breaking news
godala kiran kumar
-
మాజీ కలెక్టర్కు 14 రోజుల కస్టడీ
పశ్చిమబెంగాల్లోని మాల్డా జిల్లా మాజీ కలెక్టర్ గోడల కిరణ్కుమార్ను సిలిగురి కోర్టు 14 రోజుల జైలు కస్టడీకి పంపింది. 200 కోట్ల రూపాయల స్కాంలో ఆయన పేరు ఉండటంతో.. ఈ కేసును విచారిస్తున్న సీఐడీని కావాలంటే జైలుకు వెళ్లి విచారించుకోవచ్చని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ దేవంజన్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు. 2005 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి అయిన కిరణ్ కుమార్ పేరు మొత్తం 8 ఎఫ్ఐఆర్లలో ఉంది. వాటిలో నాలుగు ఫిర్యాదులను ఆయన తర్వాత ఎస్జేడీఏ సీఈవోగా పనిచేసిన శరద్ ద్వివేది దాఖలుచేశారు. సిలిగురి జల్పాయిగురి డెవలప్మెంట్ అథారిటీ (ఎస్జేడీఏ) నుంచి నిధులు పక్కదోవ పట్టించారన్న ఆరోపణలు కిరణ్ కుమార్పై వచ్చాయి. 2011 సెప్టెంబర్ నుంచి 2013 మార్చి వరకు ఎస్జేడీఏ సీఈవోగా ఉన్న కిరణ్ కుమార్ దాదాపు 80 కోట్ల రూపాయలను పక్కదోవ పట్టించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, దాదాపు 200 కోట్ల రూపాయల స్కాంలో కూడా ఆయన పేరు వినవచ్చింది. -
బెంగాల్లో అవినీతి ఐఏఎస్ అరెస్టు.. ఊడిన పోలీసు కమిషనర్ ఉద్యోగం
పశ్చిమబెంగాల్లో వెంట వెంటనే రెండు సంఘటనలు జరిగాయి. మన రాష్ట్రానికి చెందిన బెంగాల్ కేడర్ ఐఏఎస్ అధికారి జి.కిరణ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో శనివారం అరెస్టయ్యారు. అయితే.. కొద్దిసేపటికే ఆయన అరెస్టు విషయంలో 'అధికారాలను అతిక్రమించి వ్యవహరించినందుకు' సిలిగురి పోలీసు కమిషనర్ జయరామన్ను ఉద్యోగం నుంచి ఊడగొట్టారు. సిలిగురి జల్పాయిగురి డెవలప్మెంట్ అథారిటీ (ఎస్జేడీఏ) నుంచి నిధులు పక్కదోవ పట్టించారన్న ఆరోపణలు కిరణ్ కుమార్పై వచ్చాయి. అయితే, ఆయనను అరెస్టు చేసేముందు మమత నేతృత్వంలోని ప్రభుత్వానికి చెప్పలేదన్న కారణంగా కమిషనర్ జయరామన్ ఉద్యోగం కాస్తా ఊడిపోయింది. 2011 సెప్టెంబర్ నుంచి 2013 మార్చి వరకు ఎస్జేడీఏ సీఈవోగా ఉన్న కిరణ్ కుమార్ దాదాపు 80 కోట్ల రూపాయలను పక్కదోవ పట్టించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, దాదాపు 200 కోట్ల రూపాయల స్కాంలోకూడా ఆయన పేరు వినవచ్చింది. ఐపీసీతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కూడా కిరణ్పై కేసులు నమోదయ్యాయి. ఆయనను అరెస్టు చేసిన తర్వాత నాలుగు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు పంపింది. అయితే, ఆయనను అరెస్టు చేసే విషయంలో ముందుగా ప్రభుత్వాన్ని సంప్రదించనందుకు జయరామన్ ఉద్యోగం ఊడిపోయినా, కిరణ్ కుమార్పై మాత్రం కేసు కొనసాగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ మిత్రా తెలిపారు. ఓ ఐఏఎస్ అధికారిని అరెస్టు చేసేముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నా, జయరామన్ అలా చేయలేదని ఆయన అన్నారు.