టీడీపీ కార్పొరేటర్ల ధర్నా
విజయవాడ:నగరంలోని టీడీపీ కార్పొరేటర్ల ధర్నా నిరసన బాటపట్టారు. కార్పోరేషన్ కు ఐవీ ప్యాలెస్ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలంటూ ఆ ప్యాలెస్ ఎదుటే ధర్న చేపట్టారు. నగర కార్పొరేషన్ కు ఐవీ ప్యాలెస్ రూ.7 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
ఆ ప్యాలెస్ నిర్వాహకుడు, కాంగ్రెస్ నేత ఐలాపురం వెంకయ్య ఆ బకాయిలను వెంటనే చెల్లించాలని కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు. బకాయిల చెల్లింపుపై కోర్టు తీర్పును ఆయన గౌరవించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.