breaking news
Government-owned company
-
పిలుస్తున్నాయి పీఎస్యూ'లు!
ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు మంచి వేతనం ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్యూ)లో ఉద్యోగం చేజిక్కించుకోవాలని ఆకాంక్షిస్తారు. ఇలాంటి వారికిగ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)మంచి మార్గం. ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఐఐఎస్సీ తదితర సంస్థల్లో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలతోపాటు ప్రభుత్వరంగ యూనిట్లలో ఉద్యోగాలకు కూడా గేట్ స్కోర్ ప్రామాణికంగా మారింది. దీంతో ఈ పరీక్షకు ప్రాధాన్యం పెరిగింది. గేట్-2017 స్కోర్ ఆధారంగా వివిధ పీఎస్యూలు నియామకాలకు శ్రీకారం చుట్టాయి.ఈ క్రమంలో ప్రత్యేక కథనం.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మహారత్న కంపెనీలు (భెల్, గెయిల్, ఎన్టీపీసీ..), నవరత్న కంపెనీలు (బీపీసీఎల్, హెచ్పీసీఎల్..), మినీరత్న కంపెనీలు (బార్క్, ఏఏఐ..) కార్పొరేట్ సంస్థలతో పోటీగా ఆకర్షణీయమైన వేతనాలు, సౌకర్యాలతో నియామకాలు చేపడుతున్నాయి. అభ్యర్థులు తాము ఇంజనీరింగ్లో చదువుతున్న కోర్ సబ్జెక్టుకు సంబంధించిన రంగంలోనే పనిచేసే అవకాశంతోపాటు, సంతృప్తినిచ్చే పని సంస్కృతిని పీఎస్యూలు అందిస్తున్నాయి. గ్రూప్-ఎ స్థాయి పోస్టులైన సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ ఎస్ఎఫ్ఐ (టెలీ), సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ (క్రిప్టో), ఎస్ఆర్వో (ఎస్ అండ్ టీ) నియామకాలకు కూడా గేట్ స్కోర్ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. బీఎస్ఎన్ఎల్.. జేటీవోల భర్తీకి కూడా గేట్ను ఆధారంగా చేసుకుంటోంది. గేట్-2017 ద్వారా 35-40 పీఎస్యూలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. గేట్లో జనరల్ కేటగిరీలో 500-1000 లోపు ర్యాంకు సాధిస్తే తదుపరి దశకు ఏదో ఒక సంస్థ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం, అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి స్కోర్ సాధించడానికి ప్రయత్నించాలి. రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వార్షిక వేతనం అందించే పీఎస్యూల్లో మేనేజ్మెంట్ ట్రెయినీ/ఇంజనీర్ ట్రెయినీ ఉద్యోగం సంపాదించాలంటే గేట్ స్కోర్ కీలకం. తుది ఎంపికలో గేట్ స్కోర్కు 75%-80% వెయిటేజీని పరిగణనలోకి తీసుకుంటారు. గేట్ స్కోర్ ఆధారంగా వడపోసిన అభ్యర్థులకు పీఎస్యూలు రెండో దశలో గ్రూప్ డిస్కషన్స్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూలు, రిటెన్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటిలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తారు. ఎంపికైనవారికి ఆకర్షణీయమైన వేతనాలతో ఆఫర్ లెటర్లు అందుతాయి. గ్రూప్ డిస్కషన్ (జీడీ) తుది ఎంపికలో గ్రూప్ డిస్కషన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆయా సంస్థలకు అవసరమైన నైపుణ్యాలను జీడీ ద్వారా పరీక్షిస్తాయి. ఇందులో అభ్యర్థులకు ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి, 10-15 నిమిషాలు చర్చించమంటారు. జీడీ ద్వారా భావ వ్యక్తీకరణ (communication), నాయకత్వ(leadership), బృంద స్ఫూర్తి (team spirit), సృజనాత్మక (ఛిట్ఛ్చ్టజీఠ్ఛి) తదితర నైపుణ్యాలను పరిశీలిస్తారు. గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ గ్రూప్ టాస్క్లో భాగంగా అభ్యర్థులకు ఒక టాస్క్ ఇచ్చి, దానికి సమాధానాలు కూడా ఇస్తారు. వీటి నుంచి ఒకదాన్ని ఎంపిక చేసుకొని, దాన్ని