100 షాపుల్లో ఎగిసిపడ్డ మంటలు
సంబల్పూర్: ఒడిషాలోని సంబల్పూర్లో అగ్నిప్రమాదం సంభవించింది. గోల్బజార్ మండీలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగిపడ్డాయి. చూస్తుండగానే వ్యాపించిన మంటలు సుమారు 100 షాపులకు అంటుకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు వేగంగా స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్సర్క్యూట్ మూలంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.