breaking news
Freshwater schemes Management
-
బురద నీటి నుంచీ తాగునీటి వరద
సాక్షి, అమరావతి: బురద నీటిని సైతం అంతర్జాతీయ ప్రమాణాల (ఐఎస్వో 10500) స్థాయిలో శుద్ధి చేసి తాగునీటిగా అందించే ఆధునిక పరిజ్ఞానాన్ని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) సొంతం చేసుకుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాకాలంలో సాగునీటి కాలువల ద్వారా పారే నీరు బురదమయంగా మారుతుండటంతో ఆ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాలకు ఆ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానిస్తోంది. తద్వారా ఐఎస్వో స్థాయికి శుద్ధి చేసిన నీటిని మంచినీటి పథకాల ద్వారా ప్రజలకు సరఫరా చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉపక్రమించారు. కాలువల్లో ఎక్కువ రోజులు బురద నీరే ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పలు మంచినీటి పథకాలకు సాగునీటి కాలువల ద్వారా నీటిని సేకరిస్తారు. అయితే, నీరు ఏడాదిలో ఎక్కువ రోజులు బురదమయంగా ఉంటోంది. వర్షాకాలంలో తరుచూ కురిసే వర్షాల వల్ల, ఎండకాలంలో స్టోరేజీ ట్యాంకులో నిల్వ ఉంచిన నీరు అడుగంటిన సమయంలో బురదమయంగా మారుతోంది. మంచినీటి పథకాల వద్దకు వచ్చి చేరే ఆ బురద నీటిని సాధారణ పద్ధతులలో శుద్ధిచేసి తాగు నీటిగా అందిస్తున్నారు. స్థానికులు ఆ నీటిని తాగునీటి కోసం ఉపయోగించుకోలేని పరిస్థితి. అక్కడి గ్రామాల్లో అవసరమైన స్థాయిలో మంచినీటి పథకాలు, నీరు అందుబాటులో ఉంటున్నా గత 10–12 ఏళ్లుగా ఆ జిల్లాల్లోని వందలాది గ్రామాలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా మంచినీటి పథకాల ద్వారా తాగునీటిని సరఫరా చేసే ముందు ఫిల్టర్ బెడ్ విధానంలో నీటిని శుద్ధి చేస్తారు. కంకర, ఇసుక పొరలతో ఏర్పాటు చేసిన ఫిల్టర్ బెడ్లలో నీటిని ఇంకించి.. ఆ తర్వాత బ్లీచింగ్ కలిపి ఆ నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ విధానంలో వంద లీటర్ల నీటిని ఫిల్టర్ బెడ్లోకి పంపితే, తిరిగి దాదాపు అదే స్థాయిలో నీరు తిరిగి అందుబాటులోకి రావాలి. కానీ.. బురద నీటిని నేరుగా పిల్టర్ బెడ్లోకి పంపినప్పుడు.. 60–70 శాతం నీరు ఇంకిన తర్వాత ఫిల్టర్ బెడ్లో ఉండే ఇసుక పొరపై బురద పేరుకపోయి మిగిలిన నీరు ఇంకే పరిస్థితి ఉండదు. దీంతో ఆ ఫిల్టర్ బెడ్ల ద్వారా ఇంకే నీరు ఒక రకమైన వాసన వస్తోంది. ఫిల్టర్ బెడ్లో ఇసుక పొరపై పేరుకుపోయిన మట్టిని ఎప్పటికప్పుడు తొలగిస్తే గానీ ఆ మంచినీటి పథకం పనిచేయని పరిస్థితి. ఇదే సమయంలో ఫిల్టర్ బెడ్లోని ఇసుక, కంకర పొరలను తరుచూ మార్చాల్సి ఉంటుంది. ఇదంతా వ్యయంతో కూడిన వ్యవహారం కావడంతో చాలా సందర్భాల్లో వాటిని బాగు చేయించే పరిస్థితి లేక పథకాలు వృథాగా ఉండాల్సి వచ్చేవి. ప్రీ ట్రీట్మెంట్ పద్ధతి విజయవంతం కావడంతో.. సాగునీటి కాలువల ద్వారా వచ్చే బురద నీటి శుద్ధికి మంచినీటి పథకాల వద్ద కొత్త టెక్నాలజీతో కూడిన ప్రీ ట్రీట్మెంట్ యూనిట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మంచినీటి పథకాల వద్ద ఉండే స్లో