధారంగా ధరలు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఇప్పటివరకు చీప్ లిక్కర్ పెట్టెకు (48 క్వార్టర్లు) రూ. 445, మీడియం లిక్కర్ పెట్టెకు రూ. 585, ప్రీమియం పెట్టెకు రూ.1,300 నుంచి రూ. 2,200 చొప్పున డిస్టిలరీల యాజమాన్యాలకు టీఎస్బీసీఎల్ చెల్లిస్తోంది. తాజాగా చీప్ లిక్కర్కు రూ. 509, మీడియం లిక్కర్కు రూ. 655, ప్రీమియం లిక్కర్కు రూ. 1,365 నుంచి రూ. 2,310 చొప్పున చెల్లించనుంది. 180 ఎంఎల్ క్వార్టర్కు అంచనా పట్టిక బ్రాండ్ ప్రస్తుత ధర పెరిగిన ధర రాయల్ గేమ్ 65 70 ఓల్డ్ టవెరన్ 80 90 ఆఫీసర్స్ చాయిస్ 90 100 ఏసీ ప్రీమియం 110 120 ఎంసీ విస్కీ 110 120 ఇంపీరియల్ బ్లూ 110 120 మీడియం లిక్కర్ రాయల్ స్టాగ్ 150 165 రాయల్ చాలెంజ్ 210 220 ప్రీమియం లిక్కర్ బ్లెండర్స్ ప్రైడ్ 240 260 సిగ్నేచర్ 250 275 100 పైపర్స్ 410 480 -
ఉల్లికిపాటు
సాక్షి, విశాఖపట్నం : జిల్లావాసులను ఉల్లి కన్నీళ్లు ఇప్పట్లో వీడేలా లేవు. పెరిగిన ధరలతో సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న వీటి ధర మరో రెండు మూడు నెలలైనా తగ్గేలా కనిపించడం లేదు. ఆకాశాన్నంటిన ధరలను ఎలాగైనా దించాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. డిమాండ్, సప్లయికి మధ్య అంతరం రోజురోజుకు పెరిగిపోతుండటంతో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాకు 136 మెట్రిక్ టన్నుల ఉల్లి అవసరమైతే కేవలం 3 టన్నులు మాత్రమే దిగుమతవుతోంది. దీంతో పెరిగిన వినియోగానికి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. కిలో రూ.60పైనే అమ్ముడుపోతోంది. దీనిని తగ్గించే క్రమంలో జిల్లా అవసరాలకు మించి సరకును దిగుమతికి ఇప్పటికే మార్కెటింగ్శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అందు కోసం రాష్ట్రంలో కర్నూలు తర్వాత హోల్సేల్ ఉల్లి వ్యాపారానికి రెండో కేంద్రంగా పెట్టింది పేరైన తాడేపల్లిగూడెం నుంచి రప్పించాలని ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా ఇక్కడి నుంచి రైతు బజార్ల ఎస్టేట్ అధికారులు ఇద్దరిని అక్కడకు ధరలు, నాణ్యత పరిశీలనకు పంపారు. తీరా అక్కడ హోల్సేల్ మార్కెట్లో కిలో రూ.45 నుంచి రూ.50 పలుకుతోంది. దానికి తోడు నిల్వలు తక్కువగా ఉండటం, ఉల్లిపాయల నాణ్యత అసలేం బాగోలేకపోవడంతో చేసేది లేక ఇటీవల తిరిగొచ్చేశారు. అక్కడ కొనుగోలుచేసినా రవాణా ఖర్చుతో కలిసి ఇక్కడ ధరకే అక్కడి నుంచి కొనుగోలు చేసినట్టవుతుందని ప్రయత్నాలు విరమించుకున్నారు. మరోపక్క సీఎం కిరణ్కుమార్రెడ్డి శుక్రవారం నిత్యావసర వస్తువుల ధరలు ఎలాగైనా తగ్గించే ప్రయత్నాలు చేయాలని ఆయా జిల్లాల అధికారులకు సూచించడంతో జేసీ కూడా రంగంలోకి దిగారు. మార్కెటింగ్శాఖ అధికారులతో మాట్లాడారు. అవసరమైతే జిల్లాతోపాటు చుట్టు పక్క జిల్లాల్లో ఉల్లిసాగుచేసే రైతులు,వ్యాపారులతో మాట్లాడి వారి నుంచి నేరుగా కొనుగోలుచేసి రైతుబజార్లలో విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాని వ్యాపారుల వద్దకూడా నిల్వలు లేకపోవ్చనే సమాచారంతో తదుపరి ఏంచేయాలనేదానిపై ఆలోచిస్తున్నారు. అక్కడంతా కుళ్లిపోయింది... : కర్నూలుతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జిల్లాకు ఉల్లి దిగుమతవుతోంది. ఇందులో అధిక భాగం మహరాష్ట్ర, కర్ణాటక నుంచే అధికారులు కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల అక్కడ భారీ వర్షాలతోపాటు,వరదల కారణంగా ఉల్లిపంట తీవ్రంగా నష్టపోయింది. ఉపయోగానికి వీలులేకు ండా కుళ్లిపోవడంతో దిగుమతులు నిలిచిపోయాయి. ఇప్పటికిప్పుడు జిల్లాలో ఉల్లి ధరలు దిగిరావాలంటే ఎంతలేదన్నా 140 మెట్రిక్ టన్ను ల సరకు వస్తేనే ధరలు దిగివస్తాయని చెబుతున్నారు.