సమర్థించడానికి కారణాలు వివరించాల్సి ఉంటుంది. చివర్లో వ్యక్తిగత మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. ఇందులో ప్రధానంగా అడిగే అంశాలు.. అభ్యర్థి స్వీయ పరిచయం, బీఈ/బీటెక్ చివరి సంవత్సర ప్రాజెక్టు, తమకు పట్టున్న సబ్జెక్టు అంశాలు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆయా సంస్థలకు అభ్యర్థులు తమ ఇంజనీరింగ్ ప్రాజెక్టు ప్రాక్టికల్గా ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. వ్యక్తిగత ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెప్పాలి. ఇది అభ్యర్థి శ్రద్ధ, నైతికత, పరిపక్వతలను తెలియజేస్తుంది. ప్రతి ప్రశ్నను శ్రద్ధగా విని, సమాధానం చెప్పాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు ఒకట్రెండు మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం మంచిది. గతంలో ఆయా సంస్థలకు ఎంపికైన అభ్యర్థుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. సంస్థల వెబ్సైట్లను క్షుణ్నంగా పరిశీలించాలి. గేట్-2017 ద్వారా నియామకాలు జరిపే కొన్ని సంస్థలు బీఎస్ఎన్ఎల్ (జేటీవో) ఉద్యోగం: జూనియర్ టెలికం ఆఫీసర్ విభాగాలు: ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, సివిల్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంఎస్సీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఖాళీలు: 2510 దరఖాస్తు: 2017, జనవరి 1- జనవరి 31 వెబ్సైట్: www.externalexam.bsnl.co.in (2016, డిసెంబర్ 1 నుంచి అందుబాటులో ఉంటుంది.) బీపీసీఎల్ ఉద్యోగం: మేనేజ్మెంట్ ట్రెయినీ. విభాగాలు: మెకానికల్/కెమికల్ అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంపిక విధానం: గేట్ 2017 స్కోర్, జీడీ, ఇంటర్వ్యూ. దరఖాస్తు: 2017, జనవరి 1- జనవరి 31 వెబ్సైట్: www.bpclcareers.in హెచ్పీసీఎల్ ఉద్యోగం: గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ విభాగాలు: సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, టెలికాం. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్, జీడీ, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ. దరఖాస్తు: 2017, జనవరి 10-ఫిబ్రవరి 10 వెబ్సైట్: www.hindustanpetroleum.com/ www.hpclcareers.com ఎండీఎల్ (మజగావ్ డాక్ లిమిటెడ్) ఉద్యోగం: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (టెక్నికల్) విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్ అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఖాళీలు: 8. ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: 2017, జనవరి 6-ఫిబ్రవరి 6 వెబ్సైట్: www.mazagondock.gov.in కేబినెట్ సెక్రటేరియట్ ఉద్యోగం: సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ విభాగాలు: ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్; టెలీకమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్; ఫిజిక్స్/కెమిస్ట్రీ. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్. ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో పీజీ. ఖాళీలు: 8. ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా. వెబ్సైట్: www.cabsec.nic.in హెచ్పీయూ (హర్యానా పవర్ యుటిలిటీస్) ఉద్యోగం: అసిస్టెంట్ ఇంజనీర్. విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, సివిల్. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్ ఆధారంగా వెబ్సైట్: www.hvpn.gov.in -
ఏదీ.. నాటి వైభవం!