శాండ్ ఫిల్టర్లకు ముందే ఫ్యాకులేటర్, ట్యూబ్ సెట్లెర్లను రెండు వేర్వేరు విభాగాలతో అనుసంధానం చేయడం ద్వారా బురద నీటిని శుద్ధి చేస్తారు. ఆ నీటిని శాండ్ ఫిల్టర్ బెడ్ పైకి పంపడం వల్ల ఐఎస్వో స్థాయి మేరకు పరిశుభ్రమైన తాగునీటిగా శుద్ధి అవుతుంది. రెండు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసి సఫలం కావడంతో.. గోదావరి జిల్లాల్లో సమస్య ఉన్న ప్రతిచోట ఈ విధానం ద్వారా బురద నీటి శుద్ధి ప్రక్రియను కొత్తగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. రూ.88.60 కోట్లతో.. గోదావరి జిల్లాల్లో బురద నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ఈ విధానంలో నీటిని శుద్ధి చేసిన తర్వాతే మంచినీటి పథకాల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. రూ.88.60 కోట్లతో తూర్పు గోదావరి జిల్లాలో 16, పశ్చిమ గోదావరి జిల్లాలో 276 మంచినీటి పథకాల వద్ద ప్రీ ట్రీట్మెంట్ యూనిట్స్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని.. అనుమతి రాగానే పనులు చేపడతామని ఆర్డబ్ల్యూఎస్ సీఈ పి.సంజీవరావు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. -
మంచినీటి సమస్యకు ముందస్తు చర్యలు
ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలెక్టర్ ఇలంబరితి ఖమ్మం జెడ్పీసెంటర్ : వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా ముందస్తూ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ప్రజా‘ సమావేశ మందిరంలో ఆర్డబ్ల్యుఎస్ అధికారులతో మంచినీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా నిరంతరం విద్యుత్ అందించాలన్నారు. వచ్చే నెల 6న మంచినీటి పథకాల నిర్వహణలో తలెత్తుతున్న సమస్యలపై కూలంకషంగా చర్చించనున్నట్లు చెప్పారు. మంచినీటి పథకాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు గ్రామపంచాయతీ సర్పంచ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయూలన్నారు. విధివిధానాల రూపకల్పనకు ముందుగా ఒక మండలాన్ని పెలైట్ యూనిట్గా తీసుకుని పంచాయతీల ద్వారా మంచినీటి పథకాల నిర్వహణ చేపట్టేందుకు తీసుకోవాల్సిన అంశాలపై నివేదికలు రూపొందించాలని సూచించారు. నీటి సమస్య ఉన్న గ్రామాలలో ట్యాంకర్ల ద్వారా నీరు చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్యలను నివారించేందుకు సర్పంచ్,ఎంపీడీవో,ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించాలన్నారు. అధికారులు ప్రతిపాదనలు అందిస్తే మంచినీటి పథకాల నిర్వహణకు జడ్పీ ద్వారా నిధులు మంజూరు చేరుుస్తామన్నారు. పథకాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించి నివేదికలు తయూరు చేయూలని సీఈవోను ఆదేశించారు. బోరుబావుల తవ్వకాలకు వినియోగించిన నిధుల ఖర్చు, వాటి పనితీరు తదితరఅంశాలపై టాస్క్ ఫోర్సు ద్వారా తనిఖీ నిర్వహించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవో వినయ్కృష్ణారెడ్డి, ఖమ్మం ,కొత్తగూడెం కార్యనిర్వాహక ఇంజనీర్లు మల్లేష్గౌడ్,రాఘవులు, డీఈలు,ఏఈలు తదతరులు పాల్గొన్నారు.