సందడే..సందడి!
రాష్ట్రంలో దీపావళి సందడి నెలకొంది. బుధవారం పండుగ కావడంతో మంగళవారం అన్ని మాల్స్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయూరుు. ధరల మోతనూ, వర్షాలనూ లెక్క చేయకుండా కొనుగోళ్లు, విక్రయూలు సాగారుు. మరోవైపు కేంద్రం హెచ్చరికలతో రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక రాష్ట్ర ప్రజలకు గవర్నర్ రోశయ్య, డీఎండీకే అధినేత విజయకాంత్ శుభాకాంక్షలు తెలియజేశారు.
సాక్షి, చెన్నై: దీపావళి సందడి మంగళవారం రాత్రి నుంచే ఆరంభమైంది. పండుగను బుధవా రం ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. అయితే, దక్షిణ తమిళనాడులో వర్షాలు కురుస్తుండడం పం డుగకు ఆటంకంగా
మారింది. ఇక ఉత్తరాదిన వరుణుడు కరుణించడంతో నగరంలోని టీ నగర్, పురసై వాక్కం, ప్యారిస్, రాయపేట పరిసరాల్లోని అన్ని వాణిజ్య కేంద్రాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. అన్ని ప్రాంతాలూ సందడి సందడిగా కనిపించాయి. కొత్త దుస్తులు, పండుగకు అవసరమయ్యే వస్తువులు, బాణసంచాలు, స్వీట్లు వంటి వ్యాపారం జోరుగా సాగింది. జన సందోహం తరలి రావడంతో టీ నగర్, రంగనాథం వీధి, పాండి బజార్, పురసై వాక్కం, డౌటన్, ప్యారీస్, ఎన్ఎస్సీ బోస్ రోడ్డుల్లో పోలీసులు నిఘాతో వ్యవహరించారు. ఎప్పటికప్పుడు జనాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇక పండుగ శోభ సంతరించుకొనే రీతిలో నగరంలోని వాణిజ్య కేంద్రాలు విద్యుత్ దీప కాంతులతో కళకళలాడాయి.
నిఘా కట్టుదిట్టం: దీపావళి పర్వదినాన సంఘ విద్రోహ శక్తులు రెచ్చి పోవచ్చన్న కేంద్ర ఇంటె లిజెన్స్ హెచ్చరికతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. చెన్నైతో పాటుగా అన్ని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో సిబ్బంది రోడ్లెక్కారు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. అలాగే, నగరాల్లోని ప్రధాన కూడళ్లల్లో 24 గంటల పాటుగా షిఫ్ట్ పద్ధతిలో బృందాలు విధుల్ని నిర్వర్తించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది సిబ్బంది భద్రతా విధుల్లోకి దిగారు. చెన్నైలో 15 వేల మందిని దించారు.
జన సంచారం అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో ఈ సిబ్బంది విధుల్లో ఉంటారు.
జర భద్రం: బాణ సంచాల్ని కాల్చే సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని, వాటిని ఎలా పేల్చాలో అవగాహన కల్పిస్తూ అగ్ని మాపక శాఖ అధికారులు ప్రచారం చేశారు. ప్రధానంగా గుడిసె ప్రాంతాల్లో రాకెట్లు, గాల్లో పేలే ఇతర రంగు రంగుల బాణ సంచాల్ని నిషేధించాలని సూచించారు. రాత్రి పదిగంటలు దాటిన తర్వాత టపాసులు పేల్చొద్దని హెచ్చరించారు. ప్రమాద రహితంగా దీపావళిని జరుపుకుందామని పిలుపునిచ్చారు. గుడిసె ప్రాంతాలకు కూత వేటు దూరంలో అగ్నిమాపక వాహనాలను ముందు జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నారు. అనుమతి లేని బాణా సంచా దుకాణాలను సీజ్ చేశారు. ఇక పర్యావరణ శాఖ సైతం రోడ్డెక్కింది. ఎక్కడెక్కడ కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంటుందో పరిశీలించేందుకు తగిన పరికరాల్ని ఏర్పాటు చేయడం విశేషం.
శుభాకాంక్షలు: పండగను పరస్కరించుకుని గవర్నర్ రోశయ్య, ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్, టీఎన్సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్, కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, ఎస్ఎంకే నేత శరత్కుమార్, పుదియ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం, ఫార్వర్డ్ బ్లాక్ నేత సేతురామన్, తదితరులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో మరింత వెలుగు నింపాలని రోశయ్య కాంక్షించారు. ఈ పర్వ దినాన ప్రేమాను రాగాలు వికసించాలని, వెలుగుల దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
తరలిన జనం: నగరంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లంతా తమ స్వగ్రామాలకు తరలి వెళ్లారు. మూడు రోజులుగా ప్రత్యేక బస్సులు, రైళ్లు పరుగులు తీస్తున్నాయి. నగరంలో ప్రధాన మార్గాల్లో కాస్త ట్రాఫిక్ తగ్గింది. అయితే, కోయంబేడు బస్టాండ్ పరిసరాల్లో మాత్రం బస్సులతో రోడ్లు కిక్కిరిశాయి. చివరి రోజున 1600 బస్సులను నడపడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వగ్రామాలకు జనం పరుగులు తీశారు. సీట్ల కోసం ముందస్తుగా టోకెన్లు ఇవ్వడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నడిపిన బస్సుల ద్వారా మూడు రోజుల్లో మూడు లక్షల మంది చెన్నై నుంచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లినట్టు రవాణా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.