ఒకనాడు చెరుకు రైతులను ప్రోత్సహించి, చెరుకు సాగు పెంపుదల కోసం కృషి చేసిన ‘చెరుకు అభివృద్ధి మండళ్లు’ ప్రస్తుతం నిస్సహా య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా యి. సర్కారు అండ కరువై అలంకారప్రాయంగా మిగిలాయి. ఘన చరిత్ర కలిగిన సీడీసీలు నిధులు లేక, ఆదాయ వనరులు పడిపోయి నిర్వీర్యంగా దర్శనమిస్తున్నాయి. * అలంకారప్రాయంగా మారిన సీడీసీలు * పడిపోయిన ఆదాయ వనరులు * చెరుకు రైతుకు ప్రోత్సాహం కరువు * తెలంగాణ సర్కారుపైనే ఇక ఆశలు బోధన్: చక్కెర పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలో ఉండగా చెరుకు అభివృద్ధి మండళ్లకు (సీడీసీలు) పుష్కలంగా ఆదాయం ఉండేది. ఎందుకంటే, అపుడు చెరు కు క్రషింగ్ గణనీయంగా సాగేది. ఉమ్మడి రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలు ప్రయివేట్ సంస్థల గుప్పిట్లోకి వెళ్లడం, చెరుకు సాగు భారీగా తగ్గిపోవడంతో ఆదా యం పడిపోయింది. ప్రయివేటు యాజమాన్యాలు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. తెలంగాణ సర్కారయినా సీడీసీలకు మళ్లీ జీవం పోస్తే మేలు జరుగుతోందని రైతులు ఆశిస్తున్నారు. నామమాత్రపు సేవలు గతంలో చెరుకు సాగు విస్తీర్ణం పెంచేందుకు సీడీసీలు రైతులకు రాయితీపై పురుగు మందులు, ఎరువులు, సాగు నీటి సరఫరాకు పైపులు అందించేవి. చెరుకు రవాణాకోసం రహదారులు కూడా నిర్మించేవి. ప్రస్తు తం ఈ సేవలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. బోధన్ అసిస్టెంట్ కేన్ కమిషనర్ కార్యాలయ పరిధిలో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో చెరుకు ఫ్యాక్టరీలు లేనందున అక్కడ సీడీసీలు ఏర్పాటు కాలే దు. నిజామాబాద్ జిల్లాలో బోధన్, కామారెడ్డి,పిట్లం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో సీడీసీలున్నాయి. ఇందులో నిజామాబాద్ సీడీసీ మూతపడిం ది. కామారెడ్డి, పిట్లం సీడీసీల ద్వారా కొంత మేరకు సేవలందిస్తున్నారు. చెరుకు క్రషింగ్ పైనే సీడీసీలకు ఆదాయం వస్తుంది. క్రషింగ్ అయిన ప్రతి టన్నుకు ఎనిమిది రూపాయల చొప్పున యాజమాన్యాలు సీడీసీలకు చెల్లించాలి. రైతుల బిల్లుల నుంచి మరో నాలు గు రూపాయలు వస్తాయి. ప్రభుత్వ నిధులేమీ ఉండ వు. చెరుకు సాగు క్రమంగా పడిపోయి, సీడీసీలకు ఆదాయం తగ్గిపోయింది. రాజకీయ పునరావాస కేంద్రాలు ప్రభుత్వాలు సీడీసీ చైర్మన్, డెరైక్టర్లను నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తున్నాయి. దీంతో అవి రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నా యి. ఆసియా ఖండంలోనే అతి పెద్ద వ్యవసాయాధార పరిశ్రమగా పేరుపొందిన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో ఉండగా, 1990 వరకు ప్రతి సీజన్లో ఐదు లక్షల టన్నుల వరకు చెరుకు క్రషింగ్ అయ్యేది. ఇక్కడ 1962లో సీడీసీని ఏర్పాటు చేశారు. అప్పట్లో పుష్కలంగా ఆదాయం సమకూ రింది. 