breaking news
Goods and Services Act
-
జీఎస్టీ వసూళ్ల ఉత్సాహం
న్యూఢిల్లీ: ఎగవేత నిరోధక చర్యలు, అధిక వినియోగదారుల వ్యయాల ఫలితంగా జూలైలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 11 శాతం పెరిగి (2022 ఇదే నెలతో పోల్చి) రూ.1.65 లక్షల కోట్లకు చేరాయి. 2017 జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచి్చన తర్వాత, నెలవారీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లను అధిగమించడం వరుసగా ఇది ఐదవ నెల. ఆర్థికశాఖ ప్రకటన ప్రకారం వసూళ్ల తీరును క్లుప్తంగా పరిశీలిస్తే.. ► మొత్తం వసూళ్లు రూ.1,65,105 కోట్లు ► సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.29,773 కోట్లు. ► ఎస్జీఎస్టీ వసూళ్లు రూ.37,623 కోట్లు ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.85,930 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.41,239 కోట్ల వసూళ్లుసహా) ► సెస్ రూ.11,779 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.840 కోట్ల వసూళ్లుసహా) ఆర్థిక సంవత్సరంలో తీరిది... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో చరిత్రాత్మక స్థాయిలో రూ.1.87 లక్షల కోట్లు అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. మే, జూన్లలో వరుసగా రూ.1.57 లక్షల కోట్లు, రూ.1.61 లక్షల కోట్లు చొప్పున ఖజానాకు జమయ్యాయి. -
వెలుగులోకి మరో వందల కోట్ల ‘GST’ స్కాం.. కుంభకోణం చేసింది వీళ్లే
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న జీఎస్టీ స్కాంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్లను సృష్టిస్తున్న ముగ్గురు వ్యక్తులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) మీరట్ జోనల్ యూనిట్ అరెస్ట్ చేసింది. రూ.3,100 కోట్లకు పైగా నకిలీ బిల్లులు జారీ చేయడం, రూ.557 కోట్ల ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందడం వెనుక నిందితులు సూత్రధారులని తేలింది. నిందితులకు మీరట్ ఎకనమిక్స్ అఫెన్స్ కోర్టు ఆగస్ట్ 8 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నోయిడా పోలీసుల సమాచారంతో డీజీజీఐ విస్తృతంగా డేటాను తనిఖీలు చేసింది. తనిఖీలు అనంతరం ఆనంద్ కుమార్, అజయ్ కుమార్, విక్రమ్ జైన్లను అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ కంపెనీల పేరుతో అకౌంట్లను తెరవడంలో బ్యాంక్ అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు గుర్తించారు. అసలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించనప్పటికీ 240 షెల్ కంపెనీలకు బ్యాంక్ ఖాతాలను తెరించేందుకు అనుమతించిన కొన్ని బ్యాంకులపై డిజీజీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో 246 డొల్ల కంపెనీల ప్రమేయం ఉంది. రూ.2,142 కోట్ల నకిలీ ఇన్ వాయిస్ లను వెల్లడించే పత్రాలను డీజీజీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు సిండికేట్లు రూపొందించిన ఇన్వాయిస్లను నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్న 1,500 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. ఈ రెండు సిండికేట్లు 3 నకిలీ సంస్థల ద్వారా రూ.142 కోట్ల ఐటీసీతో కలిపి రూ.557,246 కోట్ల పన్ను పరిధిలోకి వచ్చే టర్నోవర్ కలిగిన ఇన్వాయిస్లను 1,500కు పైగా లబ్ధిదారుల సంస్థలకు జారీ చేసినట్లు డీజీజీఐ అధికారి ఒకరు తెలిపారు. ప్రధాన లబ్దిదారుల సంస్థలు ఢిల్లీలో ఉన్నాయని, మరికొన్ని ఇతర 26 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది. ఈ సిండికేట్ ఏజెంట్ల నెట్ వర్క్ తో పనిచేస్తూ పేదల ఆధార్, పాన్ కార్డులను సేకరించి వారికి కొద్ది మొత్తం చెల్లిస్తున్నట్లు తేలింది. చదవండి👉 'ఆ దగ్గు మందు కలుషితం.'. భారత్లో తయారైన సిరప్పై WHO అలర్ట్ -
రియల్టీకి జీఎస్టీ ఏం తెస్తోంది?