2002లో ఈ ఫ్యాక్టరీని ప్రయివేటీకరించారు. అప్పటి నుంచి 2013-14 సీజన్ వరకు ఇక్కడ రెండు లక్షల టన్నులకు పైగా మాత్రమే క్రషింగ్ జరిగింది. ఫలితంగా సీడీసీకి ఆదాయం పడిపోయింది. ఈ ఏడాది 1.09 లక్షల టన్నుల వరకు క్రషింగ్ జరిగే అవకాశం ఉంది. మరోవైపు చెరుకును సాగు చేస్తున్న రైతులకు లాభసాటి ధర అందని ద్రాక్షగానే మిగులుతోంది. చెరుకును లాభదాయకం గా మార్చేందుకు, ఇతర రాష్ట్రాలలో అనుసరిస్తున్న సాగు పద్ధతులు, అధిక దిగుబడుల విధానాలను అధ్య యనం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు సీడీసీలు, రైతులు, శాస్త్రవేత్తల భాగస్వామ్యం ఉండేలా చూడాలని రైతు నాయకులు కోరుతున్నారు. టీఆర్ఎస్ హామీ మే రకు చక్కెర ఫ్యాక్టరీలు ప్రభుత్వ పరమైతే సీడీసీలకు పూర్వ వైభవం వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి చక్కెర ఫ్యాక్టరీల పురోగతికి కోసం ప్రభుత్వం చెరుకు రైతులను ప్రోత్సహించాలి. రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి, లాభసాటి ధర అందే విధంగా చూస్తే సాగు గణనీ యంగా పెరిగే అవకాశం ఉం టుంది. ‘మన ఊరు-మన ప్రణాళిక’, స్టేట్ షుగర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ విభాగం ద్వారా చక్కెర పరిశ్రమల అభివద్ధి కోసం ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అవి పరిశీలనలో ఉన్నాయి. చెరుకు సాగు పెరిగితే సీడీసీలకు ఆదాయ వనరులు సమకూరుతాయి. - ఎం జాన్ విక్టర్, అసిస్టెంట్ కేన్ కమిషనర్, బోధన్ -
ఉపాధి కల్పనలో ఐటీ రంగం టాప్...
బెంగళూరు: దేశీయంగా ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్యూ) మించి ఐటీ కంపెనీలు ఉపాధి కల్పిస్తున్నాయని ఐటీ దిగ్గజం, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చెప్పారు. ఐటీ సంస్థలు 32 లక్షల పైగా ఉద్యోగాలు కల్పిస్తున్నాయని, ఏటా అదనంగా రెండు లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతోందని ఆయన తెలిపారు. తయారీ రంగానికి చైనా ప్రసిద్ధి చెందినట్లే .. ఐటీకి కేంద్రంగా భారత్ ఎదిగిందని మూర్తి పేర్కొన్నారు. కామన్వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. సాఫ్ట్వేర్ రంగంలో వచ్చే ప్రతి ఒక్క ఉద్యోగానికి పరోక్షంగా మరో మూడు ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుందని మూర్తి పేర్కొన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజాలు భారీ ఆదాయాలతో కల్పించినన్ని ఉద్యోగాలు.. వందేళ్ల చరిత్రలో మరే ఇతర కంపెనీ కూడా కల్పించలేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఈ ఉద్యోగాలు దేశీ ఎకానమీని కూడా గణనీయంగా మార్చేశాయి. వీటి తోడ్పాటుతో నేడు మన యువత ఖరీదైన వాహనాలు, గృహాలు కొనుక్కోగలుగుతున్నారు. సూపర్మార్కెట్లలో షాపింగ్ చేస్తున్నారు’ అని మూర్తి వివరించారు. మూడు వందల ఏళ్లలో తొలిసారిగా ఐటీ ఊతంతోనే భారత్ అంతర్జాతీయ వ్యాపారంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోగలిగిందని చెప్పారు. ‘ఇప్పుడు ఏ సంపన్న దేశానికెళ్లినా భారత్కి ప్రత్యేక గౌరవం ఉంది. సాఫ్ట్వేర్ పరిశ్రమే ఇందుకు కారణం. యావత్ప్రపంచానికి ఫ్యాక్టరీగా చైనా ఎలాగైతే పేరు పొందిందో.. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విషయంలో భారత్ కూడా అలాంటి పేరు తెచ్చుకుంది’ అని మూర్తి పేర్కొన్నారు. మరోవైపు, రాబోయే ఐదేళ్లలో దేశీ సాఫ్ట్వేర్ పరిశ్రమ 12-14 శాతం మేర వృద్ధి నమోదు చేయగలదని మూర్తి చెప్పారు. అటు కంపెనీలు సైన్స్, టెక్నాలజీపై కూడా దృష్టి సారించాలని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బయోకాన్ సంస్థ చీఫ్ కిరణ్ మజుందార్ షా సూచించారు.