స్థిరాస్తి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? సర్వీస్ ట్యాక్స్లాగే అందుబాటు ఇళ్లకు జీఎస్టీని మినహాయించాలి ప్రాజెక్ట్ వ్యయంలో 27-33 శాతం పన్నుల రూపంలోనే చెల్లిస్తున్నాం దీనికంటే జీఎస్టీ రేటు తక్కువుంటేనే స్థిరాస్తి రంగానికి లాభం వస్తు సేవలను చట్టం (జీఎస్టీ)కి రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించేశారు కూడా. ఈ నేపథ్యంలో స్థిరాస్తి రంగం మీద జీఎస్టీ ప్రభావం ఎంత వరకుంటుంది? ధరలేమైనా తగ్గే అవకాశముందా? అందుబాటు ఇళ్ల పరిస్థితేంటి? వంటి అంశాలపై పలువురు స్థిరాస్తి నిపుణులతో ‘సాక్షి రియల్టీ’ చర్చించింది. హైదరాబాద్: ఐటీ రంగం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న రంగం స్థిరాస్తి రంగమే. స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం వాటా 7.8 శాతం వరకుంది. అలాంటి రంగంలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, సవాళ్లు జీఎస్టీ అమలుతో సమసిపోతాయి కూడా. జీఎస్టీ ప్రయోజనం స్థిరాస్తి రంగంపై దీర్ఘకాలంలో ఉంటుంది. ఏకీకృత పన్ను వ్యవస్థలో పారదర్శకత వస్తుందనడంలోనూ ఎలాంటి సందేహం అక్కర్లేదు. జీఎస్టీ రేటును ఎంతనేది నిర్ణయించకుండానే నిర్మాణ రంగానికి లాభం చేకూరతుందనడం మాత్రం సరైంది కాదనేది నిపుణుల అభిప్రాయం. 27-33 శాతం పన్నులే.. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాలు స్థలాలు, ప్రాపర్టీలు, ఇతర నిర్మాణ కాంట్రాక్ట్లకు సంబంధించి వివిధ రకాల పన్నులను వసూలు చేస్తున్నాయి. ఇవి ప్రధానంగా సేవల విలువ, వస్తువులు, ముడి పదార్థాల విలువ, భూమి విలువ అనే మూడు రకాలుగా ఉంటాయి. ఆయా పన్నులు విస్తీర్ణాన్ని, స్థలాన్ని, భవనాల ఎత్తును బట్టి కూడా మారుతుంటాయి. ‘‘ఇందులో వ్యాట్, సీఎస్టీ, సర్వీస్ ట్యాక్స్, ఎకై ్సజ్ డ్యూటీలే కాకుండా నిర్మాణ అనుమతుల కోసం స్థానిక సంస్థల ఫీజులు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు, నాలా చార్జీ, చేంజ్ ఆఫ్ ల్యాండ్, లేబర్ సెస్, ప్రాపర్టీ ట్యాక్స్, ఇంపాక్ట్ ఫీ.. వంటి బోలెడు చార్జీలున్నాయి. వీటన్నింటినీ కలిపితే మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 27-33 శాతం వరకు పన్నులే ఉంటాయని’’ భారత స్థిరాస్తి బిల్డర్ల సమాఖ్య (క్రెడాయ్) మాజీ జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి చెప్పారు. అంటే వెయ్యి కోట్ల ప్రాజెక్ట్లో మూడో వంతు పన్నుల రూపంలోనేపోతున్నాయన్నమాట. అయితే ఇప్పుడొస్తున్న జీఎస్టీ పరిధిలో సర్వీస్ ట్యాక్స్, ఎకై ్సజ్ డ్యూటీ, వ్యాట్, సీఎస్టీలు మాత్రమే ఉన్నాయి. మరి మిగిలిన పన్నులు యథావిధే అన్నమాటేగా. ఈ పన్నులే స్థిరాస్తి రంగానికి భారంగా మారుతున్నాయి. మరోవైపు నిర్మాణ సామగ్రి ధరలూ పెరుగుతున్నాయి. ఫలితంగా స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉండట్లేదు. ఇందులో వేటికీ మినహాయింపునివ్వకుండా జీఎస్టీని అమలు చేస్తే నిర్మాణ రంగానికి ఒరిగే ప్రయోజనమేమీలేదని రెడ్డి అభిప్రాయపడ్డారు. జీఎస్టీ ప్రయోజనం అప్పుడే.. ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నుల శాతం కంటే జీఎస్టీ రేటు తక్కువగా ఉంటేనే డెవలపర్లకు, కస్టమర్లకు ఇద్దరికీ లాభం. అంటే ప్రస్తుతం ముడి పదార్థాల మీద చెల్లిస్తున్న సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, ఎకై ్సజ్ డ్యూటీల కంటే జీఎస్టీ రేటు తక్కువగా ఉండాలి. అప్పుడే నిర్మాణ రంగానికి ప్రయోజనం. లేకపోతే ఆ భారాన్ని కూడా కొనుగోలుదారులే భరించాల్సి ఉంటుందని యార్డ్స్ అండ్ ఫీట్స్ ప్రాపర్టీ కన్సల్టెంట్ కళిశెట్టి నాయుడు చెప్పారు. నిర్మాణ రంగం సిమెంట్, స్టీల్ వంటి సుమారు 250కి పైగా పరిశ్రమలపై ఆధారపడి ఉంటుంది. ఆయా రంగాలు చెల్లిస్తున్న రకరకాల పన్నుల భారం అంతిమంగా ఉత్పత్తుల ధరలపై పడుతున్నాయి. కానీ, ఇప్పుడు జీఎస్టీతో ఆ భారం ఉండదు కనక.. ఆ తగ్గింపు ధరలకూ చేరుతుంది. ఫలితంగా డెవలపర్లకు నిర్మాణ వ్యయం తగ్గుతుంది. స్థిరాస్తి రంగానికి డిమాండ్ పెరుగుతుంది. అందుబాటు ఇళ్లకు మినహాయింపునిస్తేనే.. ‘‘గతంలోనే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ బిల్లు 2016ను తీసుకొచ్చింది కేంద్రం. అయితే అన్ని రాష్ట్రాల్లో ఈ బిల్లు అమలులోకి రావాలంటే మరో ఏడాదైనా సమయం పడుతుంది. ఈ తరుణంలో జీఎస్టీ పేరిట మరో బిల్లు రావటం నిర్మాణ రంగానికి మంచిదే. అయితే ప్రస్తుతం ఎలాగైతే అఫడబుల్ హౌజింగ్కు సర్వీస్ ట్యాక్స్ను మినహాయింపునిచ్చారో.. అలాగే జీఎస్టీని కూడా మినహాయింపునివ్వాలి. లేకపోతే అందుబాటు ఇళ్లకు గిరాకీ ఉండదు. కేంద్రం తీసుకొచ్చిన ‘హౌజింగ్ ఫర్ ఆల్-2022’ పథకానికి పెద్దగా ప్రయోజనం ఉండదని’’ శేఖర్ రెడ్డి వివరించా రు. ప్రస్తుతం స్థిరాస్తి కొనుగోలుదారులకు భారమయ్యేది స్టాంప్ డ్యూటీ దగ్గరే. అందుకే దీన్ని జీఎస్టీలో మిళితం చేయాలని గతంలోనే ప్రభుత్వానికి విన్నవించాం. కానీ, పట్టించుకోలేదన్నారు. ధరలు తగ్గుతాయా? స్థిరాస్తి ధరలు తగ్గుతాయా లేదా అనేది జీఎస్టీ రేటుపై ఆధారపడి ఉంటుంది. అయితే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్లపై జీఎస్టీ ప్రభావం ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పటికే ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లించేసి ఉంటారు. అయితే నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్ట్లకు మాత్రం జీఎస్టీ లబ్ధి చేకూరుతుంది. అదెలాగంటే.. సిమెంట్, స్టీలు, రంగులు, శానిటరీ వంటి నిర్మాణ సామాగ్రిపై చెల్లించే వివిధ రకరకాల పన్నుల భారం డెవలపర్లకుండదు. దీంతో నిర్మాణ వ్యయమూ తగ్గుతుంది. ఫలితంగా స్థిరాస్తి ధరలూ తగ్గుతాయి. కానీ, రకరకాల కారణాలతో డెవలపర్లు ఆ తగ్గింపును కొనుగోలుదారులకు చేరవేర్చరనేది కొనుగోలుదారుల వాదన. వాణిజ్య ప్రాజెక్ట్లకు చెల్లించే అధిక పన్నుల భారం తగ్గి.. వాణిజ్య ప్రాజెక్ట్లు లీజులు, అద్దెలూ పెరిగే అవకాశముంది.